రాణించిన అభిమన్యు, రాహుల్‌ | India A eye on huge lead in the second innings | Sakshi
Sakshi News home page

రాణించిన అభిమన్యు, రాహుల్‌

Jun 9 2025 1:42 AM | Updated on Jun 9 2025 1:42 AM

India A eye on huge lead in the second innings

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ‘ఎ’ 163/4

రెండో అనధికారిక టెస్టు  

నార్తంప్టన్‌: ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో కదంతొక్కగా... రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో రాణించాడు. దీంతో భారత్‌ ‘ఎ’ భారీ ఆధిక్యంపై కన్నేసింది. ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (80; 10 ఫోర్లు), రాహుల్‌ (51; 9 ఫోర్లు) రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. 

మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (5), మిడిలార్డర్‌లో కరుణ్‌ నాయర్‌ (15; 3 ఫోర్లు) విఫలమయ్యారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ధ్రువ్‌ జురేల్‌ (6 బ్యాటింగ్‌), నితీశ్‌ రెడ్డి (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. క్రిస్‌ వోక్స్‌కు 2 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని భారత్‌ ప్రస్తుతం 184 పరుగులు ఆధిక్యంలో ఉంది. చేతిలో ఇంకా 6 వికెట్లున్నాయి.  

భారత్‌కు స్వల్ప ఆధిక్యం 
అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 192/3తో మూడో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ లయన్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్లలో 327 పరుగుల వద్ద ఆలౌటైంది. భారత్‌కు 21 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. క్రితంరోజు బ్యాటర్లలో జోర్డాన్‌ కాక్స్‌ (45; 7 ఫోర్లు) మెరుగ్గా ఆడగా, కెప్టెన్‌ జేమ్స్‌ ర్యూ (10) విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ 4 వికెట్లు దక్కాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement