
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మృతిచెందిన యువతిని సుష్మ(27)గా గుర్తించారు.
వివరాల ప్రకారం.. దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జి పైనుంచి సుష్మ అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బుధవారం హైటెక్ సిటీలోని కార్యాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలో రాత్రి దుర్గం చెరువు తీగల వంతెన వద్ద సుష్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం, ఆమె మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆమె వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు.