– ఉప్పు వ్యాపారి మృతి
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని ముచ్చివోలు సమీపంలో శనివారం ఉప్పు బస్తాలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. నెల్లూరు జిల్లా, సంగం మండలం, జానగొండ దిబ్బకు చెందిన మురళి (29) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో వెంకటగిరి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ముచ్చివోలు వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ సీఐ ఇబ్రహీం తెలిపారు.


