ఆగస్టు 29 నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ | Pro Kabaddi League 2025 To Begin On August 29 | Sakshi
Sakshi News home page

ఆగస్టు 29 నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌

Jul 10 2025 8:45 AM | Updated on Jul 10 2025 12:12 PM

Pro Kabaddi League 2025 To Begin On August 29

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌ ఈ ఏడాది ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవల పీకేఎల్‌ వేలం ముగియగా... అన్ని ఫ్రాంచైజీలు జట్లను సిద్ధం చేసుకున్నాయి. త్వరలోనే వేదికలతో పాటు సీజన్‌ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

‘12 ఫ్రాంచైజీలు వేలంలో తమ తమ జట్లను బలోపేతం చేసుకున్నాయి. 12వ సీజన్‌ కోసం అన్నీ జట్లు సమాయత్తమవుతున్నాయి. గతం కంటే మరింత రసవత్తరంగా మ్యాచ్‌లు జరగడం ఖాయం’ అని నిర్వాహకులు వెల్లడించారు. మే 31, జూన్‌ 1న ముంబై వేదికగా పీకేఎల్‌ వేలం పాట జరగగా... రికార్డు స్థాయిలో 10 మంది ఆటగాళ్లు కోటి రూపాయాల కంటే ఎక్కువ ధర దక్కించుకున్నారు. 

వచ్చే నెల ఆఖరులో ప్రారంభం కానున్న పీకేఎల్‌లో హర్యానా స్టీలర్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇక గత సీజన్‌లో 22 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్‌... 12 విజయాలు, 10 పరాజయాలతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement