శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
సీతంపేట:
విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు సూచించారు. సీతంపేట గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన అన్వేష ఫెస్ట్ ముగింపు, బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. 53 గిరిజన విద్యాసంస్థల నుంచి 292 ప్రాజెక్టులు ప్రదర్శించడం గర్వించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులో గిరిజన విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. సైన్స్ఫెస్ట్లో సీనియర్, జూనియర్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 42 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముగ్గురు ఉపాధ్యాయులకు టీచర్ మోడల్స్ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర, డిప్యూటీఈఓ జి.రామ్మోహన్రావు, ఏటీడబ్ల్యూఓలు మల్లిఖార్జునరావు, సూర్యం, హెచ్ఎంలు టి.చంద్రరావు, పి.నారాయుడు, పి.కోటిబాబు, నల్లయ్య, వసంతకుమారి, జీసీడీఓ రాములమ్మ, సీఎంవో చిరంజీవులు, తదితరులు పాల్గొన్నారు.


