victory
-
WPL విజేత ముంబై ఇండియన్స్
-
దుబాయ్ గడ్డపై గర్జించిన టీమిండియా
-
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
-
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు
-
సీడీయూ, సీఎస్యూ కూటమిదే జర్మనీ
బెర్లిన్: ఒలాఫ్ ష్కోల్జ్ సారథ్యంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోవడంతో అనివార్యమైన జర్మనీ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ (సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్యూ) కూటమి ఘన విజయం సాధించింది. కడపటి వార్తలు అందేసరికి సీడీయూ,సీఎస్యూ కూటమికి 28.6 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో సీడీయూ పార్టీ చీఫ్ ఫ్రెడరిక్ మెర్జ్ తదుపరి ఛాన్స్లర్ కావడం ఖాయమైంది. వలసలను తీవ్రంగా వ్యతిరేకించే అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) పార్టీకి 20.8 శాతం ఓట్లు పడ్డాయి. గత మూడేళ్లుగా అధికారం చలాయించిన ఒలాఫ్ షోల్జ్ సారథ్యంలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్డీపీ) ఈసారి మూడోస్థానానికి పరిమితమైంది. ఈ పార్టీకి కేవలం 16.4 శాతం ఓట్లు పడ్డాయి. పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నుంచి పురుడపోసుకుని పార్టీగా అవతరించిన ది గ్రీన్స్ పా ర్టీకి కేవలం 11.6 శాతం వచ్చాయి. ది సారా వాగెన్ కనెక్ట్–రీజన్ అండ్ జస్టిస్ పార్టీ (బీఎస్ డబ్ల్యూ) 4.97 శాతం ఓట్లు సాధించింది. 630 సీట్లున్న బండేస్టాగ్( జర్మనీ పార్లమెంట్)లో సీడీయూ, సీఎస్యూ కూటమి అత్యధికంగా 208 చోట్ల విజయం సాధించింది. ‘‘ అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) పార్టీకి ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగానే మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అమెరికా, రష్యాల నుంచి ఏవైనా సవాళ్లు ఎదురైతే వాటిని ఎదుర్కొని యూరప్ను ఐక్యంగా ఉంచేందుకు పోరాడతా’’ అని మెర్జ్ అన్నారు.సంకీర్ణ ప్రభుత్వం దిశగా..ఏ కూటమి/పార్టీకి స్పష్టమైన మెజారిటీరాని కారణంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. అధిక సీట్లు సాధించిన సీడీయూ, సీఎస్యూ కూటమి మూడో స్థానంలో వచ్చిన ఎస్డీపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వీలుంది. రెండోస్థానంలో వచ్చిన ఏఎఫ్డీ పార్టీకి సీడీయూ,సీఎస్యూ కూటమికి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఒలాఫ్ షోల్జ్కు చెందిన ఎస్డీపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనుందని వార్తలొచ్చాయి. అవస రమైతే నాలుగోస్థానంలో వచ్చిన గ్రీన్స్ పార్టీని ప్రభు త్వంలో కలుపుకోవాలని సీడీయూ, సీఎస్యూ కూటమి భావిస్తోంది. పెద్దపెద్ద షరతు లు పెట్టకుండా ఎస్డీపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కు కలిస్తే అంతా సవ్యంగా సాగుతుంది. లేదంటే ఏఎఫ్డీ పార్టీలోని నేతల కు ఎరవేసి తమ కూటమి లో కలుపుకునే ప్రయత్నా లను సీడీయూ, సీఎస్ యూ కూటమి ముమ్మరం చేయొచ్చు. గత మూడేళ్లుగా గ్రీన్స్, ఫ్రీ డెమొక్రటిక్ పార్టీతో కలిసి ఎస్డీపీ ప్రభుత్వాన్ని షోల్జ్ నడిపించారు. బలపడనున్న అమెరికాతో మైత్రిరష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న సీడీయూ కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఉక్రెయిన్కు ఒక రకంగా సానుకూలమైన వార్త. మెర్జ్ సారథ్యంలోని సర్కార్ ఇకమీదటా ఉక్రెయిన్కు తగు రీతిలో ఆయుధ, ఆర్థిక సాయం చేసే వీలుంది. మరోవైపు జర్మనీ, అమెరికా సత్సంబంధాలను మరింత పటిష్టం చేస్తానని మెర్జ్ సోమవారం స్పష్టంచేశారు. ‘‘ అమెరికా మాత్రమే ఎదగాలనే ‘అమెరికా ఫస్ట్’ నినాదం వాస్తవరూపం దాల్చితే అమెరికా ఒంటరి అయిపోతుంది. అలాకాకుండా ఇరుపక్షాలు లాభపడేలా జర్మనీ, అమెరికా బంధాన్ని బలపరుస్తా. అమెరికా సత్సంబంధాలను తెంచుకుంటే యూరప్ దేశాలు మాత్రమే దెబ్బతినవు. దాని విపరిణామాలను అమెరికా కూడా అనుభవించాల్సి ఉంటుంది’’ అని ఎన్నికల ముందస్తు ఫలితా లొచ్చాక తొలి మీడియా సమావేశంలో మెర్జ్ వ్యాఖ్యా నించారు. యూరప్ దేశాల కంటే దేశ స్వీయ ప్రయో జనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తున్న వేళ మెర్జ్ ఈ అంశంపై మాట్లాడటం గమనార్హం. -
దాయాది పాక్ పై భారత్ ఘన విజయం
-
పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం
-
చాంపియన్స్ ట్రోఫీని భారీ విజయంతో మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా
-
గుజరాత్ పై ముంబై ఇండియన్స్ విజయం
-
మహిళల ప్రీమియర్ లీగ్ లో బోణీ కొట్టిన బెంగళూరు
-
బీజేపీ విక్టరీ.. ఆప్ ఓటమి
-
మోదీషా మంత్రాంగంతో ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్
-
కమలం అదుర్స్.. అప్ చెదుర్స్.. కాంగ్రెస్ బెదుర్స్
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం... 70 స్థానాలకు గాను బీజేపీకి 48, ఆమ్ ఆదీ పార్టీకి 22 స్థానాలు.. వరుసగా మూడోసారీ సున్నా చుట్టిన కాంగ్రెస్
-
ఆపద నుంచి ప్రజలకు విముక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో(Delhi Elections) బీజేపీ విజయం(BJP victory) సాధారణ విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) చెప్పారు. దశాబ్ద కాలం తర్వాత ఆప్ద(ఆపద) నుంచి ఢిల్లీ ప్రజలకు ఎట్టకేలకు విముక్తి లభించిందని అన్నారు. బీజేపీని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ రాజధానిలో డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నామని వెల్లడించారు. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆనందం పంచుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ప్రభుత్వ అవినీతి, ఆర్థిక అవకతవకలపై ‘కాగ్’ ఇచ్చిన నివేదికను బీజేపీ ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందని చెప్పారు. అన్నిరకాల అవినీతి వ్యవహారాలపై కచ్చితంగా దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. జనం సొమ్మును లూటీ చేసినవారి నుంచి తిరిగి కక్కిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఇప్పటిదాకా పాలన వెలగబెట్టినవారు పచ్చి అవినీతిపరులు అని మండిపడ్డారు. షార్ట్–కట్ రాజకీయాలు చేసేవారికి ప్రజలు షార్ట్–సర్క్యూట్తో బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రజల రుణం తీర్చుకుంటాం ధూర్త, మూర్ఖ రాజకీయాలు మన దేశానికి అవసరం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆప్, కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఎజెండాను చోరీ చేసిందన్నారు. హిందుత్వ వేషంతో ఓట్లు రావడం లేదు కాబట్టి మిత్రపక్షాల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోందని చెప్పారు. కాంగ్రెస్ లేవనెత్తుతున్న కులగణన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘మోదీ కీ గ్యారంటీ’ పట్ల ఢిల్లీ ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారని, నగరాన్ని అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటామని వివరించారు. యమునా నదిలో శుభ్రం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. మన ప్రయత్నాలను యమున మాత తప్పకుండా ఆశీర్వదిస్తుందని అన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. ఢిల్లీని సరికొత్త ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి ధూర్త, మూర్ఖ రాజకీయాలు చేసే దుష్టులు దేశ రాజకీయాలను కబ్జా చేయకుండా ఉండాలంటే లక్ష మంది యువత రాజకీయ రంగంలోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో రాకపోతే దేశానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. దేశానికి ఇప్పుడు రాజకీయ పరివర్తన అవసరమని తెలిపారు. 21వ శతాబ్దంలో వికసిత్ భారత్కు నూతన జీవన శక్తి, నూతన ఆలోచనలు, నూతన ఉత్సాహం అవసరమని పేర్కొన్నారు. రాజ్యంపై యుద్ధం చేస్తున్నామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష పార్టీ దేశ ప్రయోజనాల కోసం కాకుండా అర్బన్ నక్సలైట్ల కోసం రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాలను బలిపెట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ముందంజలో ఉందన్నారు. రాజకీయాల్లో మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చి నీచ రాజకీయాలు చేసేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అభివృద్ధి, సుపరిపాలనతోప్రత్యేక గుర్తింపు వచ్చిందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో రెండు రెట్ల వేగంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇదొక చరిత్రాత్మక విజయమని అభివర్ణించారు.ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తంచేశారు. ప్రజాశక్తికి తిరుగులేదని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎన్నికల ఫలితాల అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. చరిత్రాత్మక విజయం అందించినందుకు ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ అని పేర్కొన్నారు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఇది తమ గ్యారంటీ అని స్పష్టంచేశారు. ఎన్నికల్లో విజయం కోసం శ్రమించిన బీజేపీ నేతలు, కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. -
అమ్మాయిలు అదరహో.. వరల్డ్ విజేతగా భారత్
-
టీ20 అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో జగజ్జేత భారత్
-
భారత్ గ్రాండ్ విక్టరీ
-
ఐర్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్..
-
తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి..
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జోరుకు హరియాణా స్టీలర్స్ చెక్ పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్లో హరియాణా ఏకంగా 21 పాయింట్ల తేడాతో టైటాన్స్ను ఓడించింది. స్టీలర్స్ 46–25 స్కోరుతో తెలుగు టైటాన్స్ జట్టును చిత్తు చేసింది. రెయిడర్ వినయ్ (7) ఆరంభం నుంచే క్రమం తప్పకుండా పాయింట్లు తెచి్చపెట్టడంతో హరియాణా ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మరో రెయిడర్ శివమ్ పతారే (12) కూతలో పాయింట్ల వేగం పెంచడంతో స్కోరు అమాంతం పెరిగిపోయింది. మిగతా వారిలో ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా (5), డిఫెండర్లు రాహుల్ (4), సంజయ్ (3) రాణించడంతో స్టీలర్స్ ఎదురులేని విజయం సాధించింది. టైటాన్స్ తరఫున స్టార్ రెయిడర్ ఆశిష్ నర్వాల్ (13) అదరగొట్టాడు. 14 సార్లు కూతకెళ్లిన ఆశిష్ రెయిడింగ్లో 11 పాయింట్లు చేశాడు. ప్రత్యర్థి రెయిడర్లు నిలువరించి రెండు టాకిల్ పాయింట్లు సాధించాడు. కెపె్టన్ విజయ్ మాలిక్ 5, డిఫెండర్ అంకిత్ 2 పాయింట్లు చేశారు. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్లో ఇప్పటి వరకు 18 మ్యాచ్లు ఆడి హరియాణా 14 మ్యాచ్ల్లో గెలిచింది.4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 72 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ జట్టు 18 మ్యాచ్ల్లో 10 విజయాలు, 8 పరాజయాలతో 54 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 30–26 స్కోరుతో పుణేరి పల్టన్పై గెలుపొందింది. దబంగ్ జట్టును కెప్టెన్ అశు మలిక్ (13) ముందుండి నడిపించాడు. 19 సార్లు రెయిడింగ్కు వెళ్లిన 13 పాయింట్లు తెచ్చి పెట్టాడు. సహచరుల్లో నవీన్ కుమార్ (4), యోగేశ్ (3), ఆశిష్ (2) స్కోరు చేశారు. పుణేరి జట్టులో అత్యధికంగా రెయిడర్ మోహిత్ గోయత్ 7 పాయింట్లు చేశాడు. మిగతా వారిలో పంకజ్ మోహితె (5), ఆకాశ్ షిండే (4), అమన్ (3) రాణించారు. దబంగ్ ఢిల్లీ 17 మ్యాచ్లు ఆడి 8 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో కలిపి మొత్తం 56 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పుణేరి పల్టన్ 18 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. 7 మ్యాచ్ల్లో నెగ్గి, 8 మ్యాచ్ల్లో ఓడింది. 3 మ్యాచ్లను ‘టై’గా ముగించింది. 49 పాయింట్లతో ఏడో ర్యాంక్లో ఉంది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్తో జైపూర్ పింక్పాంథర్స్ (రాత్రి 8 గంటల నుంచి), బెంగాల్ వారియర్స్తో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
Big Question: మహారాష్ట్రలో కాషాయ ప్రభంజనం
-
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం... జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే
-
మహారాష్ట్రలో భారీ మెజార్టీ దిశగా మహాయుతి
-
బిట్ కాయిన్ కి ట్రంప్ కిక్కు.. ఇన్వెస్టర్లు ఫుల్ ఖుష్..! ఇక కోట్లే..!
-
అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ హవా
-
US Election 2024: స్వర్ణయుగం తెస్తా
వాషింగ్టన్: రెండోసారి పరిపాలన మొదలెట్టాక అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచాక బుధవారం ఫ్లోరిడా రాష్ట్రంలోని వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబసమేతంగా ‘ఎలక్షన్ నైట్ వాచ్ పార్టీ ’వేదిక మీదకు వచ్చిన ట్రంప్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా సైతం పోడియం మీదకు వచ్చారు. ట్రంప్ సతీమణి మెలానియా, కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు సైతం వేదిక మీదకొచ్చారు. చిరస్మరణీయ విజయం తర్వాత జాతినుద్దేశిస్తూ వందలాది మంది మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం మునుపెన్నడూ చూడని విజయం ‘‘అమెరికాలో ఇలాంటి విజయాన్ని మునుపెన్నడూ ఎవరూ చూడలేదు. అత్యంత శక్తివంతమైన ప్రజాతీర్పు ఇది. అమెరికా చరిత్రలో అతిగొప్ప రాజకీయ ఉద్యమం ఇది. మా పార్టీ గెలుపుతో అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం రాబోతోంది. అమెరికాను మళ్లీ అత్యంత గొప్ప దేశంగా మలిచేందుకు ఈ గెలుపు మాకు సదవకాశం ఇచి్చంది. పాత గాయాలను మాన్పి దేశాన్ని మళ్లీ సరికొత్త శిఖరాలకు చేరుస్తాం. మళ్లీ మేం పార్లమెంట్పై పట్టుసాధించాం. హోరాహోరీ పోరు జరిగిన కీలక జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ లాంటి రాష్ట్రాల్లోనూ విజయం సాధించాం. అన్ని వర్గాల సమూహశక్తిగా అతిపెద్ద విస్తృతమైన ఏకీకృత కూటమిగా నిలబడ్డాం. ఇలా అమెరికా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు అంతా రిపబ్లికన్ పారీ్టకే పట్టం కట్టారు. కార్మిక, కార్మికేతర సంఘాలు, ఆఫ్రికన్–అమెరికన్, హిస్పానియన్–అమెరికన్, ఆసియన్–అమెరికన్, అర్బన్–అమెరికన్, ముస్లిం అమెరికన్ ఇలా అందరూ మనకే మద్దతు పలికారు. ఇది నిజంగా ఎంతో సుందరమైన ఘటన. భిన్న నేపథ్యాలున్న వర్గాలు మనతో కలిసి నడిచాయి. అందరి ఆశ ఒక్కటే. పటిష్ట సరిహద్దులు కావాలి. దేశం మరింత సురక్షితంగా, భద్రంగా ఉండాలి. చక్కటి విద్య అందాలి. ఎవరి మీదకు దండెత్తకపోయినా మనకు అజేయ సైన్యం కావాలి. గత నాలుగేళ్లలో మనం ఎలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినాసరే ఐసిస్ను ఓడించాం. నేనొస్తే యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని డెమొక్రాట్లు ఆరోపించారు. నిజానికి నేనొస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు దక్కిన అద్భుత విజయమిది. మరోమారు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుని నాకు అసాధారణ గౌరవం ఇచ్చిన నా అమెరికన్ ప్రజలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా ’’అని అన్నారు. సరిహద్దులను పటిష్టం చేస్తా ‘‘ప్రస్తుతం దేశం చాలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తక్షణ సాయం అవసరం. దేశ గాయాలను మేం మాన్పుతాం. దేశ సరిహద్దుల వద్ద కాపలాను మరింత పటిష్టం చేస్తాం. అదొక్కటేకాదు దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతాం. ప్రతి ఒక్క పౌరుడికి నేనొక్కటే చెబుతున్నా. మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తా. ప్రతి రోజూ పోరాడతా. మనం, మన పిల్లలు కోరుకునే స్వేచ్ఛాయుత, అత్యంత సురక్షితమైన, సుసంపన్నమైన అమెరికా కోసం నా తుదిశ్వాసదాకా కృషిచేస్తా. అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తెస్తా. ఈ మహాయజ్ఞంతో నాతోపాటు పాలుపంచుకోవాలనుకునే ప్రతి ఒక్క పౌరుడికీ ఇదే నా స్వాగతం’’అని అన్నారు. బంగరు భవితకు బాటలు వేద్దాం ‘‘మనందరం కలిసి సమష్టిగా అమెరికా ఉజ్జల భవితను లిఖిద్దాం. కలిసి కష్టపడి మన తర్వాత తరాలకు చక్కటి భవిష్యత్తును అందిద్దాం. ఎన్నికల వేళ 900 ర్యాలీలు నిర్వహించుకున్నాం. విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువకావడం వల్లే ఇప్పుడు విజయ తీరాలకు చేరగలిగాం. ఇప్పుడు దేశం కోసం అత్యంత ముఖ్యమైన పనులను మొదలెడదాం. అత్యంత మెరుగైన అమెరికాను నిర్మిద్దాం’’అని అన్నారు. ఎన్నికల బహిరంగసభలో భవనం పైనుంచి ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో స్వల్ప గాయంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం, గోల్ఫ్ క్లబ్ వద్ద మరో సాయుధుడి అరెస్ట్ ఘటనలను ట్రంప్గుర్తుచేసుకున్నారు. ‘‘గొప్ప కార్యం మీతో చేయించాలనే మిమ్మల్ని దేవు డు కాపాడాడు అని చాలా మంది నాతో చెప్పారు’’అని ట్రంప్ అన్నారు. ‘‘దేశాన్ని కాపాడి మళ్లీ గ్రేట్గా మార్చేందుకే దేవుడు నాకీ అవకాశం ఇచ్చాడనుకుంటా. ఈ మిషన్ను మనం పూర్తిచేద్దాం. ఈ పని పూర్తి చేయడం అంత సులభమేం కాదు. శక్తినంతా కూడదీసుకుని దేశభక్తి, పోరాటపటిమ, స్ఫూర్తితో ఈ ఘనకార్యాన్ని సంపూర్ణం చేద్దాం. ఇది ఉత్కృష్టమైన బా ధ్యత. ఇంతటి ఉదాత్తమైన పని ప్రపంచంలోనే లేదు. తొలిసారి అధ్యక్షుడిగా పాలించినప్పుడూ ఒక్కటే ల క్ష్యంగా పెట్టుకున్నా. ఇచి్చన హామీలను నెరవేర్చాల ని. ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను తూ.చా. తప్పకుండా అమలుచేస్తా. ‘మేక్ అమెరికా.. గ్రేట్ ఎగేన్’ను సాకారం చేసేందుకు దేశం నలుమూలల నుంచి నడుంబిగించి కదలండి. ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం ప్రయతి్నంచబోతున్నాం. సాధించబోతున్నాం’’అని ట్రంప్ అన్నారు. ఎలాన్ మస్క్ పై ప్రశంసలు ప్రసంగిస్తూ ట్రంప్ ప్రపంచ కుబేరుడు, ఎన్నికల్లో తన కోసం కోట్లు ఖర్చుచేసిన వ్యాపారదిగ్గజం ఎలాన్ మస్్కను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఇక్కడో తార(స్టార్) ఉద్భవించింది. అదెవరంటే మన ఎలాన్ మస్్క. ఆయనో అద్భుతమైన వ్యక్తి. ప్రజలు ప్రకృతి వైపరీతాల్లో చిక్కుకుపోయినప్పుడు మస్్కకు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సాయపడింది. నార్త్కరోలినాలో హెలెన్ హరికేన్ వేళ స్టార్లింక్ ఎంతో సాయపడింది. అందుకే ఆయన్ను నేను ఇష్టపడతా. అసాధ్యాలను సుసాధ్యం చేశారు. స్పేస్ఎక్స్ వారి స్టార్íÙప్ కార్యక్రమంలో భాగంగా అత్యంత భారీ రాకెట్ బూస్టర్ను పునరి్వనియోగ నిమిత్తం మళ్లీ పసిపాపలాగా లాంచ్ప్యాడ్పై అద్భుతంగా ఒడిసిపట్టారు. మస్్కకు మాత్రమే ఇది సాధ్యం. ఆ ఘటన చూసి నేను భవిష్యత్తరం సినిమా అనుకున్నా. ఇంతటి ఘనత సాధించిన మస్క్ లాంటి మేధావులను మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు ప్రపంచంలో కొందరే ఉన్నారు’’అని ట్రంప్ అన్నారు. జేడీ వాన్స్ను పొగిడిన ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు ఇతనే అంటూ జేడీ వాన్స్ను ట్రంప్ సభకు పరిచయం చేశారు. ‘‘ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ సరైన వ్యక్తి. ఆయన భార్య ఉషా సైతం అద్భుతమైన మహిళ. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం చూపడంలో జేడీ వాన్స్కు ఎవరూ సాటిరారు. రిపబ్లికన్ పార్టీని విమర్శించే, ఆగర్భ శత్రువులుగా తయారైన కొన్ని మీడియా కార్యాలయాలకు చర్చకు వెళ్తారా? అని నేను అడిగితే వెంటనే ఓకే అనేస్తారు. సీఎన్ఎన్కు వెళ్లాలా?, ఎంఎస్ఎన్బీసీకి వెళ్లాలా? అని నన్నే ఎదురుప్రశ్నిస్తారు. ముక్కుసూటిగా దూసుకుపోయే, వైరివర్గాన్ని చిత్తుచేసే నేత’’ అంటూ వాన్స్ను ట్రంప్ ఆకాశానికెత్తేశారు. శక్తివంతంగా తిరిగొచ్చారు: వాన్స్ ‘‘మళ్లీ గెలిచి అత్యంత శక్తివంతంగా తిరిగొచి్చన అతికొద్ది మంది నేతల్లో ఒకరిగా ట్రంప్ నిలిచారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ పునరాగమనం ద్వారా ట్రంప్ సారథ్యంలో మేం దేశ ఆర్థిక ప్రగతి రథాన్ని ఉరకలు పెట్టిస్తాం. నాపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్ష పదవికి నన్ను ఎంపిక చేసిన ట్రంప్కు కృతజ్ఞతలు’’అని జేడీ వాన్స్ అన్నారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభంజనం.. ఇప్పటికే 294 ఎలక్టోరల్ ఓట్లు కైవసం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ట్రంప్ గెలిచారు?.. మరి మనకేంటి?
