ఇచ్ఛాపురం: తమిళనాడు యోగా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్, కై రలి యోగా విద్యా పీఠం ఆధ్వర్యంలో తిరువల్లూరు జిల్లా, గుమ్ముడిపూండి జెఎఫ్ఎన్ పారడైస్లో నిర్వహించిన సౌతిండియా యోగాసనాల పోటీల్లో పట్టణానికి చెందిన పాలేపు సాయిజగదీష్ సత్తా చాటి నాలుగు పతకాలు కై వ సం చేసుకున్నాడు. ఆదివారం నిర్వహించిన యోగాసనాల పోటీల్లో 13 నుంచి 16 ఏళ్ల విభాగంలో యోగా ట్విస్టింగ్ ఆసనాల్లో బంగారుపతకం, యో గా ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాల్లో రజత పతకం, స్టాండింగ్ ఆసనాల్లో రజత పతకం, బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాల్లో కాంస్యం సాధించాడు.


