breaking news
victory
-
ఐపీఎస్ను వీడి ఎమ్మెల్యేగా.. బిహార్ లో సూపర్ విక్టరీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా సంచలన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తన ప్రత్యర్థిపై 28వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి గెలుపొందారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉన్న ఆనంద్ మిశ్రా ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆనంద్ మిశ్రా తన ఫైర్ బ్రాండ్ ఆపరేషన్స్, బైక్ రైడ్స్ తో సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ పొందారు.మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బక్సర్ నియోజకవర్గం నుంచి 28 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. 1951లో బక్సర్ నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటివరకూ కాంగ్రెస్ అక్కడ 10 సార్లు విజయం సాధించింది. అటువంటి నియోజకవర్గంలో మెుదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసినప్పటిక తన వ్యూహాలతో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కుమార్ తివారీపై 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2024 జనవరిలో రాజకీయ ప్రవేశం చేసిన ఆనంద్ మిశ్రా తొలుత పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరారు. అనంతరం పలు కారణాలతో ఆపార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆనంద్ మిశ్రాకు ఆర్ఎస్ఎస్ నేతలతో మంచి సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన అస్సాంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ నేతలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆనంద్ మిశ్రా నేపథ్యం1981 జూన్ 1న బిహార్ రాష్ట్రంలోని బోజ్పూర్ లో జన్మించారు. 2011లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అస్సాం క్యాడర్ లో విధులు నిర్వహిస్తూ అక్కడ పలు జిల్లాలలు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా సేవలందించారు. అస్సాంలోని లకీంపూర్, దుబ్రీ జిల్లాలలో ఆయన నిర్వహించిన యాంటీ-నార్కోటిక్స్ ఆపరేషన్స్ ఆనంద్ మిశ్రాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. అంతేకాకుండా మేఘాలయ, అస్సాంలలో మిలిటెంట్స్ వ్యతిరేఖ ఆపరేషన్స్ నిర్వహించారు. ఆనంద్ మిశ్రా ప్రత్యేకమైన శైలిలో విధులు నిర్వహిస్తూ జనాలలో మంచి పాపులారిటీ సంపాదించారు. -
జైలులో ఉండి ఎమ్మెల్యేగా విక్టరీ.. బిహార్ లో అసెంబ్లీ రౌడీ సీన్ రిపీట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి సంచలన విజయం సాధించారు. ఇందులో ఆశ్చర్యమెముంది అనుకుంటున్నారా. ఆయన ఎటువంటి ప్రచారం లేకుండా ఎన్నికల సమయంలో జైలులో ఉండి తన ప్రత్యర్థిని మట్టికరిపించారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ అనంతరం హత్యా కేసులో ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జైలులో ఉండడంతో ఆయన సరైన ప్రచారం కూడా నిర్వహించలేదు. అయినప్పటీకీ అనంత్ సింగ్ తన ప్రత్యర్థిపై 28 వేల మెజార్టీతో గెలుపొందారు.జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ మెుకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. నామినేషన్ సైతం దాఖలు చేసి ప్రచారం చేపట్టారు. ఇంతలోనే జన సూరజ్ పార్టీనేత హత్యకు సంబంధించి అనంత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలులో వేశారు. దీంతో అనంత్ సింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది మెుకామా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో రాజకీయ నాయకులు ప్రజలలో ఆయనకున్న ఆదరణను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.జేడీయూ నేత అనంత్ సింగ్ పై దాదాపు 28కిపైగా క్రిమినల్ కేసులున్నాయి. ఆయన ప్రాతినిథ్యం వహించే మెుకామా నియోజకవర్గం బిహార్ రాజధాని పాట్నా జిల్లాలో ఉంటుంది. అక్కడి పొలిటికల్ హీట్ సెంటర్లలో మెుకామా ఒకటి. ఆ నియోజకవర్గంలో అనంత్ సింగ్ చాలా ప్రభావవంతమైన లీడర్ అనంత్ సింగ్ ఇదివరకూ ఐదుసార్లు అక్కడినుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022లో అక్రమ ఆయుధాల కేసులో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవగా తన భార్య మెుకామా నుండి పోటీ చేసి గెలిచింది. -
2026లో దీదీకి షాక్ తప్పదు! బెంగాల్ లో బీహార్ సీన్ రిపీట్ చేస్తాం..
