కమలహాసన్‌, దర్శకుడు అట్లీ, సల్మాన్‌ఖాన్‌ | - | Sakshi
Sakshi News home page

కమలహాసన్‌, దర్శకుడు అట్లీ, సల్మాన్‌ఖాన్‌

Oct 1 2024 3:14 AM | Updated on Oct 1 2024 7:45 PM

తమిళసినిమా: లోకనాయకుడు కమలహాసన్‌, బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ కలిసి నటిస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహించుకోండి. మీ ఊహ నిజం కాబోతోందన్నది తాజా సమాచారం. నటుడు కమలహాసన్‌కు తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం చిత్రాలు కొత్తేమీ కాదు. ఇక హిందీ చిత్రాల్లో నటించడం అస్సలు కొత్త కాదు. అదేవిధంగా పాన్‌ ఇండియా చిత్రాలు కూడా కొత్తేమీ కాదు.ఆయన ఇటీవల కూడా కల్కీ 2898 అనే పాన్‌ ఇండియా చిత్రంలో నటించారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న థగ్‌ లైఫ్‌ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. 

ఇకపోతే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ నటించిన చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంటుంది. ఆయన తమిళంలో నేరుగా ఇప్పటి వరకూ నటించకపోయినా, ఇక్కడ అభిమాన గణం ఎక్కువే. ఇక దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు శంకర్‌ శిష్యుడైన ఈయన రాజా రాణి చిత్రంతో దర్శకుడిగా మోగాఫోన్‌ పట్టి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత దర్శకత్వం వహించిన మెర్శల్‌, తెరి, బిగిల్‌ చిత్రాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇకపోతే ఇటీవల షారూఖ్‌ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం జవాన్‌ బ్లాక్‌బస్టర్‌ అయ్యి, రూ. 1200 కోట్లు వసూలు చేసింది. 

కాగా దర్శకుడు అట్లీ తదుపరి చిత్రంపై రకరకాల ప్రచారం జరుగుతోంది. తెలుగు చిత్రం అనీ, హిందీ చిత్రం అనీ, కాదు తమిళ చిత్రం చేయబోతున్నారని ప్రచారంలో ఉంది. కాగా తాజాగా నటుడు కమలహాసన్‌, బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ కలిసి నటించే పాన్‌ ఇండియా చిత్రాన్ని అట్లీ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అంతే కాదు ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మింనుందని సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement