
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో వరుస ఓటుములతో సతమతమవుతున్న రాజస్తాన్ రాయల్స్ ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్ 24న చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్తాన్ తాడోపేడో తెల్చుకోనుంది.
ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే రాజస్తాన్కు ఈ మ్యాచ్ చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్కు రాయల్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆర్సీబీతో మ్యాచ్కు కెప్టెన్ సంజూ శాంసన్ గాయం దూరమయ్యాడు. సంజూ ప్రస్తుతం పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు.
అతడు గాయం నుంచి కోలుకోవడానికి మరో వారం రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్కు శాంసన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాయల్స్ ఫ్రాంచైజీ ధ్రువీకరించింది. శాంసన్ కోలుకుంటున్నాడని, జట్టుతో పాటు బెంగళూరుకు వెళ్లకుండా జైపూర్లోనే ఉండిపోయినట్లు రాజస్తాన్ మెనెజ్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
దీంతో అతడి స్ధానంలో రియాన్ పరాగ్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. కాగా ఈ ఏడాది సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో అనూహ్య ఓటములను చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్పై సూపర్ ఓవర్లో పరాజయం పాలైన రాజస్తాన్.. ఆఖరి మ్యాచ్లో లక్నోపై 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాజస్తాన్ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడి కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదివ స్ధానంలో ఉంది.
చదవండి: IPL 2025: 'వారిద్దరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు'.. స్టార్ క్రికెటర్లపై సెహ్వాగ్ ఫైర్