పొలం రిజి్రస్టేషన్‌కు డబ్బులు డిమాండ్‌ | Tehsildar Demanded Bribe For Name Change In Passbook In Khammam Ashwapuram, More Details Inside | Sakshi
Sakshi News home page

పొలం రిజి్రస్టేషన్‌కు డబ్బులు డిమాండ్‌

Jun 22 2025 11:08 AM | Updated on Jun 22 2025 2:38 PM

 Tehsildar demanded bribe for name change in passbook

తహసీల్దార్‌కు లంచం ఇస్తూ వీడియో తీసిన రైతు

అశ్వాపురం: పట్టాదారు పాస్‌ పుస్తకం ఉన్న పొలాన్ని తన అవసరం నిమిత్తం ఓ రైతు అమ్మేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకుని తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లగా.. రిజిస్ట్రేషన్‌కు తహసీల్దార్‌ డబ్బు డిమాండ్‌ చేశాడు. దీంతో ఆ రైతు తహసీల్దార్‌కు డబ్బులు ఇస్తూ వీడియో తీయగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన ఓ రైతు తన అవసరం నిమిత్తం మరో రైతుకు 20 గుంటల పొలం అమ్మాడు. 

ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేశాక రిజిస్ట్రేషన్ కు కోసం వెళ్లగా ఇద్దరు రైతులను కలిపి తహసీల్దార్‌ రాజారావు రూ.15 వేలు డిమాండ్‌ చేశాడు. వారు అవాక్కయి పాస్‌ బుక్‌ ఉందని, రిజి్రస్టేషన్‌కు డబ్బులు ఎందుకని ప్రశ్నించగా ఫార్మాలిటీ ఇవ్వాల్సిందే అన్నాడు. కానీ వారు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ రోజు రిజి్రస్టేషన్‌ చేయలేదు. మరునాడు పొలం అమ్మిన రైతు రూ.5 వేలు ఇస్తానని చెప్పడంతో తహసీల్దార్‌ రిజి్రస్టేషన్‌ చేశాడు. ఆపరేటర్‌కు రూ.1,000 ఇచ్చాడు. అయితే తహసీల్దార్‌కు రూ.5 వేలు ఇస్తూ రైతు తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండటంతో రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

తహసీల్దార్‌పై బదిలీ వేటు: తహసీల్దార్‌ రాజారావును బదిలీ చేస్తూ కలెక్టర్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రైతు నుంచి ఆయన నగదు తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోస్టింగ్‌ ఇవ్వకుండా కలెక్టరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించగా, అశ్వాపురం డీటీ ఎస్‌కే రషీద్‌ను తహసీల్దార్‌గా (ఎఫ్‌ఏసీ) నియమించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement