న్యూఢిల్లీ వేదికగా జరుగున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ - గాయత్రి గోపీచంద్ సత్తాచాటారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో చైనాకు చెందిన నాలుగో సీడ్ జై యి ఫాన్ - జాంగ్ షు క్సియాన్పై విజయం సాధించిన ఈ భారత జంట.. సెమీస్కు దూసుకెళ్లింది.
దీంతో 15 ఏళ్ల తర్వాత మహిళల డబుల్స్ విభాగంలో భారత్కు పతకం రానుంది. చివరిసారిగా 2011లో లండన్ వేదికగా జరిగిన టోర్నమెంట్లో అశ్విని పొన్నప్ప - జ్వాలా గుత్తా జోడీ కాంస్య పతకం సాధించింది. ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే.. గాయత్రి- ట్రీసా జాలీ జోడీ తొలి గేమ్ను 16-21తో కోల్పోయింది.
కానీ రెండో గేమ్లో భారత షట్లర్లు అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు. హోరాహోరీగా సాగిన రెండోగేమ్లో 21-15 తేడాతో భారత్ గెలిచి సమం చేసింది. నిర్ణయాత్మక మూడో గేమ్లోనూ గాయత్రి-ట్రీసా సత్తాచాటారు. 21-13 తేడాతో చైనా జోడీని చిత్తు చేసి గేమ్తో పాటు మ్యాచ్ను భారత జంట సొంతం చేసుకుంది. కాగా గాయత్రి గోపీచంద్ ఇటీవలే అర్జున అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.