-
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
-
అభివృద్ధి, సంక్షేమానికే పట్టం
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జాతీయ ప్రజా స్వామ్య కూటమి(ఎన్డీయే) మరోసారి విజయ ఢంకా మోగించింది. ఎవరూ ఊహించని విధంగా అఖండ విజయం దక్కించుకుంది. ఈస్థాయి ప్రభంజనాన్ని కూటమి పెద్దలు కూడా అంచనా వేయలేకపోయారు. 243 స్థానాలకు గాను 160 వరకు సీట్లు రావొచ్చని భావించగా, ఏకంగా 200కుపైగా సీట్లను ఎన్డీయే తన ఖాతాలో వేసుకుంది. ఈ అపూర్వమైన గెలుపు వెనుక బహుళ కారణాలు కనిపిస్తున్నాయి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక పరిస్థితులు, పదునైన ఎన్నికల మేనేజ్మెంట్ వంటివి ఎన్డీయేకు కలిసొచ్చాయి. అధికార కూటమి విజయానికి దోహదపడిన కొన్ని కీలక అంశాలు ఏమిటంటే.. మహిళలు–ఈబీసీ సమ్మేళనం ఈ ఎన్నికల్లో మహిళలు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి, ఉత్సాహంగా ఓటు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ జిల్లాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు వేయడం గమనార్హం. వారు ఈ ఎన్నికల్లో ఎన్డీయేకు అండగా నిలిచారు. సరిగ్గా ఎన్నికల ముందు పలు మహిళా సంక్షేమ పథకాలను నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రకటించింది. జీవికా దీదీ పథకం కింద అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ) మహిళలకు కూడా సాయం అందజేసింది. రాష్ట్రంలోని 3.51 కోట్ల మహిళా ఓటర్లలో దాదాపు 40 శాతం మందిని ఇది నేరుగా ప్రభావితం చేసింది. మహిళా సాధికారతపై నితీశ్ కుమార్ చాలా రోజులుగా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ఫలితంగా ఎన్డీయే పట్ల మహిళా ఓటర్లు ఆకర్శితులయ్యారు. వారి ఆదరణ ఓట్ల రూపంలో బీజేపీ కూటమికి బదిలీ అయ్యింది. కులాల సమీకరణాలు వేర్వేరు కులాలను తమకు అనుకూలంగా ఒక్కతాటిపైకి తీసుకురావడంలో ఎన్డీయే సఫలమైంది. అగ్రవర్ణాల ఓటర్లు సంప్రదాయకంగా బీజేపీ వెన్నంటే నిలుస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఆ ఆనవాయితీ యథాతథంగా కొనసాగింది. మరోవైపు ఓబీసీలు, ఈబీసీలతోపాటు దళితుల్లో గణనీయమైన ఓ వర్గం ఎన్డీయేకు మద్దతు పలకడం విశేషం. కులాల లెక్కలపై విపక్ష మహాగఠ్బంధన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. భిన్న సామాజిక వర్గాలు ఎన్డీయే వెనుక సంఘటితమయ్యాయి. అధికార కూటమినే వారు మరోసారి విశ్వసించారు. విపక్షాల్లో చీలికలు బీజేపీ కూటమిలో స్పష్టమైన ఐక్యమత్యం కనిపించగా, కాంగ్రెస్–ఆర్జేడీ కూటమిలో చీలికలు బహిర్గతమయ్యాయి. చివరి నిమిషం వరకు సీట్ల పంపకం సక్రమంగా జరగలేదు. కొన్నిచోట్ల స్నేహపూర్వక పోటీలు తప్పలేదు. పొత్తు ధర్మాన్ని విస్మరించి, కూటమి పారీ్టలే పరస్పరం పోటీకి దిగాయి. మరోవైపు ఓట్ల బదిలీ సైతం జరగలేదు. తేజస్వీ యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యరి్థగా ప్రకటించడం కూటమిలో కొందరికి నచ్చలేదు. ప్రతిపక్షానికి ఒక ఉమ్మడి వ్యూహం లోపించింది. ఎవరికి వారే అన్నట్లుగా ప్రవర్తించారు. మహాగఠ్బంధన్ను బలహీన కూటమిగా ప్రజలు భావించారు. దాంతో ఎన్డీయేకు ఎదురే లేకుండాపోయింది. మొత్తానికి ప్రతిపక్షం స్వీయ తప్పిదాలతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చీలిన ముస్లిం ఓట్లుకాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి ప్రధాన బలం ముస్లిం–యాదవ్ ఓట్లే. కానీ, ఈసారి ముస్లింలు, యాదవులు ఆ కూటమిని అంతగా ఆదరించలేదు. ఈ రెండు వర్గాలను అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్ష కూటమి విఫలమైంది. ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థులు బరిలో ఉండడం మహాగఠ్బంధన్ విజయావకాశాలను దెబ్బకొట్టింది. ముస్లింల ఓట్లు భారీగా చీలిపోయాయి. రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) బలమైన యాదవుల్లోనూ చీలికలు కనిపించాయి. యాదవుల్లో ఓ వర్గం ఎన్డీయేకు అండగా నిలిచింది. గెలిస్తే ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ ఆర్జేడీ చేసిన ప్రచారాన్ని జనం నమ్మలేదు. ఎన్నికల మేనేజ్మెంట్ చురుకైన ఎన్నికల మేనేజ్మెంట్ ఎన్డీయేకు బలంగా మారింది. 2020 నాటి ఎన్నికల్లో చోటుచేసుకున్న చిన్నచిన్న పొరపాట్లను ఆ కూటమి సరిచేసుకుంది. ఈసారి కూటమి పక్షాల మధ్య సమన్వయం బాగా పెరిగింది. వాటి మధ్య చక్కటి సహకారం కనిపించింది. బూత్–స్థాయి మేనేజ్మెంట్ బాగా పనిచేసింది. ఎన్నికల ప్రచారంలో కూటమి పారీ్టలన్నీ కలిసికట్టుగా పాల్గొన్నాయి. అంతర్గతంగా అక్కడక్కడా అభిప్రాయభేదాలున్నా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాయి. బీజేపీ, జేడీ(యూ), లోక్ జనశక్తి పార్టీ, హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేశారు. వారంతా నిత్యం ప్రజల్లో ఉండడం, ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించడం ఎన్డీయే విజయ తీరాలకు చేర్చింది. కొంపముంచిన ‘జంగిల్రాజ్’ జంగిల్రాజ్ అనగానే గుర్తొచ్చే పేరు బిహార్. ఆర్జేడీ హయాంలో ఆటవిక పాలన కొనసాగిందని, ప్రతిపక్షానికి ఓటేస్తే ఆనాటి రాక్షస రాజ్యం మళ్లీ వస్తుందని ఎన్డీయే నేతలు పదేపదే హెచ్చరించారు. జంగిల్రాజ్ రోజులను జనం ఇప్పటికీ మర్చిపోలేదు. మహాగఠ్బంధన్కు ఓటేస్తే జరిగేదేమిటో ఊహించుకొని మరోసారి ఎన్డీయేకు పట్టం కట్టారు. అభివృద్ధి కావాలి తప్ప ఆటవిక రాజ్యం వద్దని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అవినీతిపరుడు కాకపోయినప్పటికీ అవకాశవాది అనే ముద్ర ఉంది. అధికారం కోసం సులువుగా కూటములు మార్చేస్తారన్న విమర్శలున్నాయి. అయినా సరే ఓటర్లు ఆయన పరిపాలనను ఆదరించారు. నితీశ్ నాయకత్వం, పాలనా సామర్థ్యం కూడా ఎన్డీయేకు అనుకూలంగా మారింది. ఉచిత విద్యుత్.. మధ్యతరగతికి భరోసా రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత పథకాన్ని ఎన్నికల ముందే అమలు చేయడం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుంది. సుమారు 5 కోట్ల మంది ఓటర్లు ఈ పథకంతో లబ్ధి పొందారు. అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామంటూ విపక్ష కూటమి హామీ ఇచి్చనా, ’ఇప్పటికే వస్తున్న’ప్రయోజనం ముందు ఆ హామీ నిలవలేకపోయింది. వృద్ధులు, ఆశ్రితులకు ఆదరణ సామాజిక భద్రతా పెన్షన్ను రూ.400 నుంచి ఏకంగా రూ.1100కి పెంచడం 1.11 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నేరుగా ప్రయోజనం చేకూర్చింది. ఇది వారి కుటుంబాల్లో ఎన్డీయే పట్ల బలమైన సానుకూలతను నింపింది. యువత, విద్యార్థుల మద్దతు నిరుద్యోగ భృతి(7.6 లక్షల మందికి), స్టూడెంట్ క్రెడిట్ కార్డ్పై వడ్డీ మాఫీ (4 లక్షల మందికి) పథకాలు యువతను, విద్యార్థులను ఎన్డీయే వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించాయి. సోషల్ ఇంజనీరింగ్ సూపర్ హిట్ గత ఎన్నికల్లో దూరమైన చిరాగ్ పాశ్వాన్, ఉపేంద్ర కుశ్వాహాలను తిరిగి కూటమిలోకి తీసుకురావడం నితీశ్–బీజేపీల రాజకీయ వ్యూహానికి పరాకాష్ట. వీరితోపాటు జీతన్ రామ్ మాంఝీని నిలబెట్టుకోవడం ద్వారా దళిత, అత్యంత వెనుకబడిన, కుశ్వాహా ఓట్లను ఎన్డీయే గంపగుత్తగా సాధించింది. ఈ ముగ్గురూ తమ వర్గాల ఓట్లను ఎన్డీయేకు బదిలీ చేయడంలో సంపూర్ణంగా విజయం సాధించారు. అభివృద్ధి, హిందుత్వ ఒకవైపు పూరి్ణయా విమానాశ్రయం, బెగుసరాయ్ వంతెన వంటి అభివృద్ధి పనులను చూపిస్తూనే, మరోవైపు సీతామఢిలో జానకీ ఆలయ(సీతాదేవి) నిర్మాణానికి అమిత్ షా, నితీశ్ కుమార్లు భూమి పూజ చేయడంతో హిందుత్వ ఓటు బ్యాంకు కూడా బీజేపీని బలపర్చింది. ప్రచారంలో మోదీ స్వయంగా రంగంలోకి దిగడం ఎన్డీయేకు కొండంత బలాన్నిచి్చంది. 16 రోజుల్లో 14 కీలక జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. -
ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)
-
బిహార్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ.. ప్రధాని మోదీ ట్వీట్
ఢిల్లీ: బిహార్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఎన్డీఏ విజయభేరి మోగించింది. బిహార్లో ఎన్డీయే విజయం అపూర్వం, చరిత్రాత్మకం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. విజయంతో ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘‘ప్రతిపక్షాల అబద్దాలను మా కార్యకర్తలు తిప్పికొట్టారు. బిహార్ అభివృద్ధి, సాంస్కృతికగుర్తింపునకు కృషి చేస్తాం. బిహార్ తీర్పు నూతన సంకల్పంతో పనిచేయడానికి శక్తినిచ్చింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.బిహార్లో ఎన్డీఏ సునామీ సృష్టించడంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయోత్సవ సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం. రికార్డు స్థాయిలో ఓటింగ్లో పాల్గొని ఏన్డీఏకు అద్భుత విజయం అందించారు. బిహార్ ప్రజలు అన్ని రికార్డులు బద్దలుకొట్టారు. జంగిల్ రాజ్లో ఏం జరిగిందో అందరికి తెలుసు. జంగిల్రాజ్లో దోపిడీ, అక్రమాలు, హింస ప్రజలు అనుభవమే. ఈ విజయంతో ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది’’ అని ప్రధాని మోదీ చెప్పారు. Good governance has won. Development has won. Pro-people spirit has won. Social justice has won. Gratitude to each and every person of Bihar for blessing the NDA with a historical and unparalleled victory in the 2025 Vidhan Sabha elections. This mandate gives us renewed…— Narendra Modi (@narendramodi) November 14, 2025 -
200 మార్క్ దాటిన NDA సునామీలో కొట్టుకుపోయిన కాంగ్రెస్
-
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం.. నవీన్ యాదవ్ రియాక్షన్
-
గెలుపుపై నవీన్ యాదవ్ ఫస్ట్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. గెలుపుపై నవీన్ యాదవ్ స్పందిస్తూ.. తన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. ‘‘నా కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేసింది. పదేళ్లలో చేసింది ఏమిలేక...ఏం చెప్పుకోలేక మాపై ఆరోపణలు చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.‘‘నేను కక్షపూరిత రాజకీయాలు చేయను. అధిక నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్ని మరింత అభివృద్ధి చేస్తా. అభివృద్ధే నా అజెండా. జూబ్లీహిల్స్ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం’’ అంటూ నవీన్యాదవ్ చెప్పుకొచ్చారు. నన్ను నా కుటుంబం, వ్యక్తిత్వంపై దెబ్బతిస్తూ ఓట్లు ఆడిగారు. అందుకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారు. రిగ్గింగ్,దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలు. అధిక బడ్జెట్తో జూబ్లీహిల్స్ని మరింత అభివృద్ధి చేస్తానని నవీన్ యాదవ్ అన్నారు. -
బిహార్ లో NDA దిమ్మతిరిగే స్ట్రైక్ రేట్
-
రికార్డు సృష్టించనున్న నితీష్ కుమార్..10సారి ముఖ్యమంత్రిగా?
ఈ రోజుల్లో రాజకీయాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కష్టపడడంతోపాటు అదృష్టం సైతం కలిసిరావాలి. అందుకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడానికే నేతలు ఎంతగానో శ్రమించాల్సి వస్తోంది. అలాంటిది ఒక ప్రభుత్వ అధినేతగా పదిసార్లు ప్రమాణ స్వీకారం చేయడమంటే ఎంత కష్టమైన వ్యవహారమో ఆలోచించండి. బిహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి గెలిస్తే నితిష్ కుమార్ సీఎం పదవి చేపట్టే అవకాశం ఉంది ఇదే జరిగితే ఏకంగా పదవసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తిగా నితిష్ రికార్డు సృష్టించనున్నారు. నితీష్ కుమార్ ఈ పేరు వింటే చాలు రాజకీయ ఎత్తుగడలకు, సంకీర్ణ ప్రభుత్వాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. తన పదవి కాపాడుకోవడం కోసం ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా నితీష్ సై అంటారు. 2015లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పొత్తుతో అధికారంలోకి వచ్చి సీఎం పదవి చేపట్టిన నితీష్ కుమార్ కొద్దికాలానికే ఉప ముఖ్యమంత్రి తేజస్వీపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ కూటమిని వీడి తిరిగి ఎన్డీఏతో జతకట్టారు. 2022లో ఎన్డీఏకు కటీఫ్ చెప్పిన నితిష్ తిరిగి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కొద్ది కాలం మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఆయన ఆ కూటమిలో పొసగక తిరిగి కాషాయ దళంతో దోస్తీ చేశారు. తాజాగా ఎన్డీఏతో మరోసారి జతకట్టి బిహార్ లో మరోసారి అధికారం సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు.2000 సంవత్సరంలో తొలిసారి ముఖమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ ప్రభుత్వ అస్థిరతతో 7 రోజులకే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 2005లో తిరిగి సీఎంగా పదవి చేపట్టిన ఆయన 2014లో ఎన్డీఏ కూటమితో విభేదాల కారణంగా పదవి కోల్పోయారు. ఆకాలం మినహా 2005 నుంచి నేటి వరకూ ఆయనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. బిహార్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మరోసారి ముఖ్యమంత్రిగా నితిష్ కుమార్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఒక రాష్ట్ర మఖ్యమంత్రిగా పది సార్లు ప్రమాణం స్వీకారం చేసిన వ్యక్తిగా నితిష్ కుమార్ రికార్డులెక్కుతారు. -
అమిత్ షా చెప్పిందే జరిగింది..
