కలువాయిలో దివ్యాంగులకు 903 సర్వేలో 11 మందికి నివేశన స్థలాలకుకు సంబంధించి అధికారులు పట్టాలు మంజూరు చేశారు. అయితే పట్టాలు ఇవ్వలేదు. కలెక్టర్ కుల్లూరు గ్రామానికి పల్లెవీక్షణకు వచ్చినప్పుడు పట్టాలివ్వాలని అర్జీ ఇచ్చాం. దీంతో కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు అప్పటికప్పుడు పట్టాలిచ్చినట్టు ఫొటోలు కూడా దిగారు. మళ్లీ పట్టాలు తీసుకుని ఇప్పటికీ రెవెన్యూ అధికారులు ఏదో కారణం చెబుతూ పట్టాలివ్వలేదు. హద్దులు చూపించలేదు. ఎన్ని సార్లు తిరుగుతున్న తహసీల్దార్ పట్టించుకోవడం లేదు.
– రేవూరి శ్రీనివాసులు, మండల వికలాంగ
సంక్షేమ సంఘం అధ్యక్షుడు


