Sakshi News home page

లాడ్జిలో ఏం జరిగిందో? ఏమో?

Published Tue, Aug 1 2023 1:22 AM

- - Sakshi

శృంగవరపుకోట: ఎస్‌.కోట పట్టణంలో ఆదివారం కలకలం రేపిన హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. చందన్‌ లాడ్జిలో వెలుగుచూసిన హత్యోదంతంలో హతురాలిని దేవరాపల్లికి చెందిన ఆరిపాక ఈశ్వరమ్మ(48)గా నిర్ధారించారు. కాగా ఈశ్వరమ్మ ఒంటిపైన ఉన్న బంగారం కోసమే హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.

ఆమె కొన్నేళ్లుగా ఎస్‌.కోటలోనే నివాసం ఉంటోంది. అయితే ఈ హత్య కేసులో నిందితుడు ఎవరు? ఏ ఉద్దేశంతో హత్య చేశాడు? హత్య జరిగి ఎన్ని రోజులైంది? కేవలం బంగారం కోసమేనా? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పూర్తిస్థాయి వివరాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. మరిన్ని కచ్చితమైన సాక్ష్యాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం

Advertisement

What’s your opinion

Advertisement