సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. భారీ వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ల్యాండింగ్కు అనుమతి నిరాకరించడంతో విమానాన్ని తిరిగి బెంగళూరు తరలించారు. కాసేపటి క్రితమే విమానం అక్కడ ల్యాండయ్యింది. రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుంది.
కాగా నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, చింతల్, బాలానగరల్ తదితర ప్రాంతాల్లో కుండపోతగా వానపడుతోంది. భారీగా వరద నీరు రోడ్లపైకి చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.


