ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ.. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్‌  | Kidambi Srikanth Goes Down In India Open Opener | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ.. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన శ్రీకాంత్‌ 

Jan 18 2024 10:28 AM | Updated on Jan 18 2024 10:28 AM

Kidambi Srikanth Goes Down In India Open Opener - Sakshi

న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలోని రెండో టోర్నమెంట్‌లోనూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ నుంచి శ్రీకాంత్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 22–24, 13–21తో ప్రపంచ 18వ ర్యాంకర్‌ లీ చెయుక్‌ యి (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయాడు.

ఈ టోర్నీకంటే ముందు మలేసియా ఓపెన్‌లో ఆడిన శ్రీకాంత్‌ రెండో రౌండ్‌లో ఓటమి చవిచూశాడు. మరోవైపు పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) ద్వయం 78 నిమిషాల్లో 21–15, 19–21, 21–16తో ఫాంగ్‌ చి లీ–ఫాంగ్‌ జెన్‌ లీ (చైనీస్‌ తైపీ) జోడీపై కష్టపడి గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో తనీషా క్రాస్టో–అశి్వని పొన్నప్ప (భారత్‌) జంట 5–21, 21–18, 11–21తో జాంగ్‌కోల్ఫన్‌–ప్రజోంగ్‌జాయ్‌ (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement