T20 WC 2021 ENG Vs NZ: ఆ అంపైర్‌ మళ్లీ వచ్చాడు... కివీస్‌ గెలవడం కష్టమే

T20 World Cup 2021: Wasim Jaffer Troll Kumar Dharmasena ENG Vs NZ Semi-Final - Sakshi

Waim Jaffer Trolls Umpire Kumar Dharmasena ENG vs NZ Semi FinalT20 Wc 2021.. టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ట్రోల్‌ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. టి20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య బుధవారం సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఫీల్డ్‌ అంపైర్స్‌లో కుమార ధర్మసేన ఒకడిగా వ్యవహరించనున్నాడు. దీంతో జాఫర్‌ కుమార్‌ ధర్మసేనను ట్రోల్‌ చేశాడు.

చదవండి: T20 WC 2021 ENG Vs NZ Semi Final-1: కివీస్‌ ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు

''హే.. కుమార్‌.. ఈరోజు మ్యాచ్‌ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది. నువ్వు ఈ మ్యాచ్‌లో అంపైరింగ్‌ చేస్తున్నావంటే న్యూజిలాండ్‌ ఇక గెలవడం కష్టమే '' అంటూ 2019 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ధర్మసేన  అంపైరింగ్‌ చేసిన ఫోటోను షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో ధర్మసేన చేతితో సిక్స్‌ అని సైగలు చేయడం కనిపిస్తుంది. నిజానికి 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ ఫీల్డర్‌ తప్పిదంతో  ఇంగ్లండ్‌కు ఓవర్‌ త్రోలో అదనంగా ఆరు పరుగులు(బౌండరీ) వచ్చి చేరాయి. ఆ సమయంలో ఫీల్డ్‌ అంపైర్‌గా ఉన్న ధర్మసేన ఇంగ్లండ్‌కు ఫేవర్‌గా ఆరు పరుగులు ఇచ్చాడు.

ఇక ఆరోజు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ఫైనల్‌ టై కావడం.. సూపర్‌ ఓవర్‌ కూడా టై కావడంతో.. ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌(26 బౌండరీలు) విశ్వవిజేతగా అవతరించింది. ఈ సందర్భంగానే జాఫర్‌ మరోసారి 2019 వన్డే ప్రపంచకప్‌ను గుర్తు చేస్తూ నేటి టి20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు అంపైరింగ్‌గా వ్యవహరిస్తున్న కుమార ధర్మసేనను టార్గెట్‌ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్‌ ఫెవరెట్‌.. న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top