-
డొనాల్డ్ ట్రంప్ గెలుపు వెనుక ఎలాన్ మస్క్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో అపరకుబేరుడు ఎలాన్ మస్క్ పాత్రను తీసిపారేయలేం. మొదటి నుంచి ట్రంప్కు మద్ధతు పలుకుతూ వచ్చిన మస్క్.. బైడెన్ ప్రభుత్వంపైనా, పోటీదారు కమలా హారిస్పైనా అదే స్థాయిలో విమర్శలతో చెలరేగిపోయాడు. అదే టైంలో.. సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’కి బాస్గా ఎలాన్ మస్క్ నడిపించిన ఉద్యమం కూడా ట్రంప్ గెలుపులో కీలకభూమిక పోషించింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్కు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ పరోక్షంగా ఉపయోగపడింది. మస్క్ తన సోషల్ మీడియా వేదికలపై ప్రముఖులతో కలిసి ట్రంప్కు అనుకూలంగా ప్రచారం చేశారు. అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం, ట్రంప్ గెలుపుతో అమెరికన్లకు కలిగే ప్రయోజనాలతో పాటు వివిధ సున్నిమైన అంశాల గురించి చర్చించారు. ఆ చర్చలే ఓటర్లకు దగ్గరయ్యేలా చేసింది. పలు సందర్భాల్లో ప్రజల్లో ట్రంప్పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా మస్క్ తన వ్యూహ, ప్రతివ్యూహాలతో ఆకట్టుకున్నారు. అన్నింటికంటే ముందు.. ట్రంప్పై గతంలో విధించిన సోషల్ మీడియా బ్యాన్ను ఎత్తిపారేశారాయన.ఇదీ చదవండి: కమలా హారిస్పై డొనాల్డ్ ట్రంప్ ఘన విజయంట్రంప్కు బహిరంగ మద్దతు వ్యాపార వ్యవహరాల్లోనే కాదు రాజకీయంగా మస్క్.. ట్రంప్కు ప్రత్యక్షంగా మద్దతు పలికారు. వాస్తవానికి 2016, 2020 ఎన్నికలలో ట్రంప్కు మస్క్ పరోక్ష మద్దతిచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో మస్క్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్కు మద్దతు పలికారు. అలాగే.. ట్రంప్ హామీలు, గత పాలనలో నిర్ణయాలను విపరీతంగా ప్రమోట్ చేశారు. కుటుంబ నియంత్రణ, అంతరిక్ష పరిశోధనలు, ఆర్థిక జాతీయవాదం వంటి అంశాలపై మద్దతు పలకడంతో కోట్లాది మంది మస్క్ అభిమానులు సైతం ట్రంప్కు ఓటు వేసేందుకు ఉపయోగపడింది. మస్క్ను నమ్మారు!ట్రంప్కు మస్క్ మద్దతు ఇవ్వడంతో.. ఆయన కంపెనీలైన టెస్లా, స్పేస్ఎక్స్ ఆవిష్కరణలతో పాటు పెట్టుబడిదారులు, వినియోగదారులు లబ్ధి చేకూరొచ్చని భావించారు. పన్నులు, ఇంధనం, రాయితీ వంటి హామీలపై మస్క్ ఎక్కువ ఫోకస్ చేశారు. పెట్టుబడిదారుల నుంచి వినియోగదారుల వరకు మస్క్ మాటల్ని నమ్మారని, కాబట్టే మస్క్ అభిమానుల ఓట్లు ట్రంప్కు పడేలా చేశాయని విశ్లేషకుల అభిప్రాయం. ఎలాన్ మస్క్ చేసిన పోస్టులే..సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ క్రేజ్ అంతా ఇంతా కాదు. స్వేచ్ఛ పేరుతో.. ఎలాంటి అంశంపైన అయినా స్పందిస్తుంటారు. మీడియా, టెక్నాలజీలతో పాటు ఉన్నత రంగాల ప్రముఖుల పట్ల జోబైడెన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలుమార్లు ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ అంశం ట్రంప్కు బాగా కలిసొచ్చింది. ప్రపంచకుబేరుల జాబితాలో మస్క్ ముందు వరుసలో ఉండడం, ఆకట్టుకునేలా మాటలు ట్రంప్కు అనుకూలంగా పనిచేశాయి.ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో మస్క్ మరింత చురుకైన పాత్ర పోషిస్తే, ట్రంప్కు ప్రయోజనం చేకూర్చేలా అమెరికన్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ఆయా సోషల్ మీడియా వేదికలపై ప్రస్తావించారు. టెక్నాలజీ, ఆర్థిక సమస్యలు, సంస్కృతి వంటి అంశాల ట్రంప్కు అనుకూలంగా మారాయి.వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ జోక్యం, వ్యక్తిగత స్వేచ్ఛపై మస్క్ వ్యక్తిగత విశ్వాసాలు ట్రంప్కు మద్దతు పలికేలా చేశాయి. వాక్ స్వాతంత్య్రం, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడంపై మస్క్.. ట్రంప్తో జతకట్టేలా చేశాయి. ట్రంప్ గెలుపులు ఈ అంశాలు కలిసొచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా ఎలాన్ మస్క్ చేసిన ప్రచారం ఓటర్ల శైలిని మార్చేసిందనే చెప్పొచ్చు. -
గెలుపు తర్వాత ట్రంప్ సంతోష క్షణాలు.. ప్రసంగం (ఫొటోలు)
-
హరియాణా ఎన్నికల్లో గెలుపు పట్టు పట్టిన వినేశ్ ఫొగాట్
-
కమలం కమాల్!
హరియాణా. వివాదాస్పద మూడు సాగు చట్టాలపై రైతుల ఉద్యమానికి వేదికగా నిలిచిన రాష్ట్రం. అగ్నివీర్ పథకంతో ఆర్మీలో శాశ్వత నియామక అవకాశాలను కోల్పోతామని యువత తీవ్ర నిరాశంలో నిండిపోయిన రాష్ట్రం. ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ చూపిన దూకుడు, ఆపార్టీ అతి ఆత్మవిశ్వాసాన్ని కళ్లారా చూసిన రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రం పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతనూ కూడా పక్కనబెట్టి మళ్లీ కమలదళానికి అధికార పగ్గాలు అప్పజెప్పిన తీరు ఎగ్జిట్పోల్ సర్వేలనేకాదు రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. 1966లో రాష్ట్రంగా ఏర్పడ్డాక హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఇదే తొలిసారి. ఏకమైన జాట్ వ్యతిరేక వర్గాలుఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం తలకిందులైన ఈ బీజేపీ విజయం వెనుక జాట్యేతర వర్గం ఓటర్లు ఉన్నారని అర్థమవుతోంది. ‘‘జాట్లు కాంగ్రెస్కు ఓటేశారు. అయితే బలమైన జాట్లను ఎదుర్కొనేందుకు జాట్యేతర వర్గాలైన ఓబీసీలు, దళితులు, అగ్రవర్ణాల ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడంలో బీజేపీ నేతలు సఫలీకృతులయ్యారు. జాట్లు పూర్తిగా ఒక్క కాంగ్రెస్కే ఓటేయకపోవడమూ బీజేపీకి లాభించింది’’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్లో అధ్యయనకారుడు రాహుల్ వర్మ విశ్లేషించారు. బీజేపీ వెంటే అహిర్వాల్దక్షిణ హరియాణాలోని అహిర్వాల్ ప్రాంత ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉంటారు. 2014, 2019లో బీజేపీ విజయానికి ఈ ప్రాంత ఓటర్ల మద్దతే ప్రధాన కారణం. ఈసారి కూడా అహిర్వాల్ ఓటర్లు బీజేపీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఈసారీ అహిర్వాల్ ప్రాంతంలోని మెజారిటీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లోనూ 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో 10 చోట్ల బీజేపీ ఘన విజయం సాధించడం గమనార్హం. హరియాణా సైబర్ కేంద్రంగా కీర్తికెక్కిన గురుగ్రామ్ సైతం బీజేపీ వెంటే నిలిచింది. ఫరీదాబాద్సహా చాలా పట్టణ ప్రాంతాల ప్రజలు మొదట్నుంచీ బీజేపీకి వెంటే నడవటం ఆ పార్టీ విజయాన్ని సులభతరం చేసింది.నాయబ్ సింగ్ సైనీ నాయకత్వంకేవలం 210 రోజుల క్రితమే సీఎంగా పగ్గాలు చేపట్టిన 54 ఏళ్ల నయాబ్ సింగ్ సైనీ తన ప్రజాకర్షక పాలనతో ఓటర్లను తన వైపునకు తిప్పుకున్నారు. గెలిస్తే ఈయననే మళ్లీ సీఎంను చేస్తానని బీజేపీ ప్రకటించడంతో ఖట్టర్ నిష్క్రమణ తర్వాత రాష్ట్రంలో పార్టీ అగ్రనేతగా అవతరించారు. హరియణా బీజేపీ మాజీ చీఫ్ అయిన సైనీ కేవలం ‘డమ్మీ సీఎం’ అంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని నిరూపించారు.గ్రామపంచాయతీల వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.21 లక్షలకు పెంచడం, గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులో కనీసం చార్జీల రద్దు, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సహా పలు అభివృద్ది పథకాలు సైనీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకాన్నిపెంచాయి. అగ్నివీర్లకు ఆర్మీ నుంచి బయటికొచ్చాక ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి యువతలో సైనీ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి..దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన ఖట్టర్ పట్ల రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. దీనిని ముందే పసిగట్టిన బీజేపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అకస్మాత్తుగా ఆయనను తప్పించి సైనీని సీఎంను చేసింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ఖట్టర్ను పూర్తిగా పక్కనబెట్టింది. రాష్ట్రంలో ఎక్కడా పోస్టర్లలో కూడా ఖట్టర్ ఫొటో వేయలేదు. దీంతో సీఎం, ప్రభుత్వ వ్యతిరేకత చల్లబడిందని చెప్పొచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెట్టిన బీజేపీఏకంగా సీఎం ఖట్టర్ను పక్కనబెట్టిన కమలం పార్టీ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై దృష్టిపెట్టింది. ఏఏ స్థానాల్లో ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో వారందరికీ టికెట్లు నిరాకరించింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతకు పోగొట్ట గలిగింది. దాదాపు 60 కొత్తముఖాలకు టికెట్ ఇచ్చి కొత్త ప్రయోగం చేసింది. రైతులను బుజ్జగించే యత్నం..వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలపై హరియాణా రైతులు ఉద్యమించిన నేపథ్యంలో రైతాంగం ఆగ్రహం పోలింగ్లో బయటపడకుండా ఉండేందుకు ఈ ఏడాది ఆగస్టులో మరో 10 పంటలను జోడించి మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రకటనతో రైతన్నలు ప్రభుత్వానికి అనుకూలంగా మారారని తెలుస్తోంది. రూ.500కే గ్యాస్ సిలిండర్రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కమలనేతలు హామీ ఇచ్చారు. మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, యువతకు 2 లక్షల ఉద్యోగాలు వంటి వాగ్దానాలకు ఓటర్లు ఆకర్షితులయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్రీలంక అధ్యక్షునిగా అనురకుమార విజయం
కొలంబో:శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. అధ్యక్ష ఎన్నికల్లో అనురకుమార దిసనాయకే విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అనురకుమారకు ఆధిక్యం లభించింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల్లో విజయంతో శ్రీలంక 9వ అధ్యక్షునిగా అనురకుమార ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికల ఓట్ల కౌంటింగ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. -
భారత హాకీ జట్టు విజయం అద్భుతం: వైఎస్జగన్
సాక్షి,తాడేపల్లి: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు గెలుపుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్జగన్ హర్షం వ్యక్తం చేశారు. ట్రోఫీ ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో భారత జట్టు సాధించిన విజయం అద్భుతం అని వైఎస్ జగన్ కొనియాడారు.ఈమేరకు మంగళవారం(సెప్టెంబర్17)ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. భారత హాకీ జట్టుసభ్యులకు అభినందనలు తెలిపారు.ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో సాధించిన విజయం అద్భుతం.Well done, Congratulations!#AsianChampionsTrophy2024— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2024 -
ఆస్కార్ అదరహో
బాకు (అజర్బైజాన్): వరుసగా నాలుగో ఏడాది క్వాలిఫయింగ్లో మెరిపించిన ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ప్రధాన రేసులో మాత్రం తడబడ్డాడు. ఆదివారం జరిగిన సీజన్లోని 17వ రేసు అజర్బైజాన్ గ్రాండ్ప్రిలో మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిరీ్ణత 51 ల్యాప్లను ఆస్కార్ అందరికంటే వేగంగా 1 గంట 32 నిమిషాల 58.007 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ్రస్టేలియాకు చెందిన 23 ఏళ్ల ఆస్కార్కు ఈ సీజన్లో ఇది రెండో విజయం. హంగేరి గ్రాండ్ప్రిలోనూ ఆస్కార్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన లెక్లెర్క్ 1 గంట 33 నిమిషాల 08.917 సెకన్ల సమయంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 20వ ల్యాప్లో అప్పటి వరకు నంబర్వన్ స్థానంలో ఉన్న లెక్లెర్క్ను ఆస్కార్ పియాస్ట్రి ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు ఆస్కార్ నిలబెట్టుకొని తన కెరీర్లో రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్కు మూడో స్థానంలో, మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్కు నాలుగో స్థానంలో, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్బుల్) ఐదో స్థానంలో నిలిచారు. వీసా క్యాష్ యాప్ జట్టుకు చెందిన యుకీ సునోడా రేసును పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. 24 రేసుల ఫార్ములావన్ సీజన్లో 17 రేసులు ముగిశాక మాక్స్ వెర్స్టాపెన్ 313 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. సీజన్లోని 18వ రేసు సింగపూర్ గ్రాండ్ప్రి ఈనెల 22న జరుగుతుంది. -
Nostradamus: కమలా హారిస్దే విజయం
నవంబర్లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధిస్తారని అమెరికా ఎన్నికల నోస్ట్రడామస్గా పేరొందిన చరిత్రకారుడు అలాన్ లిచ్మన్ జోస్యం చెప్పారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అలాన్ దాదాపు ఖచ్చితంగా ఊహించి చెప్పడం విశేషం. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ని్రష్కమిస్తే వాళ్ల పార్టీ గెలుపు కష్టమేనన్న ఆయన.. ఇప్పుడు హారిస్ వచ్చాక తప్పక విజయం సాధిస్తారని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. డెమొక్రాట్లు అప్పగించిన కీలక బాధ్యతను స్వీకరించిన కమలా హారిస్ అంతే ధీమాతో దూసుకెళ్తూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ను ఓడించేందుకు రెడీ అయ్యారని అలాన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఫలితం ఏమిటన్నది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి బయటకు వచ్చి ఓటు వేయండి’’అని తాజాగా న్యూయార్క్ టైమ్స్కు ఇచి్చన 7 నిమిషాల వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు. 1984 నుంచి విశ్లేషణలు 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్మాన్ ‘గెలుపునకు 13 సూత్రాలు’అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనావేస్తానని చెప్పారు. 2016లో ట్రంప్ గెలుస్తాడని, 2020లో బైడెన్ గెలుస్తాడని చెప్పిన మాటలు నిజం కావడం విశేషం. 2000లో అల్గోర్పై జార్జి డబ్ల్యూ బుష్ విజయం సాధించడం మినహా మిగిలిన ఫలితాలన్నీ ఆయన చెప్పినట్లుగా రావడం గమనార్హం. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని ప్రధాన ఒపీనియన్ పోల్స్ చెప్పగా.. లిచ్మన్ మాత్రం ట్రంప్ తిరుగులేని విజయం సాధిస్తారని అంచనా వేశారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండగా అభిశంసనకు గురవుతారని చెప్పారు. అలాన్ చెప్పినట్లే ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు గురయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హామిల్టన్ రికార్డు
సిల్వర్స్టోన్ (ఇంగ్లండ్): ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 945 రోజుల తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో మళ్లీ విజయం అందుకున్నాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. చివరిసారి హామిల్టన్ 2021 డిసెంబర్ 5న సౌదీ అరేబియా గ్రాండ్ప్రిలో గెలుపొందాడు. సిల్వర్స్టోన్ సర్క్యూట్పై ఆదివారం జరిగిన 52 ల్యాప్ల రేసును హామిల్టన్ (మెర్సిడెస్) అందరికంటే వేగంగా ఒక గంటా 22 నిమిషాల 27.059 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఫార్ములావన్ చరిత్రలో ఒకే సర్క్యూట్పై అత్యధికంగా 9 సార్లు విజేతగా నిలిచిన డ్రైవర్గా హామిల్టన్ రికార్డు నెలకొల్పాడు. మైకేల్ షుమాకర్ (జర్మనీ) ఫ్రాన్స్లోని మాగ్నీ కోర్స్ సర్క్యూట్ లో అత్యధికంగా 8 సార్లు గెలిచాడు. తాజా గెలుపుతో షుమాకర్ రికార్డును హామిల్టన్ సవరించాడు. 24 రేసుల తాజా సీజన్లో 12 రేసులు ముగిశాక వెర్స్టాపెన్ (రెడ్బుల్) 255 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. సీజన్లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విక్టరీ
లండన్: యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. గురువారం యూకే హౌజ్ ఆఫ్ కామన్స్ 650 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడగా.. ఆ వెంటనే కౌంటింగ్ మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ఊహించినట్లుగానే.. లేబర్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. లేబర్ పార్టీ 411 స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 119 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. లిబరల్ డెమోక్రట్స్ పార్టీ 71 స్థానాలు దక్కించుకుంది. సంబంధిత వార్త: 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎవరీ కీర్ స్టార్మర్ఇదిలా ఉంటే.. ఫలితాలు వెలువడ్డాక కాసేపటికే రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వాళ్లకు రిషి సునాక్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే యూకే కాబోయే ప్రధాని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్కు అభినందనలు తెలియజేశారు. సంబంధిత వార్త: నన్ను క్షమించండి: రిషి సునాక్ఘోర పరాభవం నుంచి..2019 సార్వత్రిక ఎన్నికల్లో జెర్మీ కోర్బిన్ నేతృత్వంలో లేబర్ పార్టీ కేవలం 201 స్థానాలే గెల్చుకుంది. 1935 తర్వాత ఆ పార్టీ ఎదుర్కొన్న ఘోరమైన పరాభవం ఇదే. అదే సమయంలో బోరిస్ జాన్సన్ నేతృత్వంలో 365 స్థానాలు గెలిచి వరుసగా అధికారం కైవసం చేసుకుంది. అయితే 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని.. ఈసారి ఓటర్లు పక్కనపెట్టేశారు. లేబర్ పార్టీని ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించారు. వ్యతిరేకత ఇలా.. బ్రెగ్జిట్ తర్వాత మందగించిన ఆర్థిక వ్యవస్థ, అధికార పార్టీ కన్జర్వేటివ్ కుంభకోణాలు ప్రజారోగ్య వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫ్యలం, 14 ఏళ్ల పాలనలో ఐదుగురు ప్రధానుల్ని మార్చడం, వాళ్ల అనాలోచిత నిర్ణయాలు.. ఇలా కన్జర్వేటివ్ పార్టీ పట్ల జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ తర్వాత.. అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టారు రిషి సునాక్. అయితే కన్జర్వేటివ్ పార్టీ ప్రజా వ్యతిరేకతను పసిగట్టి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారాయన. అయినప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి. Thank you, Holborn and St Pancras, for putting your trust in me again.Change begins right here. pic.twitter.com/XZfi5OIoyH— Keir Starmer (@Keir_Starmer) July 5, 2024 To the hundreds of Conservative candidates, thousands of volunteers and millions of voters:Thank you for your hard work, thank you for your support, and thank you for your vote. pic.twitter.com/GcgvI7bImI— Rishi Sunak (@RishiSunak) July 4, 2024 లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని సునాక్ ఎన్నికల ప్రచారం వర్కవుట్ కాలేదు. అదే సమయంలో.. తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని, దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని స్టార్మర్ ఓటర్లకు చేసిన విజ్ఞప్తి ఫలించింది. ఎగ్జిట్పోల్స్ నిజమయ్యాయి!యూకేలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్ దిగువ సభ(హౌజ్ ఆఫ్ కామన్స్)లో ఏకంగా 410 స్థానాలు కీర్ స్మార్టర్ నేతృత్వంలో లేబర్ పార్టీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కన్జర్వేటివ్ కేవలం 131 స్థానాలకు పరిమితం కావొచ్చని తెలిపాయి. -
జనసంద్రలా ముంబై తీరం.. విశ్వవిజేతల విక్టరీ పరేడ్ (ఫోటోలు)
-
నా విజయానికి కారణం జగనన్నే..
-
ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..!
ఇటీవల లోక్సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు బాణా సంచాలతో, మిఠాయిలతో ఆ విజయోత్సాహాన్ని ఆనందంగా జరుపుకుంటారు. ఎవ్వరైనా ఇలానే చేస్తారు. మరొకందరూ వారీ మతానుసారంగా పూజలు, మొక్కలు, చెల్లించుకోవడం చేస్తారు. మహా అయితే అన్నదానాలు చేస్తారు. కానీ ఈ ఎంపీలా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఎవ్వరూ ఆలోచించరేమో..!. అతడేమీ మిగతా అభ్యర్థుల్లా స్వేచ్ఛగా ప్రచార ర్యాలీతో ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తి కాదు. అయినప్పటికీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరువేయడమే గాక ఆ సంతోషాన్ని ఇలా సెలబ్రేట్ చేయమని తన అభ్యర్థులను కోరి..అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అతడి వినూత్న ఆలోచన చూసి..'వాటే ఎంపీ' అంటూ అంతా ప్రశంసిస్తున్నారు.అతడే అమృత్పాల్. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..కొందరు అభ్యర్థులు జైల్లో ఉన్నప్పటికీ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు.వారిలో ఒక అభ్యర్థే ఈ అమృత్పాల్. స్వతంత్ర అభ్యర్థి అమృతపాల్ సింగ్ పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇతడు రాడికల్ సిక్కు బోధకుడు, ఖలిస్థానీ అనుకూల గ్రూప్ ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత. ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి అమృతపాల్ సింగ్ దాదాపు లక్షా 90 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ప్రస్తుతం అసోం జైలులో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ను అరెస్టు చేశారు. అమృతపాల్ సింగ్ జైలులో ఉండగానే పెద్ద విజయం సాధించారు. అయితే ఈ విజయాన్ని మిఠాయలతో సెలబ్రేట్ చెయ్యొద్దని అన్నారు. అందరికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేసి వేడుక చేసుకోవాలని తన అభ్యర్థులకు సూచించారు. అంతేగాదు దాదాపు 5 లక్షల మొక్కలను పంపిణీ చేసేలా యత్నించమని అన్నారు. తాను వేడి, కాలుష్యం పట్ల ఆందోళన చెందుతున్నానని, అందువల్ల పర్వావరణ హితార్థం ఇలా మొక్కలు పంచండని అభ్యర్థులను కోరారు. వారు కూడా అతడు చెప్పినట్లు అతడి పేరుతో మొక్కలను డిస్ట్రూబ్యూట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు పర్యావరణం పట్ల స్ప్రుహ కలిగిన గొప్ప నేత అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. Amritpal requested his supporters not to distribute sweets but plants after his victory. A target of distribution of 5 lakh plants has been set. Amritpal said he is worried about the rising heat and pollution. pic.twitter.com/3FwGEztaDP— Poor Vegitarian Majdoor 🤡(Modi ka Parivar) (@Nayak_Khalnyak) June 5, 2024 (చదవండి: ఆ చిన్న సిరామిక్ మేక బొమ్మ అన్ని లక్షలా..!) -
మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మూడోసారి అధికార పగ్గాలు స్వీకరిస్తున్న ప్రధాని మోదీకి పలు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధా ని రిషి సునాక్, జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ ఇలా 75 దేశాలకు చెందిన అగ్రనేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
Priyanka Gandhi: మీ చెల్లెల్ని అయినందుకు గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: తన సోదరుడు రాహుల్ గాంధీ ఎప్పటికీ వెనక్కి తగ్గరని, సత్యం కోసం పోరాటాన్ని ఆపబోరని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ప్రశంసించారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్కు బుధవారం ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. ‘‘మీరు ఎప్పుడూ తలెత్తుకొని ఉంటారు. ఎవరేం చెప్పినా, ఏం చేసినా, ఎన్నిక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీరు వెనక్కి తగ్గరు. మీ అంకితభావాన్ని ఎవరెంతగా సందేహించినా మీరు మీపై విశ్వాసం కోల్పోరు. కోపం, విద్వేషం వంటివి మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. మీరు చాలా ధైర్యవంతులు. మీ చెల్లెల్ని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని ప్రియాంక పోస్టు చేశారు. -
దాతల సాయంతో గెలుపు.. కాంగ్రెస్ అభ్యర్థి భావోద్వేగం
అహ్మదాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాలు కొందరికి విజయాన్ని మరికొందరికి అపజయాన్ని మిగిల్చాయి. అయితే విజయం కొందరిని అంతులేని ఆనందాన్ని ఇవ్వడంతో పాటు భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇందుకు గుజరాత్ బనస్కాంతా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి గెనిబెన్ థాకూర్ గెలుపే నిదర్శనం.తాను గెలిచినట్లు తెలియగానే థాకూర్ కౌంటింగ్ సెంటర్ వద్ద తీవ్ర భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఆమె తనవారిని పట్టుకుని ఏడ్చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం ఒకటి. ఇదే కాకుండా ఈమె తన ఎన్నికల ప్రచారానికి కావాల్సిన నిధులను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా దాతల నుంచి సేకరించం మరొకటి. ఏది ఏమైనా కొందరికి ఎన్నికల్లో గెలుపు సాధారణమే అయినప్పటికీ గెనిబెన్ లాంటి వాళ్లకు మాత్రం విజయం అసాధారణమనే చెప్పొచ్చు. Geniben Thakor of Congress won historic seat in Banaskantha, Gujarat. She had to crowdsource funds to contest.Such stories needs to be cherished. pic.twitter.com/MvZtlxtmqK— Nehr_who? (@Nher_who) June 4, 2024 -
బీజేపీ నేతలుతో మోడీ సంబరాలు..
-
గెలుపుపై ఎంపీ గురుమూర్తి రియాక్షన్
-
తెలంగాణలో బలం పుంజుకున్న బీజేపీ
-
కంగనా విజయం.. ఆనందంతో తల్లి, సోదరి నృత్యం
బాలీవుడ్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ను ఓడించారు.మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమె విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో మండీ ప్రజలు ఆనందంతో నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కంగనా సోదరి రంగోలి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలలో తల్లితో పాటు డ్యాన్స్ చేస్తున్న రంగోలి కూడా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలలో కంగనా బంధువులు, అభిమానులు కూడా ఉన్నారు. ఈ విజయం తర్వాత కంగనా ఒక పోస్ట్ను షేర్ చేశారు. దానిలో ఆమె మండీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
నా గెలుపుకు కారణం జగనన్నే
-
నవీన్ చరిష్మాకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నియక్ 24 ఏళ్ల పాలనకు తెర పడింది. ఆయన సారథ్యంలోని బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అధికారం కోల్పోయింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒడిశా అస్మిత (ఆత్మగౌరవం) నినాదానికి తోడు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాల ప్రచారం బీజేపీని విజయతీరాలకు చేర్చింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 23 చోట్ల గెలిచింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ తొలిసారి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 113 చోట్ల గెలిచిన బీజేడీ ఈసారి 51 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఐఎం ఒకచోట గెలిచాయి. సుదీర్ఘ సీఎం రికార్డ్ మిస్ 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పటా్నయక్ పార్టీ గెలిచి సీఎం పదవి చేపడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకునేవారు. అయితే బీజేడీ విజయయాత్రకు బీజేపీ బ్రేకులు వేసింది. హింజిలి నియోజకవర్గంలో కేవలం 4,636 ఓట్ల తేడాతో నవీన్ ఎలాగోలా గెలిచారు.పనిచేసిన ఒడిశా అస్మిత నినాదం ఈ ఎన్నికల్లో సమస్యల కంటే బీజేపీ ‘ఒడిశా అస్మిత’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్ పట్నియక్ అనారోగ్య కారణాలను ఆసరాగా చేసుకుని తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండియన్ బీజేడీ పారీ్టపై ఆధిపత్యాన్ని చలాయించారు. ఈ అంశాన్ని బీజేపీ విజయవంతంగా ప్రచార అస్త్రంగా మలిచింది. ఒడిశా భవిష్యత్తును స్థానికేతరుల చేతిలో పెట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేడీ తాకట్టు పెట్టిందని పాండ్యన్ లక్ష్యంగా అస్మిత నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా పటా్నయక్ అవినీతి మరకలు లేని నేత. కానీ బీజేడీ సర్కార్లో మంత్రులఅవినీతినే ప్రధాన ప్రచారా్రస్తాలుగా మలచి బీజేపీ విజయబావుటా ఎగరేసింది. -
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
అమేథీ: అమేథీ నియోజకవర్గంలో 2019లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే ఓడించిన బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఈయన ఢీకొట్టగలరా? అన్న విశ్లేషకుల అనుమానాలను పటాపంచలు చేస్తూ కిశోరీ లాల్ శర్మ జయకేతనం ఎగరేశారు. మంగళవారం అమేథీ నియోజవర్గంలో çస్మృతి ఇరానీపై 1,67,196 ఓట్ల మెజారిటీతో కిశోరీ లాల్ శర్మ ఘన విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే లక్షకుపైగా మెజారిటీ సాధించి అమేథీ కాంగ్రెస్కు కంచుకోట అని కిశోరీలాల్ మరోసారి నిరూపించారు.రాహుల్ను ఇరానీ గతంలో 55వేల ఓట్ల తేడాతో ఓడిస్తే ఈసారి ఆమెను శర్మ అంతకు మూడురెట్లకు మించి మెజారిటీతో ఓడించడం విశేషం. ‘‘ ఈ విజయం నా ఒక్కరిది కాదు. మొత్తం నియోజకవర్గ కుటుంబాలది. ఇంతటి విజయం అందించిన అమేథీ ప్రజలకు నా కృతజ్ఞతలు. ఈ విజయం అమేథీ ప్రజలు, గాంధీల కుటుంబానికే చెందుతుంది. మనది బలీయ, ప్రజాస్వామ్య భారతం అని అమేథీ చాటింది’ అని ఫలితం వెలువడ్డాక కిశోరీలాల్ వ్యాఖ్యానించారు.విజయం సాధించిన విధేయత: గాంధీల కుటుంబానికి అత్యంత విధేయుడిగా కిశోరీ లాల్ శర్మకు మంచి పేరుంది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. శర్మ సొంత రాష్ట్రం పంజాబ్. లూథియానాకు చెందిన శర్మ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీకి సన్నిహితుడు కూడా. 1983లో రాజీవ్తోపాటు యూపీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. నాటి నుంచి స్థానిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 1991లో రాజీవ్ మరణానంతరం గాంధీల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. 1999లో తొలిసారిగా సోనియాగాంధీ అమేథీ నియోజవర్గంలో ఘన విజయం సాధించడంలో శర్మ కృషి దాగిఉందని అమేథీ రాజకీయ వర్గాలు చెబుతాయి.అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున అన్ని పనులు శర్మనే చూసుకునేవారు. అమేథీ, రాయ్బరేలీల్లో రాహుల్, సోనియా అందుబాటులో లేనపుడు నియోజకవర్గ సమస్యలపై పార్టీ అగ్రనాయకత్వానికి తెలియ జేయడం వంటి పనులనూ చక్క బెట్టేవారు. రాయ్బరేలీ ప్రజలతో ఈయన మంచి పరిచయం ఉంది. గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ ఓడిపోయాక నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యవహారాలను శర్మనే చూసుకున్నారు.కొంతకాలం బిహార్, పంజాబ్ రాష్ట్రాల వ్యవహారాలనూ చూశారు. అమేథీ రాజకీయాల్లో తెరవెనుకే ఉండిపోయిన కిశోరీ లాల్.. రాహుల్ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయినా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించడం విశేషం. 2019 లోక్సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్పై స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదే ఊపులో బరిలో దిగిన స్మృతి ఇరానీని శర్మ ఈసారి ఇంటిబాట పట్టించారు. నియోజవర్గ సమస్యలపై పోరాటం చేసినందుకు ఫలితంగానే కిశోరీలాల్కు విజయకిరీటాన్ని ఓటర్లు కట్టబెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు.కిశోరీ భాయ్.. ముందే చెప్పా: ప్రియాంకా గాంధీకిశోరీ లాల్ గెలుపుపై పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ‘‘ కిశోరీ భాయ్.. మొదట్నుంచీ మీ గెలుపు మీద నాకు ఏమాత్రం సందేహం లేదు. మీరు గెలుస్తారని తొలినుంచీ బలంగా నమ్ముతున్నా. మీకు, నియోజకవర్గ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ‘ఎక్స్’లో హిందీలో ట్వీట్చేశారు. -
తెలంగాణలో బీజేపీ ప్రభంజనం
-
వైఎస్సార్సీపీ విజయం ఖాయమైపోయిందని పార్టీ నేతల ధీమా
-
తమాంగ్ దెబ్బ.. ‘ఎస్కేఎమ్’ కనీవినీ ఎరుగని విజయం
గ్యాంగ్టక్: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్కేఎం) దూసుకుపోయింది. మొత్తం 32 స్థానాలకు గాను ఏకంగా 31 చోట్ల పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్)ను నామరూపాల్లేకుండా చేసింది. పాతికేళ్లపాటు నిరంతరాయంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీకి 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఓటమిని రుచి చూపించిన ఎస్కేఎం అధ్యక్షుడు, సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి సీఎం కుర్చీని అధిష్టించబోతున్నారు. ఈ ఘన విజయాల వెనుక తమాంగ్ వ్యూహాలు, కృషి దాగి ఉన్నాయి.ప్రేమ్ సింగ్ తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న నేపాలీ దంపతులకు జన్మించారు. డార్జిలింగ్లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. మూడేళ్ల పాటు పాఠాలు బోధించిన తర్వాత సామాజిక సేవపై ఆసక్తి చూపించి రాజకీయం వైపు మళ్లారు. తమాంగ్ను పీఎస్ గోలేగా కూడా పిలుచుకుంటారు.1994లో పవన్ చామ్లింగ్ స్థాపించిన ఎస్డీఎఫ్ చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎస్డీఎఫ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు పలు రకాల మంత్రిత్వశాఖలను నిర్వహించారు.2009 ఎన్నికల తర్వాత తమాంగ్కు ఎస్డీఎఫ్తో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేగా గెలిచినా పవన్ చామ్లింగ్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రి పదవికి బదులు నామినేటెడ్ పదవి ఇచ్చారు. దీనిని తిరస్కరించిన తమాంగ్, చామ్లింగ్ బంధుప్రీతి, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించి రాజకీయ గురువుపైనే తిరుగుబాటు చేశారు. 2009 డిసెంబర్ 21న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎస్డీఎఫ్పై నిప్పులు చెరిగారు. చివరికి 2013లో ఎస్కేఎం పేరుతో పార్టీని స్థాపించి తాజా గెలుపుతో రెండోసారి అధికారం చేపట్టబోతున్నారు. -
YSRCPదే ప్రభంజనం..
-
విజయం మనదే.. మహిళలకు పెద్దపీట..
-
బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్..
-
ఏపీలో వైఎస్ఆర్ సీపీదే విజయం..
-
జగన్ అనే నేను..
-
మళ్లీ జగనే సీఎం..బెజవాడ గడ్డ వైఎస్ఆర్ సీపీ అడ్డా
-
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రామ రాజ్యం లాంటి పరిపాలన జగనన్నకే సాధ్యం..
-
యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
న్యూఢిల్లీ:రష్యాలో జరిగిన మిలిటరీ యుద్ధ ట్యాంకు రేసుల ఛాంపియన్షిప్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ పోటీల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన డ్రైవర్ మన్దీప్సింగ్ 50 టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకుతో దూసుకెళ్లి రేసులో అలవోకగా విజయం సాధించారు. భారత జాతీయ జెండా రెపరెపలాడుతుండగా యుద్ధ ట్యాంకు దూసుకెళుతున్న వీడియోను బ్రిగేడియర్ హర్దీప్సింగ్సోహి తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో సోమవారం(మే27) పోస్టు చేశారు. ఈ ట్వీట్కు ఇండియన్ ఆర్మీ ట్యాగ్ను జత చేశారు. ఈ విజయానికిగాను ట్యాంకు డ్రైవర్ మన్దీప్సింగ్పై అభినందనలు వెల్లువెత్తు తున్నాయి. -
YSRCP దే ఘన విజయం..
-
చంద్రబాబు లా గాలి మాటలు చెప్పడు..జగన్ చెప్పాడంటే అది జరుగుతుంది
-
దేశ రాజకీయ చరిత్రలోనే YSRCP సరికొత్త చరిత్ర..
-
ఆంధ్రప్రదేశ్లో వన్స్మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ మళ్లీ గెలిస్తే.. తదుపరి ప్రధాని అమిత్ షా!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తే నరేంద్ర మోదీ.. అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మార్చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీలో సీనియర్ నేతల రాజకీయ జీవితానికి ముగింపు పలికిన మోదీ ‘ఒక దేశం, ఒకే నాయకుడు’ పేరిట ప్రమాదకరమైన మిషన్ను ప్రారంభించారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే ప్రతిపక్ష నేతలంతా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, స్టాలిన్, పినరయి విజయన్ తదితరులను మోదీ ప్రభుత్వం కచి్చతంగా జైలుకు పంపిస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టి నియంతృత్వ పాలన తీసుకురావాలన్నదే ప్రధాని లక్ష్యమని చెప్పారు. బీజేపీలోని తన ప్రత్యర్థులను రాజకీయంగా అంతం చేయాలని మోదీ భావిస్తున్నారని పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. జూన్ 4 తర్వాత ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక నిపుణులతో, ప్రజలతో మాట్లాడానని, ఎన్నికల్లో బీజేపీకి ఓడిపోవడం ఖాయమని పేర్కొ న్నారు. కేంద్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో ‘ఆప్’ చేరుతుందని, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ ఇంకా ఏం చెప్పారంటే.. ఎందుకు రాజీనామా చేయలేదంటే... ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదు. నాపై కేసు నమోదైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం వెనుక కారణం ఉంది. ఢిల్లీలో భారీ మెజారీ్టతో మేము గెలిచాం. అందుకే మాపై కక్షగట్టారు. తప్పుడు కేసులో ఇరికించి, నన్ను బలవంతంగా పదవి నుంచి దింపేయడానికి కుట్ర జరిగింది. కుట్రను ఛేదించి, బీజేపీపై పోరాటం కొనసాగించడానికే పదవికి రాజీనామా చేయొద్దని నిర్ణయించుకున్నా. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తా. ప్రజాస్వామ్యాన్ని ఖైదు చేస్తే పరిపాలన ఆగదు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే పాలన నడిపిస్తే బాగుండేది. దొంగలు, దోపిడీదారులకు బీజేపీ అడ్డాగా మారింది. అవినీతిపై పోరాటం ఎలా చేయాలో ప్రధాని మోదీ నిజంగా నేర్చుకోవాలనుకుంటే నన్ను చూసి నేర్చుకోవాలి. అవినీతిపరులను మేము జైలుకు పంపించాం. ఈ విషయంలో మా మంత్రులనూ వదిలిపెట్టలేదు’’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. హనుమాన్ ఆలయంలో పూజలు అరవింద్ కేజ్రీవాల్ శనివారం సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉన్నారు. హనుమాన్జీ ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.అమిత్ షా కోసం ఓట్లడుగుతున్న మోదీ ‘‘ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని బీజేపీ నేతలు అంటున్నారు. ఒకవేళ బీజేపీ మళ్లీ గెలిస్తే తదుపరి ప్రధానమంత్రి ఎవరవుతారో ఆ పార్టీ నాయకులు చెప్పాలి. వచ్చే ఏడాది సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధనను మోదీ తీసుకొచ్చారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుమిత్రా మహాజన్ వంటి నేతలను పక్కనపెట్టారు. శివరాజ్సింగ్ చౌహాన్, వసుంధరరాజే సింధియా, మనోహర్లాల్ ఖట్టర్, రమణ్ సింగ్ వంటి నాయకుల రాజకీయ జీవితానికి మోదీ ముగింపు పలికారు. ఇక తర్వాతి వంతు యోగి ఆదిత్యనాథ్దే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే రెండు నెలల్లోనే యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితానికి తెరపడుతుంది. ఉత్తరప్రదేశ్లో మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తారు. యోగిని రాజకీయాల నుంచి శాశ్వతంగా బయటకు పంపిస్తారు. వచ్చే ఏడాది మోదీ కూడా పదవి నుంచి తప్పుకుంటారు. అమిత్ షాను ప్రధానమంత్రిని చేస్తారు. మోదీ ఇప్పుడు అమిత్ షా కోసం ఓట్లు అడుగుతున్నారు. మోదీ ఇచి్చన గ్యారంటీలను అమిత్ షా నెరవేరుస్తారా? ఒక దేశంలో ఒకే నాయకుడు ఉండాలన్నదే మోదీ విధానం. ఇదే నియంతృత్వం. నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం నా ఒక్కడితో సాధ్యం కాదు. అందుకు 140 మంది కోట్ల ప్రజల మద్దతు, ఆశీర్వాదం కావాలి’’ -
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 383 స్థానాలు.. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీకి 22, తెలంగాణలో కాంగ్రెస్కు 9 ఎంపీ సీట్లు... టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే వెల్లడి .. ఇంకా ఇతర అప్డేట్స్
-
Lok sabha elections 2024:ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయం
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 383 స్థానాలొస్తాయని, విపక్ష ఇండియా కూటమి 118 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అధికార బీజేపీ ఏకంగా 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 37 లోక్సభ స్థానాలతో కుదేలవనుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 49 శాతం ఓట్లు ఒడిసిపడుతుందని, ఇండియా కూటమికి 34 శాతం వస్తాయని తేల్చింది. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 సీట్లు సాధించి లోక్సభలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. తమిళనాట డీఎంకేకు కూడా 22 స్థానాలొస్తాయని, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు 19, ఒడిశాలో బిజూ జనతాదళ్కు 11 సీట్లొస్తాయని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో పడ్డట్టు కని్పస్తున్న ఆప్ 6 స్థానాలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందని సర్వే పేర్కొనడం విశేషం. ఇక అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్కు 9 దక్కుతాయని, బీజేపీ 5, మజ్లిస్ ఒక స్థానం గెలుచుకుంటాయని వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమికి తోడు నేతల వలస తదితరాలతో కుంగిపోయిన బీఆర్ఎస్ 2 స్థానాలకు పరిమితబమవుతుందని తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. అందులో ఒక్క బీజేపీయే ఏకంగా 303 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. యూపీఏకు 91, ఇతరులకు 98 సీట్లొచ్చాయి. -
మధురలో హేమ మాలినికి ముళ్లబాట?
లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. ఇదేసమయంలో ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్కు టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఎన్నికల పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన హేమ మాలినికి గట్టిపోటీ ఎదురుకానున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. నటి హేమ మాలిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఇమేజ్పై ఆధారపడి ముందుకు సాగుతున్నారనే మాట వినిపిస్తుంటుంది. హిందుత్వ వాదం కూడా ఆమెకు కలిసివచ్చే ఫ్యాక్టర్ అని చెబుతుంటారు. ఒకవైపు హేమమాలిని ఇండియా అలయన్స్ నుండి ఒలింపియన్ బాక్సర్ విజేందర్ సింగ్తో తలపడనుండగా, మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బరిలోకి దిగిన మాజీ ఐఆర్ఎస్ అధికారి సురేష్ సింగ్ ఆమెకు పోటీనిస్తున్నారు. దీంతో హేమ మాలినికి మధుర లోక్సభ ఎన్నికలు ముళ్ల బాటను తలపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో జాట్ల ఓట్ల శాతం అధికం. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర భార్య అయిన హేమ మాలిని తనకు జాట్ కమ్యూనిటీ మద్దతు ఉందని గతంలో ప్రకటించారు. బాక్సర్ విజేందర్ సింగ్ హర్యానాలోని భివానీకి చెందిన ఆటగాడు. ఇప్పుడు మధురకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యారు. బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన సురేష్ సింగ్ పదవీ విరమణ చేశాక మధురలోని ఒక విద్యా సంస్థకు అధిపతిగా ఉంటున్నారు. ఆయన పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నారు. హేమ మాలిని మధుర, బృందావన్లలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆమె శ్రీ కృష్ణ భక్తురాలిగా పేరొందారు. అయితే యమునా నది శుద్దీకరణ, పారిశ్రామిక అభివృద్ధి తదితర స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఆమె విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తుంటారు. కాగా 2014లో హేమమాలిని చేతిలో ఓడిపోయిన ఆర్ఎల్డీకి నేత జయంత్ చౌదరి ఇప్పుడు ఎన్డీఏతో పొత్తు కారణంగా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశలో ఓటింగ్ జరగనుంది. -
ఒంటి చేత్తో మలుపు తిప్పిన రియాన్ పరాగ్
-
రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఘన విజయం
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్కు రికార్డుస్థాయిలో 88 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో పుతిన్తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. కాగా, చివరిరోజు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు రావాలని ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రతిపక్ష నేత నావల్నీ మద్దతుదారులు ఇచ్చిన పిలుపుతోనే చివరిరోజు ఓటర్లు పోటెతినట్లు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్ పెట్టెల్లో ఇంకు పోశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు అరెస్టయ్యారు. బలమైన ప్రత్యర్థులు, పుతిన్ను గట్టిగా విమర్శించేవారెవరూ లేకుండానే ఎన్నికలు కొనసాగాయి. పలు యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్దఎత్తున రష్యా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. ఇదీ చదవండి.. వెనక్కి తగ్గేది లేదు.. గాజాపై దాడులు కొనసాగిస్తాం -
నో స్మోకింగ్ డే! ఆ వ్యసనానికి చెక్పెట్టే ఆహారపదార్థాలివే!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే ట్యాగ్ లైన్లు, టీవీలోనూ, సినిమాల్లోనూ తప్పనిసరిగా కింద్ర స్రోల్ అవ్వుతుంటాయి. చూస్తారే తప్ప మారరు. పొగతాగటాన్ని అదో స్టయిల్గా, ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తారు చాలామంది. చివరికి అనారోగ్యం బారిన పడి తనపై ఆధారపడిన కుటుంబాన్ని నట్టేట వదిలేస్తారు. ఈ వ్యసనం కారణంగా ఎన్నో కుటుంబాలో రోడ్డున పడ్డాయి. అందువల్లే దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం 'నో స్మోకింగ్ డే'ని జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆ వ్యసనం నుంచి ఎలా బయటపడాలి? అందుకు ఎలాంటి ఆహార పదార్థాలు ఉపకరిస్తాయో తెలుసుకుందామా!. ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం రోజున ఈ 'నో స్మోకింగ్ డే' పేరుతో మిలియన్ల మంది ప్రజల్లోకి పొగ సేవించకూడదనే నినాదాన్ని బలంగా తీసుకువెళ్లిన చైతన్యవంతులను చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ధూమాపానం మానేయడమే ఒక ప్రధాన ఆరోగ్య విషయమని నొక్కి చెబుతున్నారు. ఈవ్యసనాన్ని సమతుల్య ఆహారంతోనే చెక్పెట్టగలమని, అదే శక్తిమంతమైన ఆయుధం అని తెలియజేస్తున్నారు. పోగ సేవించడం మానేయడంతోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణుల. స్మోకింగ్ మానేసే ప్రతీక్షణం మీ శరీరం మెరుగుపడుతుందని అర్థం అంటున్నారు. ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం..ప్రపంచవ్యాపంగా ధూమపానం చేసేవారిలో దాదాపు 12% మంది భారతీయులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ నివేదిక భవిష్యతులలో ధూమపాన రహిత భారత్గా మారుతుందనే కొత్త ఆశను రేకెత్తించింది. ఇక ఈ ధూమపాన వ్యసనం నుంచి బయటపడేందుకు ఈ ఆహారపదార్థాలు కీలక పాత్ర వహిస్తాయనిన నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. యాంటీఆక్సిడెంట్ పవర్హౌస్: బెర్రీలు, ఆకు కూరలు, సిట్రస్ పండ్లు, క్యారెట్లు వంటి కూరగాయలు ధూమపానం వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనడానికి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. పైగా సెల్ రిపేర్ను ప్రోత్సహిస్తాయి. ఇన్ఫ్లమేషన్ ఫైటర్స్: ఫ్లాక్స్ సీడ్స్(అవిసె గింజలు), ఫ్యాటీ ఫిష్ (సాల్మన్, మాకేరెల్), వాల్నట్లలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ధూమపానంతో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం: బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు తీసుకుంటే పొగతాగటం వల్ల పాడైన చర్మం ఆరోగ్యవంతంగా అవుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ 'ఈ' సమృద్ధిగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్థిరమైన శక్తి మూలం: నిరంతర శక్తి కోసం క్వినోవా, బ్రౌన్ రైస్ ,ఓట్స్ వంటి తృణధాన్యాలను తీసుకోండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పైగా పొగతాగటం మానేయాలనే ఫీల్ని తీసుకువస్తుంది. కండరాల నిర్వహణకు: టోఫు, పౌల్ట్రీ, చేపలు, చిక్కుళ్ళు వంటి ప్రోటీన్ మూలాలు కండరాల మరమ్మత్తు, నిర్వహణకు మద్దతు ఇస్తుంది. పొగతాగటం వదిలేసిన తర్వాత శరీరంలో సంభవించే మార్పులను సరిచేస్తుంది. హైడ్రేషన్ కీలకం: హైడ్రేటెడ్గా ఉండటానికి నీరు, సహజ టీలు పుష్కలంగా తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించే ధూమపానం జోలికి వెళ్లాలన్న ఆలోచనను నియంత్రిస్తుంది. (చదవండి: దాల్చిన చెక్కతో సమస్యకు చెక్పెట్టండిలా!) -
I-League 2023-24: శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు మరో విజయం
లుధియానా: ఐ–లీగ్ జాతీయ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఖాతాలో 11వ విజయం చేరింది. ఢిల్లీ ఎఫ్సీతో ఆదివారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0 గోల్ తేడాతో గెలుపొందింది. ఆట 22వ నిమిషంలో రిల్వాన్ పాస్ను హెడర్ షాట్తో లాల్రొమావియా బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. దాంతో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శ్రీనిధి జట్టు ఈ ఆధిక్యాన్ని చివరి నిమిషందాకా కాపాడుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో ప్రస్తుతం శ్రీనిధి జట్టు 36 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈనెల 17న జరిగే తదుపరి మ్యాచ్లో గోకులం కేరళ ఎఫ్సీతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. -
రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం
-
బీజేపీ థ్రిల్లింగ్ విక్టరీ.. కాంగ్రెస్కు బిగ్గెస్ట్ షాక్!
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు అయ్యింది. హిమాచల్ ప్రదేశ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓటింగ్లో ఫలితం సమం కావడంతో డ్రా కాగా.. టాస్లో తమ అభ్యర్థి హర్ష మహాజన్ నెగ్గినట్లు బీజేపీ ప్రకటించుకుంది. దీంతో సంఖ్యా బలం లేకున్నా బీజేపీని అదృష్టం వరించినట్లయ్యింది. అయితే ఈ ఫలితంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఒక్క రాజ్యసభ సీటు ఉంది. దీనికి మంగళవారం ఓటింగ్ జరిగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 68 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కాంగ్రెస్కు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే.. రాజ్యసభ సీటు గెల్చుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కంటే ఐదుగురు కాంగ్రెస్కు ఎక్కువే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అని అంతా భావించారు. అయితే.. సంఖ్యా బలం లేకున్నా అనూహ్యంగా రాజ్యసభ బరిలో అభ్యర్థిని నిలిపింది బీజేపీ. దీంతో ఓటింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ జరిగిన ఓటింగ్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకే ఓటేసినట్లు. దీంతో ఊహించని రీతిలో.. ఫలితం 34-34తో సమం అయ్యింది. డ్రా కావడంతో టాస్ అనివార్యం కాగా.. అందులో తామే నెగ్గినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత జైరామ్ థాకూర్ ప్రకటన కూడా చేశారు. అయితే.. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారనంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సర్కార్కు ముప్పు.. హిమాచల్ ప్రదేశ్ తాజా పరిణామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. రాజ్యసభ ఫలితం పరిణామంతో ప్రభుత్వం మెజారిటీలో లేదని స్పష్టమవుతోందని జైరామ్ ఠాకూర్ అన్నారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఠాకూర్ డిమాండ్ చేస్తున్నారు. రేపటి బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రభుత్వంపై ఫ్లోర్ టెస్ట్ ఒత్తిడికి డిమాండ్ చేస్తామని అన్నారాయన. ఒకవేళ.. అదే జరిగితే రెండేళ్లు తిరగకుండానే హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. అదే విధంగా దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. హిమాచల్ను కోల్పోతే ఆ సంఖ్య రెండుకే పరిమితం కానుంది. -
Lok Sabha elections 2024: జూన్ నుంచి మూడో టర్ము
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జూన్ నుంచి తమ మూడో టర్ము పాలన మొదలవుతుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘ఆ తర్వాత సాకారమయ్యే వికసిత భారత్ దేశ యువత కలలకు ప్రతిరూపంగా ఉంటుంది. దేశ రూపురేఖలు ఎలా ఉండాలో నిర్ణయించే పూర్తి హక్కులు వారికున్నాయి. వారి కలలే నా సంకల్పం.నా సంకల్పమే వికసిత భారతానికి హామీ. ఈ నయా భారత్లో చిన్న లక్ష్యాలకు చోటు లేదు. పెద్ద పెద్ద కలలు కంటూ వాటి సాకారానికి నిరి్వరామంగా కృషి చేస్తున్నాం. పదేళ్లుగా ఈ వేగం ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది’’ అన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా రూ.41 వేల కోట్లతో తలపెట్టిన 2,000 పై చిలుకు రైల్వే ప్రాజెక్టులకు సోమవారం ఆయన వర్చువల్గా శంకుస్థాపన చేశారు.వీటిలో 27 రాష్ట్రాల పరిధిలో 554 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి, 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్బ్రిడ్జి పనులున్నాయి. తెలంగాణలో రూ.230 కోట్లతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లతో 17 రైల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లకు మోదీ భూమి పూజ చేశారు. రూ.221 కోట్లతో పూర్తయిన 3 రైల్ ఫ్లై ఓవర్, 29 రైల్ అండర్ పాస్లను జాతికి అంకితం చేశారు.కాంగ్రెస్ పాలనలో రైల్వే శాఖ రాజకీయ క్రీడలకు వేదికగా కునారిల్లిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. తమ పాలనలో పదేళ్లుగా ఆధునికతను అందిపుచ్చుకుని దూసుకుపోతోందన్నారు. ‘‘కొన్నేళ్లుగా భారత్ అన్ని రంగాల్లోనూ శరవేగంగా ప్రగతి సాధిస్తోంది. పన్నుల రూపేణా ప్రజలు చెల్లిస్తున్న ప్రతి రూపాయినీ వారి సంక్షేమానికే వెచి్చస్తున్నాం. గత కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్లను ప్రారంభించా’’ అని చెప్పారు.టెక్స్టైల్ రంగ ప్రగతికి సాయంటెక్స్టైల్ రంగానికి కేంద్రం అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ చెప్పారు. ‘‘దేశాభివృద్ధిలో ఆ రంగానిది కీలక పాత్ర వికసిత భారత లక్ష్యసాధనలో టెక్స్టైల్ రంగం పాత్రను మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నాం’’ అన్నారు. భారత్ టెక్స్–2024ను మోదీ ప్రారంభించారు.‘‘వికసిత భారతానికి పేదలు, యువత, రైతులు, మహిళలు నాలుగు స్తంభాలు. వారందరికీ టెక్స్టైల్ రంగంలో గణనీయమైన పాత్ర ఉంటుంది’’ అని ఈ సందర్భంగా అన్నారు. 2014లో రూ.7 లక్షల కోట్లున్న భారత టెక్స్టైల్ రంగం విలువ ఇప్పుడు రూ.12 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. నాలుగు రోజుల భారత్ ఎక్స్పోలో 100కు పైగా దేశాల నుంచి 3,500కు పైగా ఎగ్జిబిటర్లు, 3,000 పై చిలుకు కొనుగోలుదారులు, 40 వేల మందికి పైగా వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటున్నారు. -
‘పాక్’ ఫలితాల మధ్య ఇమ్రాన్ ‘విక్టరీ స్పీచ్’
పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడబోతున్నదనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అటు ఇమ్రాన్ఖాన్.. ఇటు నవాజ్ షరీఫ్ విజయం తమదేనని చెబుతున్నారు. ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంపై పాకిస్తాన్ ఎన్నికల సంఘంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ మాజీ ప్రధాని, ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (సీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఏఐ ఆధారిత ‘విక్టరీ స్పీచ్’ను విడుదల చేశారు. ఈ ప్రసంగంలో ఆయన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్’ (పిఎంఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ ‘లండన్ ప్లాన్’ విఫలమైందని, పోలింగ్ రోజున ఓటర్లు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో ‘నా ప్రియమైన దేశప్రజలారా.. ఇంత పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని, మీ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారు. పౌర స్వేచ్ఛను పునరుద్ధరించడానికి మీరు పునాది వేశారు. నేను కూడా ఓటు వేశాను. ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించేందుకు మీరు సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నా నమ్మకాన్ని నిలబెట్టారు. ఎన్నికల్లో భారీ ఓటింగ్ చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. మీరంతా ప్రజాస్వామ్య కసరత్తులో చురుకుగా పాల్గొనడం వల్ల ‘లండన్ ప్లాన్’ విఫలమైంది’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఇమ్రాన్ జైలులో ఉన్నా.. పాక్ యువత ఎందుకు మద్దతు పలికింది? -
భారత్కు తొలి విజయం
భువనేశ్వర్: మహిళల ప్రొ లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన భారత మహిళల జట్టు నాలుగో మ్యాచ్లో విజయం రుచి చూసింది. అమెరికా జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సవితా పూనియా బృందం 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున వందన కటారియా (9వ ని.లో), దీపిక (26వ ని.లో), సలీమా టెటె (56వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. అమెరికా జట్టుకు సేన్ కార్ల్స్ (42వ ని.లో) ఏకైక గోల్ అందించింది. భారత జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్లు, అమెరికా జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే రెండు జట్లు ఈ పెనాల్టీ కార్నర్లను వృథా చేశాయి. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో భారత్ మూడు పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. సోమవారం జరిగే ఐదో మ్యాచ్లో చైనాతో భారత్ ఆడుతుంది. -
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ‘అవామీ’ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 300 పార్లమెంట్ స్థానాలకు గాను 299 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, అవామీ లీగ్ ఏకంగా 223 స్థానాలు సొంతం చేసుకుంది. ఎన్నికలు అదివారం జరగ్గా, సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తుది ఫలితాలు వెలువడ్డాయి. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైన జతియా పార్టీ 11 సీట్లు గెలుచుకుంది. బంగ్లాదేశ్ కల్యాణ్ పార్టీ కేవలం ఒక స్థానంలో గెలుపొందింది. 62 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అలాగే జతియా సమాజ్ తాంత్రిక్ దళ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. అవామీ లీగ్ అధినేత, ప్రధానమంత్రి షేక్ హసీనా గోపాల్గంజ్–3 నియోజకవర్గం నుంచి అఖండ విజయం సాధించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్కు ఆమె ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. హసీనా రికార్డు 76 ఏళ్ల షేక్ హసీనా 2009 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొత్తంగా ఆమె ప్రధాని అవుతుండడం ఇది ఐదోసారి. బంగ్లా చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్టతో పాటు మరో 15 పార్టీలు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఈసారి కేవలం 41.8 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 80 శాతానికి పైగా నమోదవడం విశేషం. ఇండియా గొప్ప మిత్రదేశం భారత్ తమకు గొప్ప మిత్రదేశమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కొనియాడారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇరుగుపొరుగు దేశాలైన భారత్–బంగ్లాదేశ్ ఎన్నో సమస్యలను కలిసి పరిష్కరించుకున్నాయని చెప్పారు. 1971, 1975లో భారత్ తమకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. తనకు, సోదరికి, కుటుంబ సభ్యులకు ఆశ్రయం కలి్పంచిందని అన్నారు. ఇండియాను తమ పక్కింటిలాంటి మిత్రదేశంగా భావిస్తామని తెలిపారు. ఇండియాతో తమకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. -
Sheik Hasina: ఎన్నికల్లో విజయం.. బంగ్లా ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఢాకా: ఐదోసారి బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన అవామీ లీగ్ చీఫ్, దేశ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సహజంగానే బంగ్లాదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే నా లక్ష్యం. 2041కల్లా బంగ్లాదేశ్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. స్మార్ట్ ఎకానమి, స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ప్రజలు నా లక్ష్యాలు’ అని ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లు గెలిచి ఘన విజయం సాధించిన తర్వాత హసీనా అన్నారు. ఆదివారం జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలను ఆ దేశ ప్రధాన పతిపక్ష పార్టీ బహిష్కరించింది. ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. దీంతో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ విజయం ఎన్నికల ముందే దాదాపు ఖరారైంది. అయితే ప్రతిపక్ష బీఎన్పీ పార్టీ ఉగ్రవాదులతో కుమ్మక్కై ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడిందని, వారు ఎన్నికలను బహిష్కరించి తనను గెలిపించలేదని, బంగ్లాదేశ్ ప్రజలను గెలిపించారని హసీనా అన్నారు. ఇదీచదవండి..మళ్లీ తీవ్రమవుతున్న యుద్ధం -
మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో హెచ్ఆర్డీఏ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికల్లో హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ఘన విజయం సాధించింది. హెచ్ఆర్డీఏ ప్రెసిడెంట్ డాక్టర్ మహేశ్కుమార్ నేతృత్వంలోని డాక్టర్ల టీమ్ ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకుంది. హేమాహేమీలుగా పిలిచే ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు ఓడిపోయారు. కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉన్న ప్రతి డాక్టర్ 13 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఈ 13 ఓట్లను కలిపి ఒక్క ఓటుగా పరిగణిస్తారు. అలా ఈ ఎన్నికల్లో మొత్తం 17,090 ఓట్లు పోల్ కాగా, రకరకాల కారణాలతో 3,311 ఓట్లను రిటర్ణింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. మిగిలిన 13,779 ఓట్లను లెక్కించారు. అత్యధికంగా డాక్టర్ ప్రతిభాలక్ష్మి 7,007 ఓట్లను సాధించగా, డాక్టర్ మహేశ్కుమార్ 6,735 ఓట్లు సాధించారు. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ఎన్నికలు... రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. మెడికల్ కౌన్సిల్ 25 మంది డాక్టర్లతో ఏర్పాటవుతుంది. అందులో 13 మంది ఇప్పుడు డాక్టర్లు ఓటు ద్వారా ఎన్నికయ్యారు. మిగిలిన 12 మందిని ప్రభుత్వం నామినేట్ చేయాల్సి ఉంది. అనంతరం చైర్మన్ను ఎన్నుకుంటారు. చైర్మన్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ పదవినీ హెచ్ఆర్డీఏ కైవసం చేసుకునే అవకాశం ఉంది. వాస్తవంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే మెడికల్ కౌన్సిల్ ఎన్నికలకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల వల్ల మెడికల్ కౌన్సిల్ ఎన్నికలపై ఎవరూ పెద్దగా ఫోకస్ చేయలేదు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు రిజి్రస్టేషన్ చేసుకుంటారు. ఈ ఎన్నికల్లో వారే ఓట్లేశారు. విజేతలు సాధించిన ఓట్లు ఇలా డాక్టర్ ప్రతిభా లక్ష్మి 7,007 ఓట్లు, డాక్టర్ కె.మహేష్కుమార్ 6,735, డాక్టర్ బండారి రాజ్కుమార్ 6,593, డాక్టర్ జి.శ్రీనివాస్ 6,454, డాక్టర్ కిరణ్కుమార్ 6,434, డాక్టర్ ఎస్.ఆనంద్ 6,192, యెగ్గన శ్రీనివాస్ 6,086, డాక్టర్ రవికుమార్ 6,085, డాక్టర్ నరేష్కుమార్ 6,091, డాక్టర్ శ్రీకాంత్ 5,974, డాక్టర్ సన్నీ దావిస్ 5,912, డాక్టర్ విష్ణు 5,844, డాక్టర్ సయ్యద్ ఖాజా ఇమ్రాన్ అలీ 5695 ఓట్లు సాధించారు. -
భారత మహిళల మరో చరిత్ర
ముంబై: మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టు కొత్త రికార్డును నమోదు చేసింది. పరుగులపరంగా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి సొంతగడ్డపై సత్తా చాటింది. ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ 347 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలింగ్ ధాటికి మూడు రోజుల్లోపే ఈ మ్యాచ్ ముగియడం విశేషం. తొలి ఇన్నింగ్స్లో 35.3 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో మరీ పేలవంగా 27.3 ఓవర్లకే కుప్పకూలింది. 479 పరుగుల విజయలక్ష్యంతో శనివారం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 131 పరుగులకే ఆలౌటైంది. హీతర్ నైట్ (21)దే అత్యధిక స్కోరు కావడం ఆ జట్టు పరిస్థితిని చూపిస్తోంది. మిగిలిన బ్యాటర్లలో ఎవరూ కూడా భారత బౌలర్లను కనీసం ప్రతిఘటించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లుతో చెలరేగిన ఆఫ్స్పిన్నర్ దీప్తి శర్మ రెండో ఇన్నింగ్స్లోనూ (4/32) ప్రత్యరి్థని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించింది. పేసర్ పూజ వస్త్రకర్ ఆరంభంలో 3 కీలక వికెట్లు పడగొట్టగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్కు 2 వికెట్లు దక్కాయి. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 186/6 వద్దనే భారత్ తమ రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 292 పరుగుల ఆధిక్యం సాధించిన జట్టు ఇంగ్లండ్ ముందు 479 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మ్యాచ్లో మొత్తం 39 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టడంతో పాటు 87 పరుగులు సాధించిన దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. సొంతగడ్డపై భారత మహిళల జట్టు ఇంగ్లండ్ను ఓడించడం ఇదే మొదటిసారి (ఆరు టెస్టుల్లో) కావడం విశేషం. తాజా విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. గురువారంనుంచి వాంఖెడే స్టేడియంలో ఆ్రస్టేలియాతో ఏకైక టెస్టులో తలపడనున్న నేపథ్యంలో తాజా గెలుపు మరింత ప్రేరణ అందించడం ఖాయం. మరో వైపు ఇంగ్లండ్తో టెస్టులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టి అర్ధ సెంచరీ సాధించిన శుభ సతీశ్ ఆసీస్తో మ్యాచ్కు దూరం కానుంది. ఎడమచేతికి ఫ్రాక్చర్ కావడంతో ఆమె కోలుకునే అవకాశాలు దాదాపుగా లేవు. 347 మహిళల టెస్టుల్లో పరుగులపరంగా అతి పెద్ద విజయం. గతంలో శ్రీలంక (309 పరుగులు) పేరిట ఉన్న రికార్డును భారత్ సవరించింది. ఈ రెండూ మినహా ఇతర టెస్టు విజయాలన్నీ 200 పరుగుల లోపు తేడాతోనే వచ్చాయి. 3 ఇంగ్లండ్పై భారత్కు ఇది మూడో విజయం. 15 టెస్టుల్లో భారత్ 1 మ్యాచ్ ఓడగా 11 ‘డ్రా’గా ముగిశాయి. మిగిలిన రెండు సార్లు ఇంగ్లండ్లోనే భారత్ గెలిచింది. 27.3 రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆడిన ఓవర్లు. ఆలౌట్ అయిన సమయంలో ఏ జట్టుకైనా ఇదే అతి చిన్న ఇన్నింగ్స్. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 428, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 136, భారత్ రెండో ఇన్నింగ్స్ 186/6 డిక్లేర్డ్, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డంక్లీ (సి) (సబ్) హర్లీన్ 15; బీమాంట్ (బి) రేణుక 17; నైట్ (సి) యస్తిక (బి) పూజ 21; నాట్ సివర్ (బి) పూజ 0; వైట్ (సి) రాణా (బి) దీప్తి 12; జోన్స్ (సి) షఫాలీ (బి) దీప్తి 5; ఎకెల్స్టోన్ (బి) రాజేశ్వరి 10; డీన్ (నాటౌట్) 20; క్రాస్ (బి) దీప్తి 16; ఫైలర్ (బి) దీప్తి 0; బెల్ (సి) జెమీమా (బి) రాజేశ్వరి 8; ఎక్స్ట్రాలు 7; మొత్తం (27.3 ఓవర్లలో ఆలౌట్) 131. వికెట్ల పతనం: 1–27, 2–37, 3–37, 4–68, 5–68, 6–83, 7–83, 8–108, 9–108, 10–131. బౌలింగ్: రేణుకా సింగ్ 6–1–30–1, స్నేహ్ రాణా 4–0–19–0, పూజ వస్త్రకర్ 4–1–23–3, దీప్తి శర్మ 8–2–32–4, రాజేశ్వరి 5.3–1–20–2. -
తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై స్పందించిన దివ్యవాణి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందుకుంది. ఈ విజయం పట్ల ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు దివ్యవాణి స్పందించారు. ఈ విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కొనియాడారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఆమె అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె ఇండియా వచ్చిన వెంటనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలిపారు. -
తెలంగాణ గట్టు మీద కాంగ్రెస్ జెండా రెపరెపలు
-
మళ్లీ మధ్యప్రదేశ్ లో బీజేపీదే గెలుపు
-
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం.. 119 స్థానాలకు గాను 64 స్థానాలు కైవసం.. నేడు సీఎల్పీ సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రాజస్తాన్ రాజెవరో?
