
Photo Courtesy: BCCI
రాజస్థాన్ రాయల్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేయగా.. రాజస్థాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది.
76 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
8.6వ ఓవర్- 76 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ ఏడో వికెట్ కోల్పోయింది. కర్ణ్ శర్మ బౌలింగ్లో దృవ్ జురెల్ (11) క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు.
64 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
7.1వ ఓవర్- 64 పరుగుల వద్ద రాజస్థాన్ ఆరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బౌల్ట్కు క్యాచ్ ఇచ్చి శుభమ్ దూబే (15) ఔటయ్యాడు.
వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన రాజస్తాన్
ఇన్నింగ్స్ 5వ ఓవర్లో బుమ్రా బౌలింగ్లో రాజస్తాన్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్ ఐదో బంతికి బుమ్రా బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో హెట్మైర్ డకౌటయ్యాడు. దీంతో రాజస్థాన్ 47 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్
4.4వ ఓవర్- 217 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (16) ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్
3.6వ ఓవర్- 41 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో నితీశ్ రాణా (9) ఔటయ్యాడు. రియానప పరాగ్ (11), జురెల్ క్రీజ్లో ఉన్నారు.
టార్గెట్ 218.. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్
1.4వ ఓవర్: 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 18 పరుగులకే ఓపెనర్లు ఇద్దరి వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లో బౌల్ట్ బౌలింగ్లో రెండు భారీ సిక్సర్లు బాదిన అనంతరం యశస్వి జైస్వాల్ అదే ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
డకౌటైన బేబీ బాస్
గత మ్యాచ్లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో డకౌటయ్యాడు. తానెదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్కు చేరాడు. దీపక్ చాహర్ బౌలింగ్లో విల్ జాక్స్ వైభవ్ క్యాచ్ పట్టాడు.
రెచ్చిపోయిన బ్యాటర్లు.. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రాయల్స్ బౌలరల్లో రియాన్ పరాగ్, తీక్షణ తలో వికెట్ తీశారు.
భారీ స్కోర్ దిశగా ముంబై ఇండియన్స్
టాస్ ఓడి తొలుత బ్యాటంగ్ చేస్తున్నముంబై ఇండియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 16 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 161/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (25), హార్దిక్ పాండ్యా (16) ధాటిగా ఆడుతున్నారు.
రోహిత్ శర్మ ఔట్
12.4వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. రియాన పరాగ్ బౌలింగ్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (53) ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్
11.5వ ఓవర్- 116 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్లో రికెల్టన్ (61) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్కు (52) జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చాడు.
31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ
తీక్షణ బౌలింగ్లో బౌండరీ బాది రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ 31 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 11.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 113/0గా ఉంది. రోహిత్ 51, రికెల్టన్ 60 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రికెల్టన్
కుమార్ కార్తికేయ బౌలింగ్లో సిక్సర్ బాది రికెల్టన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రికెల్టన్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 90/0గా ఉంది. రికెల్టన్తో పాటు రోహిత్ శర్మ (37) కూడా జోరుమీదున్నాడు.
ఆచితూచి ఆడుతున్న ముంబై ఓపెనర్లు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై నిదానంగా ఆడుతుంది. రాయల్స్ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. ముంబై ఓపెనర్లు రికెల్టన్ (27), రోహిత్ శర్మ (17) ఆచితూచి ఆడుతున్నారు. రోహిత్ ఓసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 45/0గా ఉంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. వరుస విజయాలతో (5) దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ను రాజస్థాన్ రాయల్స్ సొంత మైదానంలో ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్లో రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేయగా.. ముంబై గత మ్యాచ్లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. హసరంగ, సందీప్ శర్మ గాయాల కారణంగా ఈ మ్యాచ్కు దూరం కానున్నారు. వీరి స్థానాల్లో కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్ రాయల్స్ తుది జట్టులోకి వచ్చారు.
తుది జట్లు..
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, ఫజల్హక్ ఫరూఖీ
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
కాగా, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో రాయల్స్ తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.
మరోవైపు ముంబై ఇండియన్స్కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.