భారత మహిళల ఘన విజయం  | Great win for Indian women | Sakshi
Sakshi News home page

భారత మహిళల ఘన విజయం 

Jul 30 2023 2:27 AM | Updated on Jul 30 2023 2:27 AM

Great win for Indian women - Sakshi

బార్సిలోనా: స్పానిష్‌ హాకీ ఫెడరేషన్‌ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న టోర్నీలో భారత మహిళల జట్టుకు తొలి విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3–0 గోల్స్‌ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భారత్‌ తరఫున అన్నీ గోల్స్‌ తానే సాధించిన లాల్‌రెమ్‌సియామి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేయడం విశేషం.

మ్యాచ్‌ 13వ, 17వ, 56వ నిమిషాల్లో ఆమె మూడు ఫీల్డ్‌ గోల్స్‌ కొట్టింది. మొదటి, రెండో క్వార్టర్‌లో ఒక్కో గోల్‌ సాధించిన భారత్‌ చివరి క్వార్టర్‌లో మరో గోల్‌తో ముగించింది. ఈ టోరీ్నలో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశలో ఇంగ్లండ్, స్పెయిన్‌లతో తొలి రెండు మ్యాచ్‌లను భారత్‌ ‘డ్రా’గా ముగించింది. సవితా పూనియా నాయకత్వంలోని మన జట్టు తమ తర్వాతి పోరులో నేడు స్పెయిన్‌తో తలపడుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement