
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో పేపర్ల లీక్, పరీక్షల వాయిదాలు నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ రీ షెడ్యూల్ చేసే యోచనలో రాష్ట్రం ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ప్రకటిచింన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇక నుంచి నియామకాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ త్వరలో కొత్త పరీక్ష తేదీలను విడుదల చేయనుంది.