న్యూస్రీల్
సోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026
ఈ ఫొటోలో ప్రధానంగా కనిపిస్తున్న వారిలో పలాస నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, పలాస, కాశీబుగ్గ పట్టణ ప్రధాన కార్యదర్శి సప్ప నవీన్ తదితరులు ఉన్నారు. పలాసలోని రామకృష్ణాపురం నుంచి కాశీబుగ్గ వస్తుండగా జరిగిన బైక్ యాక్సిడెంట్లో చనిపోయిన దుబ్బ దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలని, దానికి కారకులుగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని ఇటీవల చేసిన నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించింది వీరే. ఇక్కడ విశేషమేమింటే అంతకుముందు ఆ యాక్సిడెంట్కు సంబంధించి వీరితో పాటు అంబటి కృష్ణమూర్తి, శంకర్ తదితరులు రాజీ చేసి, బాధిత కుటుంబానికి పరిహారం అందించేలా ఒప్పందం చేశారు. తర్వాత వారిపై ఎవరి ఒత్తిళ్లు వచ్చాయో తెలియదు గాని మాట మార్చి ఏకంగా నిరసనకు దిగారు.