-
సంబరాల్లో కాంగ్రెస్ నేతలు.. స్టెప్పులేసిన వీహెచ్
-
బీహార్ కా షేర్
-
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
-
నెహ్రూను గుర్తు చేసుకున్న మమ్దానీ
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రాట్ సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య న్యూయార్క్ వాసులకు జోహ్రాన్ మమ్దానీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో న్యూయార్క్ నగరానికి ఎన్నికైన అని పిన్నవయస్కుడైన మేయర్గా మమ్దానీ గుర్తింపు పొందారు. అలాగే తొలి ఇండియన్-అమెరికన్ ముస్లిం మేయర్గానూ పేరొందారు.ఈ సందర్భంగా మమ్దానీ మాట్లాడుతూ ‘న్యూయార్క్ కొత్త తరానికి ధన్యవాదాలు. మేము మీ కోసం పోరాడుతాం. ఎందుకంటే మేము మీలాంటివాళ్లమే.. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. స్నేహితులారా.. మేము ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చివేసాం’ అని పేర్కొన్నారు. 30 నిమిషాల కన్నా తక్కువగా సాగిన ఈ ప్రసంగంలో ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నేరుగా ఉద్దేశించి, ‘డోనాల్డ్ ట్రంప్.. మీరు దీనిని చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పేందుకు నా దగ్గర నాలుగు మాటలు ఉన్నాయి.. వాల్యూమ్ పెంచండి’ అని అన్నారు. మాలో ఎవరినైనా సంప్రదించాలంటే, మీరు మా అందరినీ దాటాలి. మీకు జన్మనిచ్చిన నగరంలో మీరు ఓటమి పాలయ్యారు’ అని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి ఆండ్రూ క్యూమోను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంలో ఉత్తమంగా ఉండాలని సూచించారు.న్యూయార్కర్లకు మమ్దానీ కృతజ్ఞతలు చెబుతూ వారు మార్పు కోసం, కొత్త రాజకీయాల కోసం ఆదేశించారని అన్నారు. 2025, జనవరి ఒకటిన తాను న్యూయార్క్ నగర మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తానని మమ్దానీ ప్రకటించారు. న్యూయార్క్ ..వలసదారుల నగరంగానే ఉంటుంది. ఇది వలసదారులచే నిర్మితమైన నగరం.ఈ రాత్రి నుండి ఇది వలసదారుడి నేతృత్వంలో ఉంటుందని మమ్దానీ అన్నారు.భారత సంతతికి చెందిన మమ్దానీ తన విజయ ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మనం పాత నుండి కొత్త వైపు అడుగు పెట్టే క్షణం చాలా అరుదుగా వస్తుంది. ఒక యుగం ముగిసినప్పుడు.. చాలా కాలంగా అణచివేతకు గురైన ఒక దేశ ఆత్మ ఉవ్వెత్తున ఎగసిపడే క్షణం వస్తుంది’ అని ఆయన అన్నారు. తన విజయం న్యూయార్క్ వాసులందరికీ అంకితం అని ఆయన అన్నారు. వలసదారుల నేతగా పేరొందిన మమ్దానీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్నికల ప్రచారంలో మమ్దానీ పలు హామీలు ఇస్తూ, ఓటర్లను ఆకట్టుకున్నాడు. వీటిని ప్రముఖ హిందీ సినిమాల క్లిప్లతో అన్వయిస్తూ, పొందుపరిచిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. 🚨Breaking News — Zoharan Mamdani creates History, the son of Immigrants, becomes the first Indian Muslim American to win NY Mayor Race. Here’s one video how he captured the imagination of a diverse New York. pic.twitter.com/a00nzdLVEI— Rohit Sharma 🇺🇸🇮🇳 (@DcWalaDesi) November 5, 2025ఇది కూడా చదవండి: Virginia: నూతన ఎల్జీ గజాలా హష్మీ.. మన హైదరాబాదీ! -
ఫైనల్ కు చేరిన భారత్
-
తొలి మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ విజయం
-
పాక్ కు చెంపదెబ్బ.. ట్రోఫీ నిరాకరించిన భారత్
-
ఆసియా కప్ భారత్దే... ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో విజయకేతనం
-
ఫైనల్ లో పాక్ ను చీల్చి చెండాడిన భారత్
-
ఆసియా కప్ లో ఫైనల్ కు టీమిండియా
-
మళ్లీ పాక్ వక్ర బుద్ధి: యుద్ధంలో ఓడినా.. పాఠ్య పుస్తకాల్లో గెలుపు పాఠాలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. 2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న నాలుగు రోజుల సైనిక ఘర్షణల దరిమిలా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే పాక్ ప్రభుత్వం దీనికి భిన్నంగా, తమ దేశ పాఠశాల పాఠ్యపుస్తకాలలో ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఘనవిజయం సాధించిందని చెబుతూ, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసింది.పాకిస్తాన్ కొత్తగా రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో ‘భారత్ 2025 మే 6న పాకిస్తాన్పై అనూహ్యంగా యుద్ధం ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ సైన్యం తెలివిగా స్పందించి, భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపై భారత్ శాంతికి మొగ్గుచూపుతూ యుద్ధాన్ని ఆపేలా చేసుకుంది” అని పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో ‘ఆపరేషన్ బునియాన్ ఉల్ మర్సూస్’ అనే పేరుతో, పాకిస్తాన్ 26 భారత ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా, పాకిస్తాన్ సైన్యం నేతృత్వం వహించిన ఆపరేషన్ విజయం సాధించడంతో, ఆర్మీ చీఫ్కు ఫీల్డ్ మార్షల్ బిరుదు అందించినట్లు కూడా దానిలో రాశారు.కాగా పాక్ విషప్రచారంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వతంత్ర మీడియా, విశ్లేషకులు, భారత ప్రభుత్వ వర్గాలు దీనిని చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా తప్పుబడుతున్నాయి. ‘వాస్తవాలను వక్రీకరిస్తూ, జాతీయ గౌరవం పేరుతో పిల్లలకు తప్పుడు చరిత్రను నేర్పడం ప్రమాదకరం’ అని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం, భద్రతా సంస్థలు ఈ యుద్ధంలో పాక్ సైనిక స్థావరాలపై విస్తృతమైన దాడులు చేపట్టినట్లు ప్రకటించాయి. ఉపగ్రహ చిత్రాలు, స్వతంత్ర మీడియా రిపోర్టుల ప్రకారం పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు తీవ్రంగా నష్టపోయినట్లు స్పష్టమయ్యింది. పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో ఈ విధంగా వక్రీకరించిన చరిత్ర.. విద్యార్థుల మనోభావాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
-
నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్... ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిపై ఘన విజయం
-
ఇది ప్రజలిచ్చిన తీర్పు కాదు.. కూటమి ఇచ్చుకున్న రిగ్గింగ్ తీర్పు
-
Big Question: కలెక్టర్ ముందే దొంగ ఓట్లు.. గుద్దేశాం.. గెలిచేశాం
-
KSR Live Show: ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని తలలు పగిలినా.. ఎగిరేది YSRCP జెండానే..!
-
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో YSRCP ఘన విజయం
-
భారత మహిళలదే వన్డే క్రికెట్ సిరీస్
-
బర్మింగ్హామ్ రెండో టెస్టులో భారత్ ఘనవిజయం
-
ప్రియాంకకు హైకోర్టు సమన్లు
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చిక్కుల్లో పడ్డారు. 2024 నవంబర్లో కేరళలోని వయనాడ్ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ, బీజేపీ మహిళా నేత నవ్య హరిదాస్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన హైకోర్టు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు సమన్లు జారీ చేసింది.గత వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ విజయాన్ని సవాలు చేస్తూ, నాటి పోల్ రద్దు కోరుతూ నవ్య హరిదాస్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియాంకా గాంధీ ఎన్నికల అఫిడవిట్లో తన, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను దాచిపెట్టారని ఆమె ఆరోపించారు. వయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె విజయం చెల్లదని ప్రకటించాలని నవ్య కోరారు.