నేటి నుంచి ఎంఎంటీఎస్‌ కొత్త టైంటేబుల్‌ | New MMTS Timetable Released | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎంఎంటీఎస్‌ కొత్త టైంటేబుల్‌

Jan 1 2025 8:53 AM | Updated on Jan 1 2025 8:53 AM

New MMTS Timetable Released

సాక్షి, హైదరాబాద్: జనవరి 1 నుంచి ఎంఎంటీఎస్‌ కొత్త టైంటేబుల్‌ అమల్లోకి రానుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 88 ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌– మేడ్చల్, ఫలక్‌నుమా– ఉందానగర్, ఘట్‌కేసర్‌– లింగంపల్లి మధ్య కొత్తగా ఎంఎంటీఎస్‌ సేవలు విస్తరించాయి. 

ఈ మేరకు వివిధ మార్గాల్లో  ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్ల  వేళల్లో మార్పులు, చేర్పులు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మార్పులకు సంబంధించిన సమాచారం అన్ని ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో అందుబాటులో ఉంటుందన్నారు. నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌ ఆధారంగా కూడా తెలుసుకోవచ్చు. సంబంధిత రైల్వే స్టేషన్లలోని  స్టేషన్‌ మేనేజర్, విచారణ కేంద్రాన్ని సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement