సీఎం పర్యటనకు 1500 మంది పోలీసులతో బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు 1500 మంది పోలీసులతో బందోబస్తు

Apr 26 2025 1:09 AM | Updated on Apr 26 2025 1:09 AM

సీఎం పర్యటనకు 1500 మంది పోలీసులతో బందోబస్తు

సీఎం పర్యటనకు 1500 మంది పోలీసులతో బందోబస్తు

ఎచ్చెర్ల క్యాంపస్‌: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడగుట్లపాలెంలో శనివారం పర్యటించనున్నారు. ఈ కార్యక్రమానికి 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చెప్పారు. బుడగుట్లపాలెంలో పోలీస్‌ అధికారులతో శుక్రవారం భద్రత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది ముఖ్యమంత్రి వచ్చిన నుంచి పర్యటన పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాలు పార్కింగ్‌, తనిఖీ లు వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. నలుగురు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలతో కూడిన అధికారులు బందోబస్తు పర్యవేక్షిస్తారని చెప్పారు. 17 రోప్‌, స్పెషల్‌, క్యూఆర్డీ టీంలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. హెలీప్యాడ్‌, సభావేదిక, ఆలయ దర్శనం, లబ్ధిదారులతో ముఖా ముఖి వంటి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement