Jonny Bairstow: రెండేళ్ల తర్వాత మళ్లీ అదే లార్డ్స్‌లో | IND Vs ENG: Jonny Bairstow Half Century Test Cricket After Two Years Lords | Sakshi
Sakshi News home page

Jonny Bairstow: రెండేళ్ల తర్వాత మళ్లీ అదే లార్డ్స్‌లో

Aug 14 2021 5:57 PM | Updated on Aug 14 2021 7:11 PM

IND Vs ENG: Jonny Bairstow Half Century Test Cricket After Two Years Lords - Sakshi

లార్డ్స్‌: ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌ స్టో  రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు టెస్టుల్లో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. విచిత్రమేమిటంటే.. బెయిర్‌ స్టో టెస్టుల్లో చివరి అర్థ సెంచరీ నమోదు చేసింది లార్డ్స్‌ మైదానంలోనే. 2019లో  లార్డ్స్‌ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బెయిర్‌ స్టో 52 పరుగులు చేశాడు. రెండేళ్ల తర్వాత అర్థ సెంచరీ మార్క్‌ను అందుకోవడంతో బెయిర్‌ స్టో తన బ్యాట్‌ను డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు చూపిస్తూ సెలబ్రేషన్‌ చేసుకోవడం వైరల్‌గా మారింది. కెప్టెన్‌ రూట్‌ కూడా బెయిర్‌ స్టోను అభినందిస్తూ హగ్‌ చేసుకున్నాడు. కాగా బెయిర్‌ స్టో ఇంగ్లండ్‌ తరపున 76 టెస్టుల్లో 4307 పరుగులు, 89 వన్డేల్లో 3498 పరుగులు, 57 టీ20ల్లో 1143 పరుగులు చేశాడు

ఇక టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌ నిలకడగా ఆడుతుంది.  లంచ్‌ సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. జో రూట్‌ 89 పరుగులతో సెంచరీకి చేరువ కాగా.. జానీ బెయిర్‌ స్టో 51 పరుగులతో ఆడుతున్నాడు.  టీమిండియా బౌలర్లలో సిరాజ్‌ రెండు.. షమీ ఒక వికెట్‌ తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement