HYD: కుక్కల దాడిలో బాలుడి మృతి | Boy Died In Dogs Attack In Patancheru | Sakshi
Sakshi News home page

HYD: కుక్కల దాడిలో ఎనిమిదేళ్ల బాలుడి మృతి

Jun 28 2024 3:27 PM | Updated on Jun 28 2024 3:38 PM

Boy Died In Dogs Attack In Patancheru

సాక్షి,హైదరాబాద్‌:  పటాన్‌చెరు ఇస్నాపూర్‌లో శుక్రవారం(జూన్‌28) దారుణం జరిగింది. కుక్కలదాడిలో ఎనిమిదేళ్ల బాలుడు విశాల్‌ మృతి చెందాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లినపుడు కుక్కలు విశాల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.

విశాల్‌ కుటుంబం కూలిపని చేసుకోవడానికి హైదరాబాద్‌ వచ్చింది. పొట్ట కూటి కోసం వచ్చి కొడుకును కోల్పోవడంపై విశాల్‌ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement