నాకు సొంత పొలం 8 ఎకరాలు ఉంటే మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకుని ఇప్పటి వరకు 11 ఎకరాల్లో పత్తి, 4 ఎకరాల్లో మిరప సాగు చేశాను. వర్షాభావంతో 4 ఎకరాల్లో సాగు చేసిన మిరప పంట దున్నేశాను. దీంతో రూ. 20 వేల వరకు నష్టం వచ్చింది. మరో 11 ఎకరాల్లో పత్తిపంట వేశాను. ప్రస్తుతం వర్షాభావం వల్ల పంట కూడా వాడుముఖం పట్టింది. కౌలు పొలంలో పంట సాగుచేశాను కాబట్టి యజమానికి ఎకరాకు రూ. 15 వేల చొప్పున కౌలు డబ్బులు కట్టాలి. ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
– కమాల్బాషా, కొర్రపాడు గ్రామం, రాజుపాలెం మండలం