రాజస్తాన్ శాసనసభ ఎన్నికల్లో విపక్ష బీజేపీ ఘన విజయం సాధించింది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వానికి పరాభవం ఎదురైంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై అందరి దృష్టి కేంద్రకృతమైంది. రాజస్తాన్ రాజు ఎవరవుతారో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుంది. ప్రధానంగా నలుగురు ముఖ్యనేతలు సీఎం రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మరోసారి పదవి ఆశిస్తున్నారు. పార్లమెంట్ సభ్యురాలు దియా కుమారి(ఈ ఎన్నికల్లో విద్యాధర్నగర్ స్థానం నుంచి గెలిచారు), కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, మహంత్ బాలక్నాథ్ యోగి సైతం సీఎం పోస్టు కోసం పోటీపడుతున్నారు. ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే.. వసుంధర రాజే వసుంధర రాజే గతంలో రెండుసార్లు రాజస్తాన్ సీఎం చేశారు. ఈ ఎన్నికల్లో జాల్రాపటాన్ స్థానం నుంచి భారీ మెజారీ్టతో గెలుపొందారు. ఆమె బీజేపీ అధిష్టానాన్ని విభేదిస్తున్న నేతగా పేరుగాంచారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పెద్దగా సత్సంబంధాలు లేవన్న సంగతి బహిరంగ రహస్యమే. బీజేపీలో పాతతరం నేత అయిన వసుంధర రాజేను మూడోసారి గద్దెనెక్కించడానికి పార్టీ అగ్రనేతలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకపోవడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కుదించుకుపోయాయి. దియా కుమారి రాజ్సమంద్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దియా కుమారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి నెగ్గారు. జైపూర్ దివంగత మహారాణి గాయత్రి దేవి మనవరాలైన దియా కుమారి బీజేపీలో వసుంధర రాజేకు ప్రత్యామ్నాయ నేతగా ఎదిగారు. రాచరిక నేపథ్యం, రాజ్పుత్ వర్గానికి చెందిన మహిళ కావడం ఆమెకు కలిసివచ్చాయి. చాలాఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. గతంలో సవాయ్మాధోపూర్ ఎమ్మెల్యేగా ఆమె చేసిన అభివృద్ధి పనులు ప్రశంలందుకున్నాయి. రాజస్తాన్లో నూతన ముఖ్యమంత్రిని నియమించే విషయంలో పార్టీ అధిష్టానం దియా కుమారి వైపు మొగ్గు చూపుతున్నట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మహంత్ బాలక్నాథ్ యోగి రాజస్తాన్లోనూ ఉత్తరప్రదేశ్ తరహా ప్రయోగం చేయాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే పేరు మహంత్ బాలక్నాథ్ యోగి. ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ మఠాధిపతి అయిన ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యారు. బాలక్నాథ్ ప్రస్తుతం రాజస్తాన్లో అల్వార్ ఎంపీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. గతంలో సన్యాసం స్వీకరించారు. మహంత్ చాంద్నాథ్ మఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. రాష్ట్రంలో బలమైన అనుచరవర్గం ఉంది. నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం దృష్టిలో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గజేంద్రసింగ్ షెకావత్ రాజస్తాన్ బీజేపీలో మరో సీనియర్ నేత గజేంద్రసింగ్ షెకావత్. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అవినీతి వ్యవహారాలపై పలు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా పనిచేశారు. ముఖ్యమంత్రిపై పలు ఆరోపణలు గుప్పించారు. తదుపరి సీఎం రేసులో తాను ఉన్నానంటూ ఇప్పటికే సంకేతాలు పంపించారు. కొందరు బీజేపీ ముఖ్యనేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. సీఎం పోస్టుపై గజేంద్రసింగ్ ఆశలు పెట్టుకున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్రీకాంతాచారికి ఈ విజయం అంకితం: రేవంత్
-
నేను సీఎం కాదు
-
గెలుపును ముందే ఉహించాం..
-
కాంగ్రెస్ విజయానికి బీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణాలు..!
-
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్
-
సాగర్ లో ఈసారి కాంగ్రెస్ విజయం పక్కా: కుందూరు జైవీర్ రెడ్డి
-
80 స్థానాల్లో గెలుస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేస్తామని చెప్పారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలోని వార్రూమ్లో సమావేశమైంది. కమిటీ చైర్మన్ మురళీధరన్, పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, రోహిత్ చౌదరి, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జిగ్నేశ్ మేవానీ, సునీల్ కనుగోలు తదితరులు ఇందులో పాల్గొన్నారు. భేటీలో అభ్యర్థుల ఎంపిక, పొత్తులో ఉన్న పార్టీలకు సీట్ల కేటాయింపు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 25 లేదా 26వ తేదీన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. ఆ తర్వాత రెండో జాబితా విడుదల ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. నిజాముద్దీన్ దర్గాలో చాదర్ సమర్పణ రేవంత్రెడ్డి ఆదివారం ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాను సందర్శించారు. పార్టీ నేత అజారుద్దీన్తో కలసి చాదర్ సమర్పించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకున్నామని చెప్పారు. మతసామరస్యాన్ని కాపాడే విధంగా పాలన అందించాలని కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు. సెక్యులర్వాదిగా, కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిగా దర్గాకు వచ్చానని పేర్కొన్నారు. -
ఢిల్లీ లీడర్స్ రాకతో.. కేడర్లో జోష్
కె.రాహుల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనసంఘ్ (బీజేపీగా ఏర్పడడానికి ముందు) తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలుస్తూ వచ్చారు. 1982కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా తీరు, రాజకీయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సందర్భంలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ఓ రాజకీయశక్తిగా ఎదిగేందుకు సానుకూల పరిస్థితులున్నట్టు పార్టీ నేతలు అంచనా వేశారు. అయితే టీడీపీ ఆవిర్భావం, ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం వంటి పరిణామాలు, టీడీపీతో పొత్తు, 1995లో ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు సీఎం అయ్యాక, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుచేర్పులు, టీడీపీతో పొత్తుల కొనసాగింపు వంటివి రాష్ట్రంలో బీజేపీకి నష్టం చేశాయని చెప్పొచ్చు. తర్వాత 1998 లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీచేసి 4 ఎంపీ సీట్లు గెలుపొంది సత్తా చాటింది. అయితే ఆ వెంటనే 1999లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకోక తప్పలేదు. ఆ పరిస్థితి తెలంగాణ ఏర్పడేదాకా కొనసాగడం రాజకీయంగా బీజేపీకి తీరని నష్టం చేసిందని ఆ పార్టీ అగ్రనేతలే చెబుతుండడం గమనార్హం. 12 సీట్ల నుంచి ఒక్క సీటుకు.. ఉమ్మడి ఏపీలో..1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో పోటీచేసి బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఉమ్మడి ఏపీ, ఆ తర్వాత తెలంగాణలో అవే కమలదళం గెలిచిన అత్యధిక సీట్లు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక 2014లో తొలిసారి ఐదు సీట్లు సాధించినా, 2018లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసినప్పుడు కేవలం 8 శాతం ఓట్లతో ఒక్క స్థానానికే పరిమితమైంది. కానీ అనూహ్యంగా 2019 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే 4 సీట్లు గెలుచుకోవడంతో పాటు ఓటింగ్ శాతాన్ని ఒక్కసారిగా 20 శాతానికి పెంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన పోటీలో విజయం సాధించడం, ఈ రెండు ఉప ఎన్నికల మధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు (దీనికి ముందు 4 సీట్లే) గెలుపొందడంతో ఒక్కసారిగా బీజేపీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో జరిగిన మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్రెడ్డి విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేసినా, 12 వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్చేతిలో ఆయన ఓటమి చవిచూశారు. అయితే అంతకు ముందు అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పడిన 13 వేల ఓట్లు 90 వేల ఓట్లకు పెరగడం బీజేపీకి కొంత ఊరటనిచ్చింది. ఈ విధంగా ఈ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికే పరిమితం చేయడం విశేషం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కుందూరు జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి. మూడు వేర్వేరు గుర్తులపై జంగారెడ్డి విజయదుందుభి 1967లో భారతీయ జన సంఘ్ (బీజేఎస్) దీపం గుర్తుపై ఉమ్మడి ఏపీలో మూడుసీట్లు గెలవగా అందులో ఒక స్థానంలో తెలంగాణ నుంచి చందుపట్ల జంగారెడ్డి గెలు పొందారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జాతీయ స్థాయిలో ఇందిరతో విభేదించి బయటకు వచ్చిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో బీజేఎస్, ఇతర పార్టీలు కలిపి జనతా పార్టీ ఏర్పడింది. 1978లో ఉమ్మడి ఏపీలో జనతా పార్టీ నాగలిపట్టిన రైతు గుర్తుపై 60 మంది గెలుపొందగా, వారి లో తెలంగాణ నుంచి జంగారెడ్డి ఉన్నారు. ఇక 1980లో బీజేపీ ఏర్పడ్డాక ఇందిరాహత్యానంతరం జరిగిన 1984 లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకుని ఏపీలో టీడీపీ 30 సీట్లు గెలిచింది. ఆ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ రెండే రెండు సీట్లు గెలవగా అందులో ఒకటి హన్మకొండ. ఇక్కడ కమలం గుర్తుపై పోటీ చేసిన జంగారెడ్డి నాటి కేంద్రమంత్రి పీవీ నరసింహారావును ఓడించి చరిత్ర సృష్టించారు. బండి సంజయ్ మార్పుతో.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ఏడాది మార్చిలో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న బండి సంజయ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిసే దాకా పదవిలో కొనసాగుతారని అంతా భావించారు. కానీ కొన్నాళ్లకే సంజయ్ను మారుస్తున్నారంటూ ప్రచారం మొదలై రెండు, మూడు నెలలు కొనసాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డిని నాలుగోసారి (ఉమ్మడి ఏపీలో రెండు సార్లు, ఈ విడత కలుసుకుని తెలంగాణలో రెండోసారి) రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. దీంతో కేడర్లో స్తబ్దత, కొంత అయోమయ వాతావరణం ఏర్పడింది. మోదీ సభలతో నయా జోష్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోగానే ప్రధాని మోదీ ఈ నెల 1న మహబూబ్నగర్, 3న నిజామాబాద్లలో జరిపిన పర్యటన పార్టీలో కొత్త ఉత్సాం నింపిందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు తొమ్మిదేళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రధాని వివరించడం ప్రజల్లో సానుకూలత పెరగడానికి దోహదపడిందని అంటు న్నారు. ఇక షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆదిలాబాద్లో జనగర్జన సభ నిర్వహించారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా, ఎన్నికల ప్రచార గడువు ముగిసే నాటికి పది ఉమ్మడి జిల్లాల పరిధిలో మూడేసి చొప్పున మోదీ, అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ సభల విజయవంతం, వీటిలో ప్రస్తావించే అంశాలు, ఇచ్చే హామీలు పార్టీకి మరింత మేలు చేస్తాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. బీజేపీ విజయం ఇలా.. 1980లో పార్టీ ఏర్పడ్డాక ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 2018లో కేవలం ఒకేఒక్క సీటు టి.రాజాసింగ్ గెలుపొందగా..అంతకుముందు వరుసగా మూడుసార్లు గెలిచిన జి.కిషన్రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎం.రఘునందన్రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందారు. 1983 నుంచి వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరుగుతూ... తగ్గుతూ వచ్చింది. -
డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఖాయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమని, డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుందని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదే రోజు ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయమన్నారు. పరిగి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కుమారుడు, మాజీ డీసీసీబీ చైర్మన్ కమతం శ్రీనివాస్ రెడ్డి, తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్, మాజీ డీసీసీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి, మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన ఇల్లంతకుంట, మానకొండూర్ ఎంపీపీలు, ఇతర నేతలు గాంధీభవన్లో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల అడ్డాగా మార్చారని విమర్శించారు. డీజీపీని తొలగించాలని డిమాండ్ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వేధించిన అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిపై, కాంగ్రెస్ నాయకుల ఫోన్ లపై నిఘా పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకు సాయం చేస్తున్న 75 మంది జాబితాను కేటీఆర్ తయారు చేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఇచ్చారని, కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారని నిందించారు. అర్వింద్ కుమార్, జయేశ్ రంజన్, సోమేశ్ కుమార్ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మోదీ, కిషన్ రెడ్డి, రాజాసింగ్లా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్లో చేరిన గాజర్ల అశోక్ సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ మాజీ నేత గాజర్ల అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఆయన గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా రు. ఉద్యమపంథా వీడి సాధారణ జనజీవనం గడుపుతున్న అశోక్ ప్రజలకు తనవంతు సేవ చేసేందుకు ఏ రాజకీయ పార్టీలో చేరాలన్న దానిపై కొంతకాలంగా సన్నిహితులు, అభిమా నులతో చర్చలు జరుపుతున్నారు. అందరి అభీష్టం మేరకు ఆయన కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. అశోక్ చేరిక అటు ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పరకాల అసెంబ్లీ టికెట్ అశోక్కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
భారీ విజయంతో ఇంగ్లండ్ బోణీ
ధర్మశాల: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ భారీ విజయంతో బోణీకొట్టింది. వన్డే ప్రపంచకప్లో మంగళవారం జరిగిన మ్యాచ్లో బట్లర్ బృందం 137 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ మలాన్ (107 బంతుల్లో 140; 16 ఫోర్లు, 5 సిక్సర్లు) తన కెరీర్లో ఆరో సెంచరీతో చెలరేగాడు. బెయిర్స్టో (59 బంతుల్లో 52; 8 ఫోర్లు)తో తొలి వికెట్కు 115 పరుగులు జోడించిన మలాన్... రెండో వికెట్కు రూట్ (68 బంతుల్లో 82; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మరో 151 పరుగులు జతచేశాడు. కెప్టెన్ బట్లర్ (20), బ్రూక్ (20) రెండంకెల స్కోరు చేశారు. మెహదీ హసన్ 4, షోరిఫుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బంగ్లాదేశ్ 48.2 ఓవర్లలో 227 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ లిటన్ దాస్ (66 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్ (64 బంతుల్లో 51; 4 ఫోర్లు) రాణించారు. టోప్లే 4, వోక్స్ 2 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెయిర్స్టో (బి) షకీబ్ 52; మలాన్ (బి) మెహదీ హసన్ 140; రూట్ (సి) రహీమ్ (బి) షోరిఫుల్ 82; బట్లర్ (బి) షోరిఫుల్ 20, బ్రూక్ (సి) లిటన్దాస్ (బి) మెహదీ హసన్ 20; లివింగ్స్టోన్ (బి) షోరిఫుల్ 0; కరన్ (సి) నజు్మల్ (బి) మెహదీ హసన్ 11; వోక్స్ (సి) మెహదీ హసన్ (బి) అహ్మద్ 14; ఆదిల్ (సి) నజు్మల్ (బి) మెహదీ హసన్ 11; మార్క్ వుడ్ (నాటౌట్) 6; టోప్లే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 364. వికెట్ల పతనం: 1–115, 2–266, 3–296, 4–307, 5–307, 6–327, 7–334, 8–352, 9–362. బౌలింగ్: ముస్తఫిజుర్ 10–0– 70–0, అహ్మద్ 6–0–38–1, షోరిఫుల్ 10–0–75–3, హసన్ 8–0–71– 4, షకీబ్ 10–0–52–1, మిరాజ్ 6–0– 55–0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: లిటన్ దాస్ (సి) బట్లర్ (బి) వోక్స్ 76; తంజిద్ (సి) బెయిర్స్టో (బి) టోప్లే 1; నజు్మల్ (సి) లివింగ్స్టోన్ (బి) టోప్లే 0; షకీబ్ (బి) టోప్లే 1; మిరాజ్ (సి) బట్లర్ (బి) వోక్స్ 8; ముష్ఫికర్ (సి) ఆదిల్ (బి) టోప్లే 51; తౌహిద్ (సి) బట్లర్ (బి) లివింగ్స్టోన్ 39; మెహదీ హసన్ (బి) ఆదిల్ 14; అహ్మద్ (బి) కరన్ 15; షోరిఫుల్ (బి) వుడ్ 12; ముస్తఫిజుర్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 7; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్) 227. వికెట్ల పతనం: 1–14, 2–14, 3–26, 4–49, 5–121, 6–164, 7–189, 8–195, 9–221, 10–227. బౌలింగ్: వోక్స్ 8–0–49–2, టోప్లే 10–1–43–4, సామ్ కరన్ 7.2–0–47–1, వుడ్ 10–0–29–1, ఆదిల్ రషీద్ 10–0–42–1, లివింగ్స్టోన్ 3–0–13–1. -
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
జడ్చర్ల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల మున్సిపాలి టీలోని నాగసాల శివారులో సింగిల్విండో వ్యవసాయ గోదాంను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. నిరంజన్రెడ్డి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ సంస్కరణల ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో గోదాంల నిల్వసామర్థ్యం 70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెంచామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ అధ్యక్షుడు వాల్యానాయక్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్ సుదర్శన్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా భారత సంతతి షణ్ముగరత్నం
సింగపూర్: భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం(66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్ సాంగ్పై ఆయన గెలుపొందారు. దేశంలో 2011 తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. షణ్ముగరత్నంపై ఇద్దరు చైనా సంతతి నాయకులు పోటీకి దిగారు. ఆయన ఏకంగా 70.4 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. తద్వారా సింగపూర్కు తొమ్మిదవ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయ్యింది. ప్రస్తుత అధ్యక్షుడు హలిమా యాకోబ్ పదవీ కాలం సెప్టెంబర్ 13న ముగియనున్నది. అనంతరం థర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. షణ్ముగరత్నం సింగపూర్లో జన్మించారు. 2001లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన పూర్వీకులు తమిళనాడుకు చెందినవారు కావడం విశేషం. ఫాదర్ ఆఫ్ పాథలజీ ఇన్ సింగపూర్గా పేరుగాంచిన కే షణ్ముగరత్నం థర్మన్ తండ్రి. -
ఓటమి భయంతోనే బీజేపీ జమిలి ఆలోచనలు
సాక్షి, హైదరాబాద్: ఓటమి భయంతోనే కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికల ఆలోచనలు చేస్తోందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు తమదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలిచే అవకాశా ల్లేవని పేర్కొన్నారు. డబుల్బెడ్రూమ్ ఇళ్లపంపిణీకి సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జమిలి ఎన్నికలకు సంబంధించి విలే కరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, ఉన్నట్లుండి వేవ్ మార్చితే ఫలితాలు మారతాయని భ్రమ పడుతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడైనా కేసీఆర్ సర్కార్ సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను నియమించిన పార్టీ తమదన్నారు. త్వర లో జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’బిల్లు పెడతారనే ప్రచారం జరుగుతోందన్నారు. దేశంలో మోదీ క్రేజ్ పడిపోయిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే నివేదికలు ఆ పార్టీ వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ రెంటికీ కలిపి ఎన్నికలు పెడితే తమకేమైనా లాభం కలుగుతుందనే యోచనలో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. నిర్ణీత షెడ్యూలు మేరకే ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తాము ఈసీని కోరతామన్నారు. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. -
వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేలా అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలు
సాక్షి, అమరావతి : ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మరో 9 నెలల్లో ముగియనుందని.. అనంతరం జరిగే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుస విజయాన్ని సొంతం చేసుకోనుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీకి రెండోసారి విజయాన్ని కట్టబెట్టేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు. తాడేపల్లిలో గురువారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 మార్చి 15లోగా ఏపీ శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటిస్తారని తెలిపారు. 2019 ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఆరు నెలల ముందు నాటి అధికార టీడీపీ.. ఓటర్ల వ్యక్తిగత వివరాలను తనకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయని, ఆ తర్వాత అవి వాస్తవాలన్న విషయం ప్రజలకు అర్థమైందని తెలిపారు. ఇంటింటికి వెళ్లి సర్వేల పేరుతో వివరాలు సేకరించి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అభిమానుల ఓట్లు తొలగించే కార్యక్రమాలు టీడీపీ చేసిందని, వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీ యావత్తూ ఉద్యమించి.. నాటి టీడీపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు అడ్డుకట్టవేశారని గుర్తు చేశారు.వైఎస్సార్సీపీ ప్రజాహిత విధానాలు, కార్యక్రమాల కారణంగా వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు కూడా అంచనావేస్తున్నారని చెప్పారు. నాలుగున్నరేళ్లుగా నగదు బదిలీ ప్రక్రియ విజయవంతంగా అమలవుతోందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు గరిష్ట స్థాయిలో సంతృప్తి చెందుతున్నారని తెలిపారు. గత ఎన్నికలప్పుడు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసిన కట్టుకథలను కొంతమంది నమ్మి ఉండొచ్చని, కానీ ఇప్పుడు వైఎస్సార్సీపీ శాసన సభ, లోక్సభ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయం సాధిస్తుందనడంపై రాష్ట్రం ప్రజానీకానికి ఎలాంటి అనుమానాలూ లేవన్నారు. వైఎస్సార్సీపీని రెండోసారి గెలిపించి తమ సంక్షేమానికి, ప్రగతికి మార్గం సుగమం చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది జగమెరిగిన సత్యమని విజయసాయిరెడ్డి వివరించారు. -
కమలదళం.. కదన వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల కదనరంగానికి కమలదళం సమాయత్తమైంది. ఒకవైపు పార్టీ సంస్థాగత పటిష్టత, పార్టీ గెలుపుకోసం అంకితభావంతో పనిచేసే నేతల ఎంపిక, వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీల నియామకం.. మరోవైపు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, ప్రజాసమస్యలపై ఉద్యమ కార్యాచరణ.. ఇంకోవైపు నెలాఖరులో విజయ సంకల్ప యాత్రల పేరిట రథయాత్రల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర బీజేపీలో గత సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే 30–35 మంది అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్ధం చేస్తోంది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల్లో నియోజకవర్గాల వారీగా పార్టీకి ఉన్న బలాబలాలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించి.. బలహీనంగా ఉన్న సీ, డీ స్థానాల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. తద్వారా క్షేత్రస్థాయి నుంచి పట్టుపెంచుకోవడానికి, గెలిచే అవకాశాలు ఎక్కువగా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అవకాశం ఏర్పడిందని పార్టీనేతలు చెప్తున్నారు. అదే తరహా వ్యూహాన్ని ఇక్కడా అమలు చేసే యోచన ఉన్నట్టు వివరిస్తున్నారు. నేడు రాష్ట్రానికి 119 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీకున్న 1,200 మంది ఎమ్మెల్యేల్లో 560 మందిని ఎంపికచేశారు. వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 119 మంది వారంపాటు తెలంగాణలో ఒక్కో నియోజకవర్గంలో ఒకరు చొప్పున పర్యటించి పార్టీ బలాబలాలు, స్థానిక పరిస్థితులను పరిశీలించి జాతీయ పార్టీకి నివేదిక ఇస్తారు. వారి పర్యటన ముగియగానే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పోరు యాత్రలను చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. అలంపూర్ జోగులాంబ ఆలయం, భద్రాచలంలోని సీతారామ ఆలయం, బాసరలోని సరస్వతి ఆలయం నుంచి వీటిని ప్రారంభించే అవకాశముంది. ఓవైపు ఈ యాత్రలను కొనసాగిస్తూనే.. పార్టీపరంగా ఎన్నికల వ్యూహాలను, కార్యాచరణను సిద్ధం చేయడం, అమలు కోసం మేనిఫెస్టో, ప్రచార, ఇతర కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కీలకంగా అమిత్షా పర్యటన ఈ నెల 27న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఖమ్మం పర్యటనను పార్టీ నాయకత్వం సవాల్గా తీసుకుంది. ఈ పర్యటన సందర్భంగా కోర్కమిటీ, ముఖ్య నేతలతో అమిత్షా భేటీ అయి ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణకు తుదిరూపు ఇస్తారని.. రాష్ట్ర పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అమిత్షా రాష్ట్ర పర్యటన తర్వాత పార్టీపరంగా కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని అంటున్నాయి. 23 నుంచి మళ్లీ ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా ప్రజా సమస్యలపై ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టిన బీజేపీ.. తిరిగి ఈ నెల 23, 24, 25 తేదీల్లో తదుపరి దశ పోరాటాలను కొనసాగించాలని నిర్ణయించింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు వినతిపత్రాలు సమర్పించనున్నారు. తర్వాత జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఈ ఉద్యమాన్ని చేపడతారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. తొలిదశలో ఆందోళనలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలపై చర్చించారు. 20న మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించారు. -
జనమంతా జగన్ వెంటే...
-
వచ్చే ఎన్నికల్లో YSRCP మళ్లీ గెలిచి తీరుతుంది: ఎంపీ విజయసాయిరెడ్డి
-
Victory Venkatesh: ఇండస్ట్రీలో 37 ఏళ్లు పూర్తి చేసుకున్న వెంకీ మామ, అరుదైన ఫోటోలు
-
వైఎస్ఆర్ సీపీకి 51.3% ఓట్ల శాతం: ఈటీజీ-టైమ్స్ నౌ సర్వే
-
గెలుపు గుర్రాలపై ఫోకస్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేయడమే లక్ష్యంగా మార్గదర్శకాలను సిద్ధం చేయడంపై దృష్టిపెట్టింది. ఈ మేరకు సోమవారం గాందీభవన్లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో బాబా సిద్ధిఖీ, జిగ్నేశ్ మేవానీల సమక్షంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఉత్తమ్కుమార్రెడ్డి, పీఈసీ సభ్యులు బలరాం నాయక్, రోహిత్చౌదరి, మహేశ్కుమార్గౌడ్, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రేమ్సాగర్రావు, అంజన్కుమార్ యాదవ్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, షబ్బీర్అలీ, మన్సూర్ అలీఖాన్, వంశీచంద్రెడ్డి, శివసేనారెడ్డి, సంపత్కుమార్, జగ్గారెడ్డి, రేణుకా చౌదరి, జానారెడ్డి, జీవన్రెడ్డి, అజారుద్దీన్, సీతక్క, సునీతారావు తదితరులు ఇందులో పాల్గొని చర్చించారు. 18 నుంచి దరఖాస్తులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించాలని పీఈసీ సమావేశం నిర్ణయించింది. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు గాందీభవన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే ఈ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు.. పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్లతో సబ్కమిటీ ఏర్పాటు చేశారు. ఇక దరఖాస్తు రుసుము కింద ఓసీల నుంచి రూ.10 వేలు, ఇతర వర్గాల నుంచి రూ.5వేలను డీడీ రూపంలో తీసుకోవాలని సమావేశంలో అభిప్రాయపడినా.. ఓసీలకు రూ.50 వేలు, ఇతరులకు రూ.25 వేలుగా ఫీజును ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫీజు ఎంతన్నది సబ్కమిటీ ఖరారు చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ ముగిశాక సెప్టెంబర్ మొదటివారంలో మరోమారు సమావే శం కావాలని.. మూడో వారానికల్లా తొలి విడత జాబితా సిద్ధం చేయాలని కూడా నిర్ణయించారు. ఆశావహులు దరఖాస్తు చేసుకునే సమయంలోనే.. పార్టీలో అనుభవం, గత నాలుగేళ్లలో చేసిన కార్యక్రమాలను వివరించాలని పేర్కొననున్నట్టు తెలిసింది. బీసీలకు ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో కనీ సం 2 అసెంబ్లీ సీట్లకు తగ్గకుండా కేటాయించాలనే అంశంపైనా చర్చించినట్టు సమాచారం. అనంతరం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ మూడో వారంలో తొలి జాబితా ప్రకటిస్తామని, అభ్యర్థుల ఖరారులో సామాజిక న్యాయాన్ని పాటిస్తామని చెప్పారు. అడిగిన అందరికీ టికెట్లివ్వడం కుదరదు: మహేశ్కుమార్గౌడ్ పీఈసీ సమావేశం అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ మీడియాతో మాట్లాడారు.పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని.. అయితే అందరికీ టికెట్లు ఇవ్వడం కుదరనందున సర్వేలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఒక్క సర్వేలు మాత్రమే ఆధారం కాదని, పీఈసీ అనేక అంశాల్లో వడపోత చేపట్టి అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తుందని వివరించారు. ఆ జాబితాలను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుందని, తర్వాత సీడబ్ల్యూసీ ఆమోదం తీసుకుని టికెట్లను ప్రకటిస్తారని చెప్పారు. రేవంత్ వర్సెస్ పొన్నాల పీఈసీ సమావేశం అనంతరం ఏఐసీసీ గదిలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. వరంగల్ జిల్లా రాజకీయాలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని తాను చాలా కాలం నుంచి కోరుతున్నా.. సమయం ఇవ్వడం లేదని, ఇష్టారాజ్యంగా పార్టీ జిల్లా అధ్యక్షులను నియమిస్తున్నారని పొన్నాల ప్రశ్నించినట్టు సమాచారం.దీంతో వరంగల్లో జరిగిన సమావేశానికి పొన్నాల వచ్చి మాట్లాడి ఉండాల్సిందని రేవంత్ పేర్కొన్నట్టు తెలిసింది. దీనిపై పొన్నాల ఆగ్రహంగా స్పందిస్తూ.. ఎవరు పిలిచారని వరంగల్ మీటింగ్కు రావాలని నిలదీశారని, బీజేపీలోకి వెళ్లాలని చూసిన నాయకులను తీసుకొచ్చి అందలం ఎక్కించారని మండిపడినట్టు సమాచారం. పార్టీలో 45 ఏళ్లుగా పనిచేస్తున్న తమ లాంటి నేతలకు కనీస మర్యాద ఇవ్వకుండా వ్యవహరిస్తే ఎలాగని నిలదీసినట్టు తెలిసింది. ఈ సమయంలో అన్ని విషయాలు తర్వాత మాట్లాడుదామంటూ మాణిక్రావ్ ఠాక్రే సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. తానేమీ అబద్ధం చెప్పడం లేదని, పీసీసీ అధ్యక్షుడి ముందే అన్నీ ప్రస్తావిస్తు న్నానని పొన్నాల గట్టిగా మాట్లాడినట్టు సమాచారం. -
భారత మహిళల ఘన విజయం
బార్సిలోనా: స్పానిష్ హాకీ ఫెడరేషన్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న టోర్నీలో భారత మహిళల జట్టుకు తొలి విజయం దక్కింది. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 3–0 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. భారత్ తరఫున అన్నీ గోల్స్ తానే సాధించిన లాల్రెమ్సియామి ‘హ్యాట్రిక్’ నమోదు చేయడం విశేషం. మ్యాచ్ 13వ, 17వ, 56వ నిమిషాల్లో ఆమె మూడు ఫీల్డ్ గోల్స్ కొట్టింది. మొదటి, రెండో క్వార్టర్లో ఒక్కో గోల్ సాధించిన భారత్ చివరి క్వార్టర్లో మరో గోల్తో ముగించింది. ఈ టోరీ్నలో రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఇంగ్లండ్, స్పెయిన్లతో తొలి రెండు మ్యాచ్లను భారత్ ‘డ్రా’గా ముగించింది. సవితా పూనియా నాయకత్వంలోని మన జట్టు తమ తర్వాతి పోరులో నేడు స్పెయిన్తో తలపడుతుంది. -
అదే జరిగితే CSK గెలిచేదే కాదు..!
-
జగన్...4 ది పీపుల్
-
కర్ణాటక విజయం టి కాంగ్రెస్ లో కొత్త జోష్
-
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన అయిదు హామీలకు ఆకర్షితులైన ఓటర్లు
-
కాంగ్రెస్ విజయం జాతీయ స్థాయిలో ప్రభావం చూపుతుందా ?
-
గంగావతి అసెంబ్లీ సీటునుంచి గెలిచిన గాలి జనార్ధన్ రెడ్డి
-
మోదీ గుజరాత్ బిడ్డయితే.. కన్నడ బిడ్డను నేను
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన ఘనవిజయంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్లో ఉన్నాయి. సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత తనదేనని అన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. శనివారం సాయంత్రం కేపీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమిష్టి నాయకత్వంతోనే కర్ణాటకలో విజయం దక్కింది. కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు. కర్ణాటక గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది. కన్నడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసే బాధ్యత నాది. తొలి కేబినెట్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కర్ణాటక మాదిరిగానే ఇతర స్టేట్స్లోనూ కాంగ్రెస్ను గెలిపిస్తాం అని అన్నారాయన. నేను గుజరాత్ బిడ్డనని మోదీ పదే పదే చెప్తుంటారు. మోదీ గుజరాత్ బిడ్డయితే నేను కన్నడ బిడ్డను.. రైతు బిడ్డను. మోదీ సహా కేంద్రమంత్రులంతా వచ్చి కర్ణాటకలో ప్రచారం చేసినా.. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారని, అందుకు కృతజ్ఞతలని ఖర్గే పేర్కొన్నారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారెంటీ స్కీంపై మా కేబినెట్ తొలి సంతకం చేస్తుంది. దేశాన్ని బీజేపీ అప్పుల పాలు జేసింది. మోదీ పదిసార్లు రోడ్షోలు చేసినా ప్రజలు పట్టించుకోలేదు. కర్ణాటక గెలుపు దేశానికి ఓ సందేశం. 2024 కూడా ఇదే విజయాన్ని సాధిస్తాం. రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కర్ణాటక ప్రజలందరిదీ. కాంగ్రెస్ను గెలిపించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు. ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. రాహుల్ భారత్ జోడో యాత్ర కలిసొచ్చింది. కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ప్రతీఒక్కరికీ ధన్యవాదాలు. డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కర్ణాటకకు పట్టిన గ్రహణం వీడింది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యదే విజయం కాదు. ఇది కర్ణాటక ప్రజల విజయం. రేపు(ఆదివారం) సాయంత్రం సీఎల్పీ సమావేశం ఉంటుంది అని తెలిపారు. Live : ಜಂಟಿ ಮಾಧ್ಯಮಗೋಷ್ಠಿ, ಕೆಪಿಸಿಸಿ ಕಚೇರಿ. https://t.co/vwUf4mQ9RK — Karnataka Congress (@INCKarnataka) May 13, 2023 -
విమర్శకుల నోళ్లు మూయించిన అప్పాజీ
కర్ణాటక ఎన్నికల్లో మంత్రులు సహా కీలక నేతలెందరో ఓటమితో భంగపడ్డ వేళ.. ఆ రేసు గుర్రం విక్టరీని దావణగెరె దక్షిణ నియోజకవర్గం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. వయసైపోయింది.. ఇంకేం పోటీ చేస్తాడు? టికెట్ ఇచ్చినా గెలుస్తాడా? అంటూ విమర్శించిన వాళ్ల నోళ్లు మూయిస్తూ అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని మరీ గ్రాండ్ విక్టరీ సాధించారు 92 ఏళ్ల కాంగ్రెస్ నేత శామనూరు శివశంకరప్ప ఉరఫ్ అప్పాజీ. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం శివశంకరప్పకు కాంగ్రెస్ మరోసారి టికెట్ ఇచ్చినప్పుడు సొంత నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో దీటుగా బదులిచ్చిన శివశంకరప్ప.. ‘‘నేను రేసు గుర్రాన్ని.. అందుకే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. భారీ మెజారిటీతో గెలుస్తా’’ అని శపథం చేశారు. మాటలతోనే కాదు.. ఇప్పుడు ఫలితాల్లో చేతల్లోనూ చూపించారు. దాదాపు 28 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. 👉 శామనూరు శివశంకరప్ప 1994లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. అదే సంవత్సరంలో దావణగెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2004లో మరోసారి దావణగెరె నుంచి పోటీ చేసి గెలుపొందారు. 👉 2008 నుంచి దావణగెరె దక్షిణ నుంచి పోటీ చేస్తున్నారు. 2013, 2018, 2023లో వరుసగా గెలుపొందారు. మొత్తంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 👉 ఈ దఫా ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగి.. హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు. 👉 కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా బరిలోకి దిగి శివశంకరప్ప మరోసారి జయకేతనం ఎగురవేశారు. 👉 దావణగెరె దక్షిణ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 👉 శివశంకరప్పకు 84,298 ఓట్లు రాగా, ఆయన సమీప బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్ కు 56,410 ఓట్లు పడ్డాయి. 👉 ఈ ఎన్నికల్లో శివశంకరప్పకు పోటీగా బీజేపీ అజయ్కుమార్ను నిలబెట్టింది. ఆ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలతో అజయ్కుమార్కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో బీజేపీ విజయం సాధించడం ఖాయమనుకున్నారు. కానీ దావణగెరె నియోజకవర్గ ప్రజలు తమ అప్పాజీకే గెలుపు కట్టబెట్టారు. -
Karnataka: ఖట్టా-మీఠా
చాలా ఏండ్ల తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ సాధించింది ఓ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారు అక్కడి ఓటర్లు. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనబర్చిన ఓటర్లు.. చివరికి మంత్రులను, పలువురు కీలక నేతలను సైతం తమ ఓటు ఆయుధంతో తిరస్కరించారు. ► ఈ లిస్ట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ గురించి. బీజేపీ నుంచి సీటు నిరాకరించడంతో కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పోటీని ఆసక్తికరంగా గమనించాయి రాజకీయవర్గాలు కూడా. అయితే.. హుబ్బళ్లి-ధార్వాడ్- సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ► దేవగౌడ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. దేవేగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ.. రామ నగర స్థానం నుంచి ఓటమి పాలయ్యాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ నెగ్గారు. ► బొమ్మై సర్కారులో మంత్రులుగా చేసిన 13 మంది ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ► వరుణ నుంచి నుంచి సోమన్న ఓటమిపాలుకాగా.. బళ్లారి నుంచి పోటీ చేసిన శ్రీరాములు, చిక్కబళ్లాపూర్ నుంచి పోటీ చేసిన కె. సుధాకర్(హస్య నటుడు బ్రహ్మనందం ఈయన తరపున ప్రచారం చేశారు కూడా), కృష్ణ రాజపేట నుంచి కేసీ నారాయణ గౌడ, నవల్ గుండ్ స్థానం నుంచి పోటీ చేసిన సీసీ పాటిల్, హిరికేరూర్ నుంచి పోటీ చేసిన బీసీ పాటిల్ ఓటమి చెందారు. ► బీజేపీ కీలక నేత, పార్టీ జాతీయ కార్యదర్శి సీటీ రవి చిక్ మంగళూరు నుంచి ఓటమి పాలయ్యాడు. గెలిచిన ప్రముఖులు.. ► షిగ్గావ్ నుంచి పోటీ చేసిన భాజపా నేత, సీఎం బసవరాజ్ బొమ్మై వరుసగా నాలుగోసారీ విజయం సాధించారు. ► వరుణ నుంచి పోటీ చేసి మాజీ సీఎం సిద్ధ రామయ్య విజయం సాధించారు. ► కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపురా నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. డీకేకు లక్షకు పైగా ఓట్లు (70శాతం) రాగా.. భాజపా, జేడీఎస్ అభ్యర్థులకు 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ► జేడీఎస్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కుమారస్వామి చెన్నపట్న నుంచి మరోసారి గెలుపొందారు. ► కుమారస్వామి సోదరుడు హెచ్డీ రేవణ్ణ సైతం విజయం సాధించారు. ► ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చిత్తాపూర్ నుంచి పోటీ చేసి గెలు పొందారు. ఎన్నికల ముందు కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించిన గాలి జనార్దన రెడ్డి గంగావతి స్థానం నుంచి విజయం సాధించారు. ► షెట్టర్ మాదిరే బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన లక్ష్మణ్ సావడి అథని స్థానం విజయం సాధించారు. -
కర్ణాటకలో కాంగ్రెస్ చారిత్రక విజయంపై ప్రియాంక గాంధీ రియాక్షన్..
కాంగ్రెస్కు చారిత్రక విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. గెలుపు కోసం శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందని కొనియాడారు. కర్ణాటక ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పేందుకు ఈ తీర్పు నిదర్శమన్నారు. ఈ ఫలితం దేశాన్ని ఏకం చేసే రాజకీయాలకు దక్కిన విజయమని పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. అలాగే కాంగ్రెస్పై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజలకు తాము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రియాంక స్పష్టం చేశారు. జై కర్ణాటక.. జై కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చారు. कांग्रेस पार्टी को ऐतिहासिक जनादेश देने के लिए कर्नाटका की जनता को तहे दिल से धन्यवाद। ये आपके मुद्दों की जीत है। ये कर्नाटका की प्रगति के विचार को प्राथमिकता देने की जीत है। ये देश को जोड़ने वाली राजनीति की जीत है। कर्नाटका कांग्रेस के तमाम मेहनती कार्यकर्ताओं व नेताओं को मेरी… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 13, 2023 కాంగ్రెస్ విజయంపై రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే స్పందించారు. కర్ణాటకలో విద్వేషానికి తెరపడిందని, ప్రేమకు తెరలేచిందని వ్యాఖ్యానించారు. బలవంతులకు, పేదలకు మధ్య జరిగిన యుద్ధంలో పేదలే గెలిచారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. చదవండి: కాంగ్రెస్ను గెలిపించిన ఆరు మంత్రాలివే.. -
అదిరిపోయిన ఎన్నికల ఫలితాలు.. ఏడ్చేసిన డీకే శివకుమార్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగించడంతో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్కు విజయాన్నందించి తమపై విశ్వాసం ఉంచిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విజయం కోసం శ్రమించిన ప్రతిఒక్కరిని అభినందించారు. కార్యకర్తల కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు. కలసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందే తాను చెప్పానని, అందరం సషష్టిగా కృషి చేయడం వల్లే అద్భుత ఫలితాలు వచ్చాయని డీకే చెప్పారు. సిద్ధరామయ్య సహా విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీలోని ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బీజేపీ తనపై తప్పుడు కేసులు మోపి జైల్లో పెట్టినప్పుడు సోనియా గాంధీ తనను చూసేందుకు వచ్చారని గుర్తు చేసుకుని డీకే ఏమోషనల్ అయ్యారు. తాను ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా జైలుకెళ్లేందుకు సిద్ధపడ్డానని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన గాంధీ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో ఎలాగైనా కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తామని సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు చెప్పామని, ఇప్పుడు ప్రజల తీర్పు తమవైపే ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. #WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party's comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr — ANI (@ANI) May 13, 2023 కాగా.. కనకపుర స్థానం నుంచి వరుసగా నాలుగోసారి గెలుపొందారు డీకే శివకుమార్. సీఎం పగ్గాలు ఆయన చేపడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి ఫలితాల తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? Follow https://t.co/Fg8UHp5DxE for #KarnatakaElection #KarnatakaElectionResults #KarnatakaElections2023 latest updates — Sakshi TV Official (@sakshitvdigital) May 13, 2023 మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీకి 113 స్థానాలు అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ 130 స్థానాలకుపైగా మెజార్టీతో దూసుకుపోతోంది. బీజేపీ కేవలం 65 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ కేవలం 21 స్థానాల్లో ఆదిక్యం కనబరుస్తోంది. చదవండి: కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే.. -
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ విజయం
-
Karnataka assembly election 2023: ‘సార్వత్రిక’ విజయానికి ఈ ఎన్నికలే సింహద్వారం
బెంగళూరు: కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని రాష్ట్రంలో ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ సారథి డీకే శివకుమార్ బల్లగుద్ది చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ► నా 35 ఏళ్ల రాజకీయ అనుభవం, సర్వే ఫలితాలను అనుసరించి చెప్తున్నా.. కన్నడ నాట ఈసారి 141 శాసనసభ స్థానాల్లో విజయఢంకా మోగిస్తాం ► దక్షిణభారతంలో మోదీమేనియా పనిచేయదు. ఇక్కడ స్థానిక, అభివృద్ధి అంశాలే ఎన్నికల్లో కీలకంగా నిలుస్తాయి ► ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల విజయానికి సింహద్వారంగా నిలుస్తుంది ► గెలిచాక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేది సిద్దరామయ్యనా లేక నేనా అనేది అనవసర చర్చ. ఇక్కడ బీజేపీని ఓడించడమే అసలైన లక్ష్యం. ► రాష్ట్రం జ్ఞాన రాజధాని. బీజేపీవారు హిజాబ్, హలాల్ వంటి నాటకాలు ఆడుతున్నారు. కర్ణాటక ప్రజల్లో ఎంతో పరిణతి ఉంది. రాష్ట్రాభివృద్ధికి ఇలాంటివి కొత్త సమస్యలు తెస్తాయని జనం భయపడుతున్నారు ► బీజేపీ అగ్రనేతల మేజిక్ ఇక్కడ పనిచేయదు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్లలో మోదీ ఛరిష్మా పనిచేసిందా? ప్రజల కడుపు నింపితేనే, చక్కని పాలన అందిస్తేనే మీ గురించి జనం ఆలోచిస్తారు. ఈసారి ఇక్కడా జరిగేది అదే. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం
-
పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో YSRCP విజయం
-
ఏలూరులో YSRCP ఘన విజయం
-
శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో YSRCP విజయం
-
మంచి మాట: విజయం ఓటమి తర్వాత వేకువ
ఓటమి ద్వారా వచ్చే విజయం ఉంది! అది ఓటమి నేర్పే పాఠం!! ఓటమి నేర్పే పాఠం ఎంతో ముఖ్యమైంది ఆపై విలువైంది; అది మరేవిధంగానూ రాదు. ఓటమి దెబ్బ బలంగా తగిలినా మనిషి పడిపోకుండా నిలబడి ఆ పాఠాన్ని చదవాలి. ఓటమి నేర్పిన పాఠాన్ని సరిగ్గా చదవగలిగిన మనిషికి భవిష్యత్తులో విజయం అందుతుంది; విజయవంతమైన భవిష్యత్తు అందుతుంది. ఓడిపోయాక శోకిస్తూ ఉండడం సరికాకపోవడమే కాదు హానికరమైంది కూడా. ఓడిపోయాకైనా గెలవాలి అన్న పట్టుదల కలగాలి. ఆ పట్టుదల ఓటమి తరువాతి జీవనంపై పట్టును ఇవ్వాలి. ఓడిపోవడం నేరం కాదు. ఓడిపోయాక తలదించుకోవాల్సిన అగత్యంలేదు. ఓడిపోతే కుంగిపోకూడదు ఓటమికి లొంగిపోకూడదు. ఓడిపోతే వాడిపోకూడదు, వాడిమిని కోల్పోకూడదు. ఓడిపోయాక మనిషి ఎడారిలో ఒంటరివాణ్ణి అయిపోయానని కృశించిపోతూ ఉండిపోకూడదు; ఎందుకూ కొరగాని వాణ్ణి అయిపోయానని నిస్తేజంగా ఉండిపోకూడదు. ఓడిపోతే నిస్ప్పహా ప్రభావానికి మ్రాన్పడి చిల్తై పోకూడదు. ఓడిపోయాక, నిస్పృహ ఆవరించాక నిద్రలోంచి లేచినట్లుగా లేవాలి. ఆపై మెలకువను పొందినట్లుగా సత్స్పృహను పొందాలి. ఓడిపోతే కష్టాలొస్తాయి; ఆ కష్టాలలోనే సత్యాలు తెలుస్తాయి. ఆ సత్యాలు ఎంతో ముఖ్యమైనవి. జీవితం అన్నాక, జీవనం ఉన్నాక ఆశాభంగం తప్పదు. భంగం అయినంత మాత్రాన భాగ్యం భగ్నమైపోదు. ఓడిపోయిన తరువాత నిలదొక్కుకోగలిగిన మనిషి ముందుకు సాగగలడు. కలిగిన ఓటమికి దెబ్బతిన్నాక గెలవడంపై మనిషికి చైతన్యం రావాలి. ఓటమి గురించి చింత, చింతనలను అధిగమించాలంటే మనిషికి గెలవాలి అన్న చైతన్యం కావాలి, రావాలి. ఆ చైతన్యంతో గెలుపును సుసాధ్యం చేసుకోవాలి. ఓటమి కలిగాక దాన్ని అర్థం చేసుకుని అంగీకరించాలి. కలిగిన ఓటమికి మనం సాక్ష్యం మాత్రమే అవ్వాలి. అంతకుమించి మనం ఓటమిలో కూరుకుపోకూడదు. భవిష్యత్తులో విజయంలో విలీనం అవ్వాలంటే కలిగిన ఓటమి నుంచి మనల్ని మనం విడిపించుకోవాలి. విజయం సాధించడం ఎలాంటిదో ఓటమి నుంచి విడివడడం కూడా అలాంటిదే. ప్రపంచంలో విజేతలైనవాళ్లలో ఎక్కువ శాతంమంది ఓటమి నుంచి తమను తాము విడిపించుకున్నవాళ్లే. సూర్యోదయాన్ని పొందుతూ ఉండడం భూమి రోజూ సాధిస్తున్న విజయం. పొంగుతూ, సాగుతూ పారడం నది సాధిస్తున్న విజయం. వీస్తూ ఉండడం గాలికి విజయం. విజయం అనేది ఒక లక్ష్యమా? కాదు. విజయం అనేది లక్షణం. అవును విజయం అనేది మనిషికి లక్ష్యంగా కాదు లక్షణం గా ఉండాలి. ఓటమి చీకటిలా మూగినప్పుడు కాస్తంత ఓపికపడితే విజయం వేకువై వచ్చేస్తుంది. ‘‘వేసవికాలం వెంబడించని చలికాలం లేదు’’ అన్నారు వివేకానంద. ఓటమి అనే చలికి పట్టుబడి గడ్డకట్టుకుపోకుండా ఉండగలగాలి. చలికాలం తరువాత వేసవి వచ్చేస్తుంది. ఓటమి శోకాన్ని కలిగించినా విజయాన్ని సాధించేందుకు కాలం ఉందని, ఉంటుందని తెలుసుకోవాలి. విజయం కోసం ఆశపడితే, ఆకాంక్షిస్తే తప్పకుండా మనిషికి అవకాశాలు ఆసన్నం అవుతాయి. వాటిని సఫలం చేసుకుంటే విజయం వస్తుంది. ఆ విజయానికి చిహ్నంగా మనిషి జీవితం వసంతం అవుతుంది. – రోచిష్మాన్ -
నో డౌట్! రష్యా గెలుపు పక్కా!: పుతిన్
ఉక్రెయిన్పై రష్యా దాడి చేసి సరిగ్గా ఏడాది అవుతున్న తరుణంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పుతిన్ తాము కచ్చితంగా ఉక్రెయిన్పై విజయం సాధిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని ధీమాగా చెప్పారు. అనేక పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ రష్యా దళాలు కచ్చితంగా విజయం సాధిస్తాయని చెప్పారు. లెనిన్గ్రాడ్ ముట్టడిని సోవియట్ దళాలు ఛేదించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరాన్ని పుతిన్ సందర్శించారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ అక్కడ ఒక కర్మాగంలో కార్మికులతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రజల ఐక్యత, సంఘీభావం, యోధుల ధైర్యం, వీరత్వం, సైనిక పరిశ్రమ తదితరాల రీత్యా కచ్చితంగా తమకు గెలుపును తెచ్చిపడతాయని విశ్వాసంగా చెప్పారు. అంతేగాదు పుతిన్ క్షిపణి తయారుదారు అల్మాజ్ ఆంటెలో భాగమైన ప్లాంట్లో ప్రసంగిస్తూ రష్యా రక్షణ పరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవలే ఉక్రెయిన్లో రష్యా టాప్ కమాండర్ని నియమించిన కొద్దిరోజుల్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదీగాక రష్యా ప్రత్యేక 'సైనిక ఆపరేషన్' పేరుతో ఉక్రెయిన్పై దురాక్రమణ దాడికి దిగి సరిగ్గా ఏడాది కావస్తున్న తరుణంలో రష్యాలో ఒకింత భయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే సమర్థింపు చర్యగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ఉక్రెయిన్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. మంత్రితో సహా 16 మంది దుర్మరణం) -
సంకుచిత భావనలొదిలేస్తే సమున్నతంగా ఎదుగుతాం
న్యూఢిల్లీ: గత కాలపు సంకుచిత భావనలను చెరిపేస్తేనే చరిత్రను తిరగరాసే స్థాయికి భారత్ అద్భుత విజయాలను ఒడిసిపట్టుకోగలదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన తొలి ‘వీర్ బాల్ దివస్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గురు గోవింద్ సింగ్ తనయులు జోరావార్ సింగ్, ఫతే సింగ్లకు ఈ సందర్భంగా మోదీ ఘన నివాళులర్పించి ప్రసంగించారు. ‘ సంకుచిత భావన బంధనాలను తెంచుకుని భారత్ అద్భుత ప్రగతి పథంలో దూసుకుపోవాల్సిన తరుణం వచ్చేసింది. ‘గురు గోవింద్ సింగ్ చిన్నారులను మతం మార్చాలని లేదంటే ఖడ్గానికి పనిజెప్తానని ఆనాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హూంకరించడంతో విధిలేక తన ఇద్దరు కుమారులను గురు గోవింద్ బలివ్వక తప్పలేదు. గురు గోవింద్ సింగ్ నమ్మిన సిద్ధాంతం కోసం మేరునగంలా నిలిచారు. ఆ చిన్నారుల సాహసం, త్యాగనిరతిని కీర్తించేటపుడు వయసును లెక్కలోకి తీసుకోవద్దు. భక్త ప్రహ్లాదుడు, ధ్రువుడు, బలరాముడు, లవకుశ, చిన్నికృష్ణుడు అందరూ చిన్నతనంలోనే తమ పరాక్రమాన్ని ప్రదర్శించినవారే’ అని అన్నారు. అభివృద్ధిలో అత్యున్నత శిఖరాలపై నిలపాలి ‘వీర్ బాల్ దివస్ను స్ఫురణకు తెచ్చుకుంటే గత భారతదేశ ఘన చరిత మనకు తెలుస్తుంది. ఇది యువతకు స్ఫూర్తిగా ఉంటూ భవిష్యత్కు దిశా నిర్దేశకంగా నిలుస్తోంది. ‘ ఘన చరిత గల దేశం ఎప్పుడూ ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవంతో ముందడుగు వేయాలి. కానీ కొందరు మన పూర్వ చరిత్రలో పెద్దస్థాయిలోనే ఆత్మన్యూనత భావాలను నింపేశారు. అమృతకాలంలో ఈ బానిసత్వపు ఆలోచనలకు స్వస్తిపలికి దేశాన్ని అభివృద్ధిలో సమున్నత శిఖరాలపై నిలిపేందుకు కృషిచేయాలి’ అని ప్రజలకు మోదీ హితవు పలికారు. ‘ఒంటరిగా పోరాడారే తప్ప మొఘల్స్కు తలవంచలేదు. ఈ అసమాన ధీరత్వమే దేశానికి శతాబ్దాలుగా స్ఫూర్తిగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు. -
బిగ్ క్వశ్చన్ : గుజరాత్ మోడల్ పేపర్
-
ఉత్కంఠ భరిత ఉపపోరులో టీఆర్ఎస్ ఘనవిజయం
-
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ
-
జీవీఎమ్ సీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ ఘన విజయం
-
మాంచెస్టర్ వన్డేలో భారత్ ఘన విజయం
-
ఆత్మకూరు అఖండ విజయంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్..
సాక్షి, తాడేపల్లి: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్కు నివాళిగా 83 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్ని గెలిపించిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుని చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామ రక్ష అంటూ సీఎం జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్కుమార్కు 19,352 ఓట్లు వచ్చాయి. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష! (2/2) — YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2022 -
యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. తాజాగా శాసనమండలి ఎన్నికల్లో సైతం తనదైన ముద్ర వేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత యూపీ శాసనమండలి ఎన్నికల్లోనూ బీజేపీ తిరుగులేని ఆధిక్యత కనబరిచింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. స్వతంత్ర అభ్యర్థి అన్నపూర్ణ సింగ్.. సమీప బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లోని లోకల్ అథారిటీ ఏరియాలోని 36 స్థానాల్లో 33 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ భారీ విజయంతో యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ సొంతమైంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీపై బీజేపీ స్పష్టమైన అధిక్యతను సంపాదించింది. ఈ ఎన్నికల్లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు. 36 యూపీ ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటికే 9 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 27 శాసనమండలి స్థానాల్లో మొత్తం 95 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ గెలుపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విటర్లో స్పందించారు. ‘నేడు.. యూపీ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ భారి విజయం సాధించింది. ఈ భారీ విజయం.. జాతీయవాదం, అభివృద్ధి, సుపరిపాలన గల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యూపీ ప్రజలు ఉన్నారని మరోసారి స్పష్టమైంది’ అని యోగి పేర్కొన్నారు. आज उत्तर प्रदेश के स्थानीय प्राधिकारी विधान परिषद चुनावों में भाजपा की प्रचण्ड विजय ने पुनः स्पष्ट कर दिया है कि आदरणीय प्रधानमंत्री जी के कुशल मार्गदर्शन एवं नेतृत्व में प्रदेश की जनता राष्ट्रवाद, विकास एवं सुशासन के साथ है। — Yogi Adityanath (@myogiadityanath) April 12, 2022 -
యూపీలో బీజేపీ విజయ రహస్యం
దేశ ప్రజల్లో ఉత్కంఠ రేపిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. ఇక పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ 117 సీట్లకు 92 సీట్లు సాధించి, దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించాలనుకున్న సోకాల్డ్ సెక్యులర్ పార్టీలు చతికిల పడ్డాయి. బీజేపీ కూటమి 403 సీట్లకుగానూ 273 సీట్లు సాధించడం ఆషామాషీ విషయం కాదు. అఖిలేష్ యాదవ్ పన్నిన యాదవులు ప్లస్ ముస్లింలు ప్లస్ జాట్లు వ్యూహం వికటించింది. రైతు వ్యతిరేక చట్టాల విషయంలో జాట్ తెగ హిందువులు నరేంద్ర మోదీపై గుర్రుగా ఉన్నా, ఈ దేశ సంస్కృతి సంప్రదాయాల రక్షణ విషయంలో బీజేపీ వైపు నిలబడాలని దృఢ నిశ్చయానికి వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక జాట్లు, కొంతమంది ముస్లింలు బీజేపీ వైపు నిలబడడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలేనని చెప్పాలి. పైగా సంఘ వ్యతిరేక శక్తులను అణచివేయడంలో యోగి దృఢనిశ్చయంతో ఉంటాడని 54 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. సమాజ్వాదీ ముస్లింల పార్టీ కాదు. అయినప్పటికీ దాదాపు 80 శాతం ముస్లిం ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేశారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ పార్టీ చాలా నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం అభ్యర్థులను నిలిపి, హిందూ సమాజంలోని యాదవులను చీల్చి ముస్లిం అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేసింది. ఈ ప్రయోగం బాగా వర్కౌట్ అయింది. అందుకే ఆ పార్టీ తరఫున 31 మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. ముస్లిం ఓటు బీఎస్పీకి, కాంగ్రెస్ పార్టీకి, ఎంఐఎం పార్టీలకు చీలి పోకుండా ముస్లిం మత పెద్దలు చేసిన ప్రయత్నాలు కొంత సఫలమైనట్లే. మొత్తం మీద యూపీలో ప్రజలు యోగీ చేసిన సుపరిపాలనకు, ఆయన అందించిన శాంతి భద్రతలకు ఓటేశారని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. (క్లిక్: ఈ విజయం ప్రతిపక్షాలకు గుణపాఠం) – ఉల్లి బాల రంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
బౌండరీ విజయమిది
న్యూఢిల్లీ: పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలు ఓటేస్తారనడానికి ఈ నాలుగు రాష్ట్రాల ఘన విజయాలే ప్రత్యక్ష నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్లలో బీజేపీ విజయతీరాలకు చేరిన నేపథ్యంలో గురువారం రాత్రి ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశిస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘ప్రగతిశీల ప్రభుత్వాలకు, పేదల పక్షపాత సర్కార్కు ప్రజామోదం ఎప్పుడూ ఉంటుందనడానికి ఈ విజయాలే ప్రబల సాక్ష్యాలు. భారత భవ్య భవిష్యత్కు ఈ గెలుపు భరోసానిస్తోంది. రెండేళ్లలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ ఫలితాలే ప్రతిబింబం. రాజకీయ పండితులు గతంలో విశ్లేషించినట్లు ఉత్తరప్రదేశ్లో 2017లో వచ్చిన ఫలితాలు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పునరావృతమయ్యాయి. అదే రీతిలో ఈరోజు వచ్చిన ఫలితాలు 2024లో పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తాయనడంలో సందేహమే లేదు. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్.. నాలుగు రాష్ట్రాల్లో గెలిచి బీజేపీ విజయ బౌండరీ కొట్టింది. నాలుగు రాష్ట్రాల్లో గెలిపించి కార్యకర్తలు ముందే హోళీ పండగ తీసుకొచ్చా రు. కార్యకర్తలకు అభినందనలు. మణిపూర్, గోవా, యూపీల్లో పార్టీ సాధించిన ఓట్ల శాతం పెరిగింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలకు ఇక ఏదో ఒకరోజున భారత్లో తెరపడనుందని కాంగ్రెస్ పార్టీనుద్దేశిస్తూ అన్నారు. ఈసారి ఎన్నికల్లో తొలిసారి ఓటర్లు, మహిళా ఓటర్లు కీలకపాత్ర పోషించారన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గోవాలో గల్లంతు ‘దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నా కుల, మత, ప్రాంతీయ రాజకీయాలతో ముడిపెట్టి, అవినీతిపరులను కాపాడేందుకు ప్రయ త్నిస్తున్నారు. అలాంటి వారి నోళ్లను ప్రజలు మూయించాలి’ అని విపక్షపార్టీలను విమర్శించారు. ‘మేం ఏ పార్టీకి, ఏ ఒక్క కుటుంబానికీ వ్యతిరేకం కాదు. అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తాం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడమే మాకు ముఖ్యం’ అని అన్నారు. ‘‘కల్లోల ఉక్రెయిన్ నుంచి వేలాది మంది భారతీయ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చాం. ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ‘ఆపరేషన్ గంగా’ ప్రక్రియనూ తప్పుబట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన పంజాబ్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు ఎంతగానో శ్రమించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ గోవాలో ఘన విజయం సొంతం చేసుకున్నాం. సుస్థిర ప్రభుత్వాలకు మళ్లీ ఓటేసి ప్రజలు తమ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరోసారి చాటారు. ఉత్తరప్రదేశ్ దేశానికి ఎంతో మంది ప్రధానమంత్రులను ఢిల్లీకి పంపింది. తొలిసారిగా ఐదేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. 37 ఏళ్ల తర్వాత యూపీలో ఇది సాకారమైంది’ అని మోదీ అన్నారు. -
డబుల్ ఇంజిన్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్తో సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేయడం పట్ల బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నాయి. గురువారం ఫలితాలు వెలువడ్డాక బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద విజయోత్సవాలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలోనూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడడం ఖాయమన్నారు. ‘కేసీఆర్కు కోతలెక్కువ. దేశం మొత్తం తిరిగి టెంట్, ఫ్రంట్ పెడతానన్న కేసీఆర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారానికి ఎందుకు వెళ్లలేదు?’అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘యూపీలో గూండా, మాఫియా రాజ్యాన్ని యోగి సర్కార్ ఖతం చేసింది. తెలంగాణలో కేసీఆర్ పాలనలో మాఫియా రాజ్యమేలు తోంది. అవినీతి పేట్రేగిపోతోంది. సంజయ్ సారథ్యంలో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం’అని చెప్పారు. తెలంగాణలోనూ యూపీ తరహా పాలన కావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ‘ఔర్ ఏక్ దక్కా... తెలంగాణ పక్కా’నినాదంతో ముందుకెళ్తామన్నారు. ఈ ఉత్సవాల్లో సీనియర్ నేతలు ఎన్.ఇంద్రసేనారెడ్డి, స్వామిగౌడ్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. -
మూడు జంటలు.. ముచ్చటైన విజయాలు
పణజి: గోవా శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఐదు జంటలకు మిశ్ర ఫలితాలు వచ్చాయి. మూడు జంటలు విజయాన్ని అందుకోగా, రెండు జంటలు ఓటమిపాలయ్యాయి. బీజేపీ తరపున పోటీ చేసిన రెండు జంటలు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక జంట విజయాన్ని సాధించాయి. ప్రతిష్టాత్మక పణజి నియోజకవర్గం నుంచి 716 ఓట్ల స్వల్ప మెజారిటీతో అటానాసియో మోన్సెరెట్టే గెలిచారు. ఆయన భార్య జెన్నీఫర్.. తలైగావ్ స్థానం నుంచి విజయాన్ని నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి టోనీ ఆల్ఫ్రెడో రోడ్రిగ్స్ పై 2041 ఓట్ల ఆధిక్యంతో జెన్నీఫర్ విజయం సాధించారు. రాణే జంట విన్ బీజేపీ నేత, వైద్యశాఖ మంత్రి విశ్వజిత్ ప్రతాప్సింగ్ రాణే.. వాల్పోయి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన సతీమణి దేవీయ విశ్వజిత్ రాణే.. పోరియం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దేవీయ 13 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం విశేషం. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న దేవీయ మామగారు రంజిత్ జయసింగ్రావు రాణే కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేశారు. అయితే ఆయన ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన విశ్వజిత్ రాణే రెండో స్థానంలో నిలిచారు. లోబో కపుల్స్ విక్టరీ కాంగ్రెస్ అభ్యర్థి మైఖేల్ విన్సెంట్ లోబో.. కలన్గుట్ స్థానం నుంచి గెలుపొందగా, ఆయన భార్య డెలిలా మైఖేల్ లోబో.. సియోలిమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1727 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి దయానంద్ రాయు మాంద్రేకర్ను డెలిలా ఓడించారు. మైఖేల్.. 4979 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి జోసెఫ్ రాబర్ట్ సెక్వేరాపై గెలిచారు. కవ్లేకర్ దంపతుల పరాజయం ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్, ఆయన సతీమణి సావిత్రి కవ్లేకర్ కూడా పోటీలో ఉన్నారు. క్యూపెమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన చంద్రకాంత్ 3 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్టన్ డికోస్టా చేతిలో ఓడిపోయారు. సంగెం అసెంబ్లీ సీటు భంగపడిన సావిత్రి.. ఇండింపెండెంట్గా పోటీ స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?) తృణమూల్ జంట ఓటమి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అల్డోనా నియోజకవర్గం నుండి కిరణ్ కండోల్కర్కు టికెట్ ఇవ్వగా, అతని భార్య కవిత.. థివిమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే వీరిద్దరూ ఓటమిపాలయ్యారు. (క్లిక్: గెలిచినా సంతోషం లేదంటున్న బీజేపీ అభ్యర్థి) -
గుడిలో అరవింద్ కేజ్రీవాల్ సంబరం
-
తృణమూల్ ప్రభంజనం.. 102 మున్సిపాల్టీలు కైవసం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో 10 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. 108 మున్సిపాల్టీలకు గాను ఏకంగా 102 మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది. ప్రతిపక్షాలను చావుదెబ్బ కొట్టింది. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. మొత్తం 2,170 వార్డులకు గాను టీఎంసీ 1,870 వార్డులను దక్కించుకుంది. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీ 63.45 శాతం ఓట్లను సాధించింది. నాలుగు మున్సిపాల్టీల్లో హంగ్ ఏర్పడింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి ఈ ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. నందిగ్రామ్ ఎమ్మెల్యే, బీజేపీ నేత సువేందు అధికారికి కంచుకోట అయిన కాంతీ మున్సిపాల్టీలో టీఎంసీ విజయం సాధించడం గమనార్హం. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన హమ్రో పార్టీ డార్జీలింగ్ మున్సిపాల్టీని దక్కించుకుంది. తాహెర్పూర్ పురపాలక సంఘంలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ జెండా ఎగురవేసింది. బీజేపీ కనీసం ఒక్క మున్సిపాల్టీని కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే మిగిలింది. వారణాసిలో నేడు, రేపు మమతా ప్రచారం ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సాయంత్రం కోల్కతా నుంచి బయలుదేరి వెళ్లారు. ఆమె రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో గురువారం, శుక్రవారం ప్రచారం నిర్వహిస్తారు. -
తొలి టెస్ట్లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా.. భారత్ ఘన విజయం
దక్షిణాఫ్రికా గడ్డపై తొలి సారి టెస్టు సిరీస్ గెలుచుకునే లక్ష్యంతో అడుగు పెట్టిన భారత జట్టు తొలి అడ్డంకిని ఘనంగా అధిగమించింది... సఫారీలకు కోటలాంటి సెంచూరియన్ను బద్దలు కొట్టి సిరీస్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది...చివరి రోజు ఆరు వికెట్లు తీసే క్రమంలో అటు దక్షిణాఫ్రికా బ్యాటర్లతో పాటు ఇటు వర్షంతో కూడా పోటీ పడాల్సిన స్థితిలో బరిలోకి దిగిన టీమిండియా ఎలాంటి ప్రమాదం లేకుండా లాంఛనాన్ని పూర్తి చేసింది. మన పేసర్ల పదునైన బౌలింగ్ ముందు బ్యాటర్లు నిలబడలేకపోగా... మధ్యాహ్నం తర్వాత వాన పడే అవకాశం ఉండగా, అంతకు ముందే కోహ్లి సేన వేగంగా ఆటను ముగించింది. వచ్చే వారం మలి మజిలీ జొహన్నెస్బర్గ్నూ జయిస్తే భారత టెస్టు చరిత్రలో మరో చిరస్మరణీయ ఘనత నమోదవుతుంది. సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 305 పరుగుల లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నంలో 94/4నుంచి చివరి రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది. గురువారం ఆటలో 97 పరుగులే జోడించిన సఫారీ జట్టు మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (156 బంతుల్లో 77; 12 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో 3 వికెట్లు తీయగా...అశ్విన్, సిరాజ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. జనవరి 3 నుంచి జొహన్నెస్బర్గ్లో రెండో టెస్టు జరుగుతుంది. 27.1 ఓవర్లలో... చివరి రోజు ఇద్దరు ప్రధాన బ్యాటర్లు ఎల్గర్, బవుమా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. వీరిద్దరు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ చకచకా పరుగులు సాధించారు. అయితే అది ఎంతో సేపు సాగలేదు. ఎల్గర్ను బుమ్రా వికెట్ల ముందు దొరికించుకోవడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. దూకుడుగా ఆడి బౌలర్లపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించిన డి కాక్ (21)ను సిరాజ్ అవుట్ చేయడంతో జట్టు ఆశలు సన్నగిల్లాయి. తర్వాతి ఓవర్లోనే ముల్డర్ (1) వెనుదిరగడంతో ‘డ్రా’కు ప్రయత్నించే అవకాశం కూడా కనిపించలేదు. లంచ్ సమయానికి స్కోరు 182/7 వద్ద నిలిచింది. ఒక వైపు తెంబా బవుమా (35 నాటౌట్) పోరాడినా... రెండో సెషన్లో దక్షిణాఫ్రికా ఆట ముగించేందుకు రెండు ఓవర్లు సరిపోయాయి. అశ్విన్ వరుస బంతుల్లో చివరి రెండు వికెట్లు తీసి గెలుపు లాంఛనం పూర్తి చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 327, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్:197, భారత్ రెండో ఇన్నింగ్స్: 174, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) షమీ 1; ఎల్గర్ (ఎల్బీ) (బి) బుమ్రా 77; పీటర్సన్ (సి) పంత్ (బి) సిరాజ్ 17; వాన్ డర్ డసెన్ (బి) బుమ్రా 11; కేశవ్ (బి) బుమ్రా 8; బవుమా (నాటౌట్) 35; డి కాక్ (బి) సిరాజ్ 21; ముల్డర్ (సి) పంత్ (బి) షమీ 1; జాన్సెన్ (సి) పంత్ (బి) షమీ 13; రబడ (సి) షమీ (బి) అశ్విన్ 0; ఎన్గిడి (సి) పుజారా (బి) అశ్విన్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (68 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–1, 2–34, 3–74, 4–94, 5–130, 6–161, 7–164, 8–190, 9–191, 10–191. బౌలింగ్: బుమ్రా 19–4–50–3, షమీ 17–3–63–3, సిరాజ్ 18–5–47–2, శార్దుల్ 5–0–11–0, అశ్విన్ 9–2–18–2. -
చరిత్రను మలిచిన ఆ యుద్ధం!
యాభై ఏళ్ల క్రితం తూర్పు పాకిస్తాన్ ప్రజలపై పశ్చిమ పాకిస్తాన్ పాలకుల అణచివేత, భయంకరమైన హింసాకాండ అంతర్యుద్ధ పరిస్థితులను సృష్టించాయి. కోటీ 20 లక్షల మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్కు శరణార్థులై వచ్చారు. ఈ మానవతావాద సంక్షోభ ఫలితంగా ఇరుదేశాల మధ్య యుద్ధం అనివార్యమని తేలి పోయింది. ఊహించినట్లే 1971 డిసెంబర్ 3న భారత్ భూభాగంపై పాక్ దాడి మొదలెట్టగా భారత్ ప్రతిదాడులకు దిగింది. డిసెంబర్ 16న యుద్ధం ముగిసింది. అటు పాక్ దాడినీ, ఇటు అమెరికా సెవెన్త్ ఫ్లీట్ కదలికలను ఎదుర్కొంటూ భారత్ చివరకు అద్భుత విజయం సాధించింది. బంగ్లాదేశ్ ముక్తివాహిని సైన్యానికి చివరివరకు భారత్ దన్నుగా నిలిచింది. అవి బంగ్లాదేశ్ చరిత్రను మలిచిన అపరూప క్షణాలు... మన పొరుగు దేశం పాకిస్తాన్ని రెండుగా చీల్చి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన ఆ గొప్పఘటనకు నేటితో 50 ఏళ్లు. కానీ 1971 యుద్ధంలో భారతీయ నౌకాదళం అత్యంత కీలకపాత్ర పోషించిన ఘట్టాలు 88 సంవత్సరాల అడ్మిరల్ లక్ష్మీనారాయణన్ రామదాస్ (రిటైర్డ్) మనస్సులో ఇప్పటికీ తాజాగానే మెదలాడుతున్నాయి. సంపాదకురాలు, రచయిత్రి మన్రాజ్ గ్రేవల్ శర్మతో ఆయన పంచుకున్న ఆనాటి సంగతులు... 1971 ఏప్రిల్లో నాటి భారత నౌకా దళాధిపతి ఎస్ఎమ్ నందా... మందుగుండుతో సిద్ధంగా ఉంచాలని వెస్టర్న్ ఫ్లీట్కి తెలిపినప్పుడు ముంచుకొస్తున్న ప్రమాదం గురించిన తొలి సంకేతం వెలువడింది. కోటీ 20 లక్షలమంది బెంగాలీ శరణార్థులు సరిహద్దు దాటి భారత్ వచ్చినప్పుడు దేశం మానవాతావాద సంక్షోభాన్ని ఎదుర్కొంది అని ఆనాటికి అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ బీస్ కమాండర్గా ఉన్న రామదాస్ అభిప్రాయపడ్డారు. యుద్ధం తప్ప ఈ సంక్షోభాన్ని మరేదీ పరిష్కరించలేదని వెస్టర్న్ ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ కురువిల్లా ప్రకటించినప్పుడు పాకిస్తాన్తో ఘర్షణ తప్పదనిపించింది. ఆ తర్వాత కొద్దికాలానికే ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర, ఐఎన్ఎస్ బియాస్ యుద్ధ నౌకలు హిందూ మహాసముద్రంలో ఉన్న భారత నేవీ మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎస్ఎస్ విక్రాంత్కు ఉపరితలం నుంచి, గగనతలం నుంచి రక్షణ కల్పిస్తూ దాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాయి. అప్పటినుంచి ఇవి విశాఖపట్నం, పరాదీప్, అండమాన్, మద్రాస్ మధ్య నిత్యం సంచరిస్తూ తామున్న స్థానాన్ని శత్రువు అంచనా వేసుకునే అవకాశాన్ని ఇచ్చినట్లే ఇచ్చి తప్పించుకుంటూ దాగుడుమూతలాడుతూ వచ్చాయి. ఈ దాగుడుమూతల్లో ఒక్క క్షణం కూడా ఏమారని పరిస్థితి ఉండేది. అలాంటి ప్రయణంలో ఐఎన్ఎస్ బియాస్ ప్రధానాయుధమైన ఎఫ్పీఎస్ 5 ఆయుధ నియంత్రణ వ్యవస్థ ఉన్నట్లుండి పనిచేయకుండా నిలిచిపోయింది. అడ్మిరల్ రామ్దాస్కీ ఏం చేయాలో పాలుపోలేదు. దాని విడిభాగాలు బ్రిటన్ నుంచి తెప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడే ఆయన కింది అధికారులు యురేకా అని అరిచేటటువంటి ఆవిష్కరణ చేశారు. దివంగత ఎస్ఎన్ సింగ్, ఎలెక్ట్రికల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ ఆర్వీ సింగ్ పాడైపోయిన సెన్సర్ స్థానంలో గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ పాకెట్లోని జిగినీ కాగితాన్ని చుట్టడం ద్వారా అద్బుత పరిష్కారాన్ని కనుగొన్నారు. మాకెంత సంతోషమేసిందంటే ఆ యుద్ధం పొడవునా, ఆ తర్వాత కూడా ఈ మ్యాజిక్ బ్రహ్మాండంగా పనిచేసింది. 1971 డిసెంబర్ 3న యుద్ధం మొదలైనప్పుడు ఐఎన్ఎస్ బియాస్ అండమాన్లో ఉండేది. మరుసటి దినం ఐఎన్ఎస్ విక్రాంత్ పైలట్లు తమ తొలి గగనతల దాడిని చేపట్టారు. దాంతో తన యుద్ధనౌకను యాక్షన్ స్టేషన్లకు మళ్లించాలని రామ్దాస్ అధికారులను ఆదేశించారు. ఆయన ఊహించినట్లే తూర్పు పాకిస్తాన్ను దిగ్బంధం చేయడంలో ఐఎన్ఎస్ బియాస్ కీలకపాత్రను పోషించింది. కాక్స్ బజార్పై బాంబుదాడులు చేయడం, గన్ బోట్లను అడ్డుకోవడం, విదేశీ వాణిజ్య నౌకల ముసుగులోని పాకిస్తాన్ యుద్ధనౌకలను ఎదుర్కోవడం, జలాంతర్గామి వ్యతిరేక ఆపరేషన్లను నిర్వహించడం ఐఎన్ఎస్ బియాస్ సైనిక చర్యలో కొన్ని ముఖ్య అంశాలు. పాకిస్తాన్కి చెందిన కాక్స్ బజార్ విమానాశ్రయంపై చేసిన బాంబుదాడి గొప్పగా విజయవంతమైంది. యుద్ధానంతరం, ముక్తివాహినిలో చేరిన కొంతమంది నావికులు చిట్టగాంగ్ సమీపంలో ఐఎన్ఎస్ బియాస్లోకి అడుగుపెట్టి ఆ దాడిలో జరిగిన నష్టం గురించి మాట్లాడారు. ఆ సమయంలో నావికులు 24 గంటలూ కళ్లలో వత్తులు వేసుకుని పరిసరాలను గమనిస్తుండేవారు. ఒకరోజు గన్నరీ విభాగ అధికారి, దివంగత లెఫ్టినెంట్ జాన్ డిసిల్వా పెరిస్కోప్ లాంటి ఒక పరికరాన్ని గమనించారు. ఐఎన్ఎస్ బియాస్, ఐఎన్ కమోర్తా యుద్ధనౌకలు వెంటనే జలాంతర్గామి వ్యతిరేక ఆయుధాలతో దానిపై గురిపెట్టాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ సురక్షిత స్థానానికి చేరుకునేంతవరకు ఆ డివైస్ని అవి అడ్డుకున్నాయి. యుద్ధం మొదలైన తొమ్మిదో రోజున విదేశీ వాణిజ్య నౌకల ముసుగులో ఉన్న పాకిస్తానీ వాణిజ్య నౌక అన్వర్ బక్షిని ఐఎన్ఎస్ బియాస్ అడ్డుకుంది. ఆ నౌకను గమనించి, అనుపానులు శోధించేందుకు లెఫ్టినెంట్ కమాండర్ రాజ్ బజాజ్ నేతృత్వంలో కొందరు నావికుల బృందాన్ని నియమించారు. సరిగ్గా ఆ సమయంలోనే పాకిస్తానీ నౌకలో ఒకరు ఆయుధాన్ని తీసుకోవడానికి ప్రయత్నించడం డి లాల్ అనే మన నావికుడి కంటపడింది. వెంటనే లాల్ ఆ వ్యక్తిపైకి గురిపెట్టి కాల్చాడు. దాంతో లాల్కి ‘డేంజర్ లాల్’ అని పేరొచ్చింది. తర్వాత ఆ నౌక డెక్ కింది భాగంలో పలువురు పాకిస్తానీ నావికులు ఉన్నట్లు మన నావికుల బృందం కనుగొంది. వారిని పట్టుకుని కలకత్తా తరలించి స్థానిక అధికారులకు అప్పగించారు. ఆ సమయంలోనే ఐఎన్ఎస్ బియాస్ కోసం మరో సాహస చర్య ఎదురుచూస్తోంది. విమాన వాహక నౌక యుఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్, యూఎస్ సెవెన్త్ ఫ్లీట్కు చెందిన ఇతర విభాగాలు బంగాళాఖాతం వైపు పయనించడం మొదలెట్టాయి. ఆ అమెరికన్ సెవెన్త్ ఫ్లీట్ ప్రయాణాన్ని మందగింపజేయాలని ఐఎన్ఎస్ బియాస్ను ఆదేశించాము. దాంతో అది యుఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ వైపు శరవేగంతో పయనించసాగింది. ఆ సమయంలో మేము రేడియోను ఆపేశాం. రాడార్ని సైలెంటుగా ఉంచాం. కానీ ప్రతిదీ మేం వింటూ వచ్చాం. ఆకాశంలో పైలెట్ల మధ్య మాటల్ని కూడా మేం వినగలిగాం. యుఎస్ వాహకనౌక చాలా శక్తివంతమైనదే అయినప్పటికీ 230మంది నావికులు, 20మంది అధికారులతో కూడిన ఐఎన్ఎస్ బియాస్ ఎంతో స్ఫూర్తిని కలిగి ఉండేది. ఐఎన్ఎస్ బియాస్ తన ప్రయాణ క్రమంలో యుఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ యుద్ధనౌకను సమీపిస్తున్న సమయంలోనే... ఢాకా పతనమైందని, యుద్ధం ముగి సిందని శుభవార్త వచ్చింది. ముంబైలోని కొలాబాలో ఉన్న నా సహచరి లలితది మరొక సాహసగాథ. నాతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఆరునెలలు గడిపారామె. అప్పట్లో మొబైల్స్ లేవు. ఫోన్లు లేవు. ఉత్తరాలు లేవు. తోటి నావికుల భార్యలకు ధైర్యం చెప్పడానికి ప్రతిరోజూ ఆమె వారిని కలిసి వచ్చేవారు. భర్తలు ఎక్కడ ఉన్నారో కూడా తెలీని కాలంలో ఈ మహిళలు ఒకరికొకరు తోడై దృఢంగా నిలిచారు. యాబై ఏళ్ల తర్వాత ఇప్పుడు నేను శాంతికాముకుడినయ్యాను. ‘‘యుద్ధాలు దేన్నీ పరిష్కరించవు. పొరుగుదేశాలతో కలిసి బతకడం ఎలా అనే పనిని మనం మరింత మెరుగ్గా చేస్తే బాగుంటుంది.’’ ప్రారంభం నుంచి ముగింపు దాకా... 1971లో భారత, పాకిస్తాన్ల మధ్య యుద్ధ ఫలితంగా పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ ప్రజా రిపబ్లిక్గా తనను తాను ప్రకటించుకుంది. షేక్ ముజిబుర్ రహమాన్ బంగ్లాదేశ్ తొలి ప్రధాని అయ్యారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం ప్రారంభమై ముగిసేంతవరకు అంటే డిసెంబర్ 3 నుంచి 16 దాకా జరిగిన రోజువారీ ఘటనల వివరాలు... డిసెంబర్ 3: పాక్ వాయుసేన పశ్చిమ రంగంలో భారత వైమానిక కేంద్రాలపై దాడి మొదలెట్టింది. అమృత్సర్, పఠాన్ కోట్, శ్రీనగర్, అవింతిపుర, అంబాలా, సిర్సా, హల్వారా, ఆగ్రాపై ఏకకాలంలో దాడి తలపెట్టింది. డిసెంబర్ 3–6: పశ్చిమ, తూర్పు రంగాల్లో పాక్ వైమానిక స్థావరాలపై దాడి చేయడం ద్వారా భారత వాయుసేన ఎదురుదెబ్బ తీసింది. ఈ సమయంలోనే పాకిస్తాన్ పంజాబ్, జమ్మూకశ్మీర్లో భారత భూతల స్థావరాలపై దాడి మొదలెట్టింది. డిసెంబర్ 4: రాజస్థాన్లోని లోంగెవాలా ప్రాంతంలో యుద్ధం మొదలైంది. జైసల్మేర్ వైపు పురోగమించాలని పాక్ తలపెట్టిన ప్రయత్నాన్ని భారత్ వమ్ము చేసింది. డిసెంబర్ 5: తూర్పుపాకిస్తాన్లోని ఘజియాపూర్లో, పాకిస్తాన్ పంజాబ్కి చెందిన పశ్చిమ రంగంలోని బసంతార్లో యుద్ధం మొదలైంది. అలాగే పంజాబ్ జిల్లా గుర్దాస్పూర్ లోని డేరాబాబా నానక్ ప్రాంతంలో యుద్ధం జరిగింది. డిసెంబర్ 6: భారత్ లాంఛనప్రాయంగా బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. జెస్సోర్ నగరం విముక్తయింది. డిసెంబర్ 7: బంగ్లాదేశ్లోని సిల్హెట్, మౌలోవి బజార్ ప్రాంతంలో యుద్ధం మొదలైంది, డిసెంబర్ 8: పాకిస్తాన్ రేవు పట్టణం కరాచీలో భారత నౌకాదళం దాడులు మొదలెట్టింది. డిసెంబర్ 9: భారత సైన్యం బంగ్లాదేశ్లోని కౌస్టియాలో యుద్ధానికి దిగింది. చాంద్పూర్, దౌడ్కండి విముక్తి పొందాయి. భారత సైనిక దళాలను హెలికాప్టర్ బ్రిడ్జ్ ద్వారా మేఘ్నా నదిని దాటించారు. ఇక ఢాకా పతనం క్షణాలమాటే అయింది. డిసెంబర్ 10: బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ వైమానిక స్థావరంపై భారత వాయుసేన విమానాలు దాడి చేశాయి. డిసెంబర్ 11: బంగ్లాదేశ్లోని పాక్ సైనికులు తిరోగమించకుండా పారాచూట్ బెటాలియన్ని విమానాల ద్వారా తరలించారు. డిసెంబర్ 12–16: భారతసైన్యం మరింతగా పురోగమించి ఢాకాలో అడుగుపెట్టింది. పాకిస్తాన్ ఈస్టర్న్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ లొంగుబాటుపత్రంపై సంతకం చేశారు. భారత ఈస్టర్న్ కమాండర్ జగ్జిత్ సింగ్ అరోరా ముందు లొంగిపోయారు. దీంతో బంగ్లాదేశ్లోని 93 వేలమంది పాకిస్తానీ బలగాలు ఆయుధాలను కిందికి దించేశాయి. (‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
ఉన్నవి నిలుపుకొని.. కొన్ని కలుపుకొని..
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఏ ఒక్క స్థానంలోనూ గెలిచే బలం లేకపోయినా రెండు స్థానాల్లో బరిలోకి దిగి ఆ రెండు స్థానాల్లోనూ తమకు ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించడం గాంధీభవన్ వర్గాల్లో సంతోషాన్ని నింపింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి తమకు పెద్ద సంఖ్యలో ఓట్లు క్రాస్ కావడం, సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో తమ ఓట్ల కంటే 8 ఓట్లు ఎక్కువ రావడం పార్టీ నేతల్లో, కేడర్లో ఇది తప్పనిసరిగా కొత్త జోష్ నింపుతుందనే చర్చ టీపీసీసీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించినా ఉపయోగం లేదని, ఇతర పార్టీలకు అమ్ముడుపోతారనే అపవాదుకు ఈ ఎన్నికలు చెక్ పెట్టాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గీత దాటలేదని అర్థమవుతోందని అంటున్నారు. కాంగ్రెస్కు ఉన్న కేడర్ ఇప్పటికీ పటిష్టంగానే ఉందని, కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు ఆదరణ తగ్గలేదని తెలుస్తోందని పేర్కొంటున్నారు. పట్టుపట్టి.. పంతం నెగ్గించుకుని గెలిచే బలం లేకపోయినా మెదక్ జిల్లా నుంచి జగ్గారెడ్డి, ఖమ్మం నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు పట్టుపట్టి మరీ ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపారు. మెదక్ నుంచి జగ్గారెడ్డి తన సతీమణి నిర్మలను నిలబెట్టగా, ఖమ్మం నుంచి స్థానిక పారిశ్రామికవేత్త రాయల నాగేశ్వరరావు పోటీ చేశారు. అయితే దీనిపై టీపీసీసీ నేతల్లో కొంత ఆందోళన వ్యక్తమయింది. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చావు దెబ్బతిన్న పరిస్థితుల్లో గెలిచే బలం లేదని స్పష్టంగా తెలిసినా పోటీ చేసి ఉన్న ఓట్లు పోగొట్టుకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందనే చర్చ పార్టీలో జరిగింది. కానీ మెదక్, ఖమ్మం నేతలు చేసిన ధైర్యంతో ఇప్పుడు కాంగ్రెస్ కేడర్కు కొత్త ఊపు వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మెదక్లోనూ ఎక్కువ ఓట్లు ఉమ్మడి మెదక్ విషయానికి వస్తే.. పార్టీకి ఉన్న ఓట్లను కాపాడుకునేందుకు అయినా తన భార్యను బరిలోకి దింపుతానని రంగంలోకి దిగిన జగ్గారెడ్డి పార్టీ ఓట్ల కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా తన పార్టీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. దానికి తగినట్లుగానే 8 ఓట్లు ఎక్కువే సాధించడం ద్వారా జిల్లా కాంగ్రెస్ పార్టీని సేఫ్ జోన్లోకి నెట్టారు. ఈ రెండు స్థానాలకు తోడు నల్లగొండలో స్వతంత్రుడిగా పోటీ చేసిన కాంగ్రెస్ జడ్పీటీసీ, మాజీ ఎమ్మెల్యే నగేశ్కు కూడా 200 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. వాస్తవానికి, అక్కడ 380 పైచిలుకు ఓట్లు కాంగ్రెస్కు ఉన్నా కొందరు టీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆ సంఖ్య 230 వరకు వచ్చింది. అయితే నగేశ్కు పార్టీ బీఫారం ఇవ్వలేదు. అయినా దాదాపు అన్ని ఓట్లు ఆయన బాక్సులో పడడం గమనార్హం. ఖమ్మంలో 150 ఓట్లు క్రాస్ ఖమ్మంలో వాస్తవానికి కాంగ్రెస్ బలం 116 మాత్రమే. అందులోనూ 25–30 మంది గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అంటే ఆ పార్టీకి ఉన్న బలం ఎంత కాదన్నా 100లోపే. కానీ బ్యాలెట్ బాక్సులు తెరచి చూస్తే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 242 . అంటే కనీసం 150 ఓట్లు టీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్కు క్రాస్ అయ్యాయన్నమాట. ఇందుకు రెండు కారణాలున్నాయని అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లినా కేడర్ ఉందని, అలాగే వారితో పాటు వెళ్లి టీఆర్ఎస్ గుర్తుపై పోటీ చేసి గెలిచినా స్థానిక ప్రతినిధుల మనుసుల్లో కాంగ్రెస్ పార్టీనే ఉందని అర్థమవుతోందని టీపీసీసీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి తోడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో వ్యక్తమైందని ఆయన చెప్పారు. -
బద్వేల్ లో వైస్సార్సీపీ మెజారిటీ రికార్డు
-
మరో 30 ఏళ్ళు ఏపీకి సీఎంగా జగనే ఉంటారు
-
హుజూరా‘బాద్’షా ఈటలే...
-
సొంత ఇలాకాలో తిరుగులేదని నిరూపించిన ఈటల