బీఆర్‌ఎస్‌ మీటింగ్‌లో అన్నం గిన్నె మోసిన ఎస్సై 

 SI photo went viral on social media - Sakshi

సోషల్‌ మీడియాలో ఫొటో వైరల్‌... 

కార్యకర్తల్ని అదుపు చేసేందుకు గిన్నెను పక్కకు పెట్టాను  

వివరణ ఇచ్చిన ఎస్సై  

హుజూర్‌నగర్‌: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సై వెంకటరెడ్డి అన్నం గిన్నె మోస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవు తోంది. హుజూర్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వెంకటరెడ్డి బందోబస్తు కోసం వెళ్లారు. అక్కడ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి అన్నం గిన్నెను మోయడం చర్చనీయాంశమైంది.

‘అక్కడ చాలామంది కార్యకర్తలు ఉన్నా కూడా ఓ ఎస్సై ఇలా ప్రవర్తించడం విస్మయానికి గురిచేసిందని, హుజూర్‌నగర్‌లో పోలీసులు చివరికి బీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్‌లలో అన్నం గిన్నెలు మోసే స్థితికి దిగజారారు, ఇంకా ప్రజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందా’అంటూ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సామాజిక మాధ్యమాలలో కామెంట్‌ పోస్టు చేశారు. ఈ విషయమై సదరు ఎస్సై వివరణ ఇస్తూ..భోజనం కోసం కార్యకర్తల మధ్య గొడవ జరుగుతుండగా వారిని అదుపు చేయడం కోసమే అన్నం గిన్నెను పక్కకు జరిపామని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top