Person Suicide Letter About Police Missing At Hanmakonda District, Details Inside | Sakshi
Sakshi News home page

సీఐ, ఎస్‌ఐ వేధిస్తున్నారు.. సూసైడ్‌ లేఖ రాసి..

May 1 2024 1:41 PM | Updated on May 1 2024 4:04 PM

Person Suicide Letter And Missing At Hanmakonda District

సాక్షి, హసన్‌పర్తి: తెలంగాణలో పోలీసుల వేధింపులే కారణమంటూ సూసైడ్‌ లేఖ రాసి పెట్టి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో కలకలం సృష్టించింది.

వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన ప్రశాంత్‌ కుమార్‌ అనే వ్యక్తి సూసైడ్‌ లేఖ రాసి పెట్టి అదృశ్యమయ్యాడు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ సూసైడ్‌ లేఖలో.. తన చావుకు సీఐ, ఎస్‌ఐ కారణమని తెలిపాడు. సీఐ తన సెల్‌ఫోన్‌, వాచీ లాక్కుకొని తనను తీవ్రంగా కొట్టారని ప్రశాంత్‌ ఆరోపించారు. పోలీసులు సమస్యను పరిష్కరించకపోగా తీవ్రంగా కొట్టడంతో దెబ్బలు భరించలేక సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యాడు. అలాగే, తన దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వమంటే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 Video Credit: Telugu Scribe

ఈ నేపథ్యంలో తన భర్తను కాపాడాలని హసన్‌పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య శ్యామల హన్మకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసుల కారణంగా అవమాన భారంతో తన భర్త ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని ఆమె తెలిపారు. ఇక, ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement