చారిత్రక లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌ | India Disability Team Script History At Lord’s, Dedicate Win Over ENG To 1983 WC | Sakshi
Sakshi News home page

చారిత్రక లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌

Jun 27 2025 9:16 PM | Updated on Jun 27 2025 9:16 PM

India Disability Team Script History At Lord’s, Dedicate Win Over ENG To 1983 WC

భారత దివ్యాంగుల క్రికెట్‌ జట్టు (మిక్స్‌డ్‌) చారిత్రక లార్డ్స్‌ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టును 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ చివరి ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 

అంగస్‌ బ్రౌన్‌ (47 బంతుల్లో 77; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లలో వివేక్‌ కుమార్‌, కెప్టెన్‌ రవీంద్ర సంటే తలో వికెట్లు తీశారు.

అనంతరం బరిలోకి దిగిన భారత్‌.. ఓపెనర్‌ రాజేశ్‌ ఇరప్పా కున్నూర్‌ (29), సాయి ఆకాశ్‌ (34 బంతుల్లో 44) సత్తా చాటడంతో 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో భారత్‌ ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. 

దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. క్రికెట్‌ మక్కాగా పిలువబడే లార్డ్స్‌ మైదానంలో ఇది తొలి దివ్యాంగుల అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌. ఈ గెలుపును భారత దివ్యాంగుల జట్టు 1983 వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టుకు అంకితమిచ్చింది.

ఈ మ్యాచ్‌ జూన్‌ 25న జరిగింది. 42 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు లార్డ్స్‌ మైదానంలో కపిల్‌ డెవిల్స్‌ వెస్టిండీస్‌ను చిత్తు చేసి తొలిసారి జగజ్జేతగా అవతరించింది. జూన్‌ 25ను వరల్డ్‌ మిక్స్‌డ్‌ డిజేబులిటీ డేగా (World Mixed Disability Day) జరుపుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement