Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ | Massive Theft At Industrialist House In Hyderabad Kachiguda, 2 Kg Gold Jewellery And Rs 3 Crore Cash Stolen | Sakshi
Sakshi News home page

Hyderabad: 2 కిలోల బంగారు నగలు, రూ. 3 కోట్ల నగదు అపహరణ

Apr 22 2025 8:35 AM | Updated on Apr 22 2025 10:49 AM

Massive theft at industrialist house In Hyderabad

పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ 

2 కిలోల బంగారు నగలు, రూ. 3 కోట్ల నగదు అపహరణ 

కాచిగూడ(హైదరాబాద్‌):  వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో పారిశ్రామికవేత్త హేమ్‌రాజ్‌ (62), అతడి భార్య మీనా దుగ్గర్‌ (59) నివాసముంటున్నారు. 

కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్‌రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే  హేమరాజ్‌ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచి్చంది. 

దీంతో అతను స్నేహితుడి ఇంటికి వచ్చి తలుపు కొట్టడంతో మత్తులో ఉన్న హేమ్‌రాజ్‌ డోర్‌ తీశాడు. భార్య మీనా పూర్తిగా మత్తులోకి జారుకుంది. దీనిని గుర్తించిన అతను వారిని హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చించాడు. ప్రస్తుతం హేమ్‌రాజ్‌ స్పృహలో ఉన్నాడని, అతని భార్య ఇంకా స్పృహలోకి రాలేదని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్‌జోన్‌ డీసీపీ, అడిషనల్‌ డీపీసీ, కాచిగూడ డిఐ, ఎస్‌ఐ పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. నాలుగు టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement