Governor Tamilisai Holds Woman Health Round Table Conference At Raj Bhavan, Hyderabad - Sakshi
Sakshi News home page

పిల్లల టిఫిన్‌ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్‌ తమిళిసై 

Aug 2 2023 11:47 AM | Updated on Aug 2 2023 3:19 PM

Governor Tamilisai Woman Health Round Table Meet Raj bhavan Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మనం కరెన్సీని కాదు.. కేలరీలను లెక్కించడం చాలా ముఖ్యం’ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మహిళా ఆరోగ్యంపై రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్త్రీలు, కౌమారదశలో ఉన్న బాలికల మానసిక, శారీరక శ్రేయస్సు ప్రధానమని పేర్కొన్నారు. 

బాల్యం నుంచే బాలికలకు యోగా, శారీరక వ్యాయామం, సంప్రదాయ ఆహార ప్రాధాన్యాన్ని తెలియజేయాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఎలాంటి ఆహారం ఇస్తున్నారో తెలుసుకోవాలంటే పిల్లల టిఫిన్‌ బాక్సులను తనిఖీ చేయాలని ఆమె సూచించారు. గతంలో తాను ఒకసారి అలా టిఫిన్‌ బాక్సులను పరిశీలించానని, చాలా బాక్సుల్లో బయటి నుంచి బర్గర్లు, చిప్స్, పఫ్స్, బిస్కెట్లు, స్నాక్స్‌ ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయానని తెలిపారు. 

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా మహిళల ఆరోగ్య అవసరాలపై ఇంకా స్పష్టత రాలేదని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి మరిన్ని మొబైల్‌ మెడికల్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయు ష్మాన్‌ భారత్‌లో మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు వ్యాధుల కవరేజీని ఎక్కువగా పెంచారని ఆమె వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement