సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఏసీబీ అధికారులు సోదాల అంశం చర్చనీయాంశంగా మారింది. తాజాగా పటాన్చెరువు డీఎస్పీ భీమ్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఏక కాలంలో హైదరాబాదుతో పాటు 20 చోట్ల తనిఖీలు చేపట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. సోదాల్లో భాగంగా రూ.8 కోట్ల విలువైన విల్లాలు, భారీగా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఏసీబీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


