కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఈటల భేటీ | Etela Rajender Meeting With Rajnath Singh | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఈటల భేటీ

Oct 14 2024 7:13 PM | Updated on Oct 14 2024 7:44 PM

Etela Rajender Meeting With Rajnath Singh

ఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కంటోన్మెంట్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు కారుణ్య నియామకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా సమయంలో పనిచేస్తూ దాదాపు 100 మందికి పైన పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారు. చనిపోయిన కార్మికుల అంశాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని  కారుణ్య నియామకాలు చేపట్టాని కోరారు.

కారుణ్య నియామకాలు  ఐదు శాతం మించకూడదన్న  నిబంధనను సడలించి , ఈ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement