అతిపెద్ద ఖగోళ పరిశోధన కేంద్రం
మంచాల: ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద ఖగోళ పరిశోధన కేంద్రంగా వెలుగొందిన జాపాల్– రంగాపూర్ నక్షత్రశాల నగరానికి కూత వేటు దూరంలో ఉంది. ప్రస్తుతం ఇది ఉస్మానియా యూనివర్సీ టికి అనుబంధంగా పని చేస్తోంది. 1963లో ఆస్ట్రానమీ డైరెక్టర్ కేడీ అభయాంకర్ సూచన మేరకు, కాలుష్యానికి దూరంగా నగరానికి 51 కిలోమీటర్ల దూరంలో, జాపాల్– రంగాపూర్ అటవీ ప్రాంతంలోని ఎత్తై న ప్రదేశంలో దీన్ని నిర్మించారు. 220 ఎకరాల్లో విస్తరించిన ఉన్న పరిశోధన కేంద్రం 1968లో అందుబాటులోకి వచ్చింది. 1980 ఫిబ్రవరి16న స్కైలాబ్ను ఇక్కడ నుంచే పరిశీలన చేశారు. 1986 ఫిబ్రవరి 9న హేలీ తోక చుక్కలు, ఇతర పాలపుంత లను ఇక్కడి నుంచే గమనించారు. 1994 జూన్16 నుంచి 21 వర కు వేర్వేరు తోక చుక్కలు, బృహస్పతి గ్రహాన్ని ఢీకొట్టిన చిత్రాలు, గ్రహాలపై ఏర్పడిన మచ్చల ఛాయాచిత్రాలను కూడా ఇక్కడి నుంచే తీశారు.
అతిపెద్ద ఖగోళ పరిశోధన కేంద్రం


