మర్యాదపూర్వక కలయిక
పార్వతీపురం: పార్వతీపురానికి వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ను కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, ఎస్పీ మాధవ్రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ ఉన్నారు. మానవేంద్రనాథ్రాయ్ గురువారం గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తరువాత గుమ్మలక్ష్మీపురం మండలంలో ని గొరడలో వావిలాల బాపూజీ స్మారక వ్యవసాయ విజ్ఞాన సమాచార కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో... మన్యం విద్యార్థుల ప్రతిభ
పార్వతీపురం టౌన్/వీరఘట్టం: రాష్ట్రస్థాయి సైన్న్స్ ఫెయిర్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారని జిల్లా సైన్స్అధికారి లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విజ్ఞాన ప్రదర్శన పోటీ ల్లో జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఒక ప్రాజెక్టు, సౌత్ ఇండియా స్థాయిలో రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన గ్రామం ముస్తాబు–విజన్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ందన్నారు. ఇదే ప్రాజెక్టు సౌత్ ఇండి యా లెవెల్లో ఎంపికై నట్లు తెలిపారు. ఎంపీయూపీ మొట్టవలస విద్యార్థులు రూపొందించిన టెస్టులేష న్ ప్రాజెక్టు సౌత్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపి కై ందని వివరించారు. జాతీయస్థాయి పోటీలు మార్చినెలలో ఢిల్లీలో నిర్వహిస్తారని, సౌత్ ఇండి యా లెవెల్ పోటీలు జనవరి 19న హైదరాబాద్లో సాగుతాయని చెప్పారు. మన్యం జిల్లా విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు అభినందించారు.
●వీరఘట్టం మండలలలోని ఎం.వి.పురం యూపీ పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయురాలు డి. సంతోషికుమారి రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లో సత్తాచాటారు. ఆమె ప్రదర్శించిన ‘టెస్సలేషన్’ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఆమెను పాఠశాల హెచ్ఎం వై.శ్రీనుబాబు, సర్పంచ్ పి.వెంకటరమ ణ, ఎంఈఓ ఆనందరావు, తహసీల్దార్ కామేశ్వరరా వు అభినందించారు. టెస్సలేషన్ ప్రాజెక్టు ఒక జ్యామితీయ కళ. దీని ఆధారంగా తక్కువ ఖర్చుతో బిల్డింగ్ కనస్ట్రక్షన్స్ చేయవచ్చని
సంతోషికుమారి తెలిపారు.
హైకోర్టు జడ్జికి మొక్కలను అందజేస్తున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి, ఎస్పీ మాధవ్ రెడ్డి
మర్యాదపూర్వక కలయిక
మర్యాదపూర్వక కలయిక


