చంద్రబాబు సర్కారు డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేక.. నిరసన తెలిపిన వారికి సంకెళ్లు వేస్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఉక్కుపాదంతో పూడ్చిపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. చీపురుపల్లి–గరివిడి ప్రధాన రహదారిలోని మామిడికాయలశాల వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు బారికేడ్లు, తాళ్లతో మోహరించి అడ్డుకోవడంపై నిలదీశారు. అక్కడే బైఠాయించి సర్కారు తీరును ఎండగట్టారు. డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పాలని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లేకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