న్యాయవాది అయిన నవ్య హరిదాస్ సమర్పించిన పిటిషన్పై కేరళ హైకోర్టు న్యాయమూర్తి కె బాబు విచారించారు. ప్రియాంక రిటర్నింగ్ అధికారి ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో రాబర్ట్ వాద్రాకు సంబంధించిన పెట్టుబడులు, చరాస్తుల వివరాలను దాచిపెట్టారని నవ్య ఆరోపించారు. వయనాడ్ స్థానంలో విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ స్థానాన్ని వదులుకోవడంతో 2024, నవంబర్ 13న వయనాడ్కు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ స్థానం నుంచి పోటీకి దిగిన ప్రియాంక గాంధీ వాద్రా 4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమె తన సమీ ప్రత్యర్థి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి చెందిన సత్యన్ మోకేరిని ఓడించారు. నాడు వయనాడ్లో కాంగ్రెస్, సీపీఐ, బీజేపీల మధ్య త్రిముఖపోరు జరిగింది. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్ పరారైందిలా.. -
RCB Vs PBKS: ఈ సాలా కప్ నమ్దు.. 18 ఏళ్ల కల.. ఏడ్చేసిన కోహ్లి
-
ఐపీఎల్ 2025 విజేత RCB.. 18 ఏళ్ల కల
-
క్వాలిఫయర్-2లో ముంబైపై పంజాబ్ ఘనవిజయం
-
గుజరాత్ పై 20 రన్స్ తేడాతో గెలిచిన ముంబై
-
ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB
-
కోల్ కతాపై హైదరాబాద్ ఘనవిజయం
-
బెంగళూరుపై హైదరాబాద్ విజయం
-
చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం
-
హైదరాబాద్ ను చిత్తు చిత్తుగా ఓడించిన గుజరాత్
-
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఘన విజయం
-
ఐపీఎల్ లో చెన్నైపై పంజాబ్ కింగ్స్ విజయం
-
ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం
-
IPLలో వరుసగా 4 విజయం సొంతం చేసుకున్న ముంబై
-
ముంబై దూకుడు.. చెన్నైకు మరో ఓటమి
-
2 పరుగుల తేడాతో గెలుపొందిన లక్నో సూపర్ జెయింట్స్
-
హైదరాబాద్ పై 4 వికెట్ల తేడాతో ముంబై గెలుపు
-
రాజస్థాన్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
-
కోల్ కతాపై పంజాబ్ ఘన విజయం
-
చెన్నైపై కోల్ కతా భారీ విజయం
-
RCBపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు
-
చెన్నైపై పంజాబ్ ఘన విజయం
-
పంజాబ్ పై రాజస్థాన్ ఘన విజయం
-
వరుసగా రెండో విజయాన్ని దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్
-
లక్నోపై పంజాబ్ గెలుపు
-
Gunshot: దెబ్బ అదుర్స్ కదూ.. కనుమరుగైన టీడీపీ
-
ఫ్యాన్ సత్తా.. కూటమి చిత్తు
-
చెన్నైపై సత్తా చాటిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
-
Big Question: ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని YSRCP విజయకేతనం
-
కూటమి ప్రభుత్వానికి చావుదెబ్బ.. 32 చోట్ల YSRCP విజయకేతనం
-
ఫ్యాన్ ప్రభంజనం
-
ఐపీఎల్ లో బోణీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్
-
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో YSRCP విజయకేతనం
-
గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ గెలుపు
-
IPL తొలి మ్యాచ్ లో బెంగళూరు బోణీ
-
ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదు..
-
WPL విజేత ముంబై ఇండియన్స్
-
దుబాయ్ గడ్డపై గర్జించిన టీమిండియా
-
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
-
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు
-
సీడీయూ, సీఎస్యూ కూటమిదే జర్మనీ
బెర్లిన్: ఒలాఫ్ ష్కోల్జ్ సారథ్యంలోని మైనారిటీ ప్రభుత్వం కూలిపోవడంతో అనివార్యమైన జర్మనీ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్ (సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్యూ) కూటమి ఘన విజయం సాధించింది. కడపటి వార్తలు అందేసరికి సీడీయూ,సీఎస్యూ కూటమికి 28.6 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో సీడీయూ పార్టీ చీఫ్ ఫ్రెడరిక్ మెర్జ్ తదుపరి ఛాన్స్లర్ కావడం ఖాయమైంది. వలసలను తీవ్రంగా వ్యతిరేకించే అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) పార్టీకి 20.8 శాతం ఓట్లు పడ్డాయి. గత మూడేళ్లుగా అధికారం చలాయించిన ఒలాఫ్ షోల్జ్ సారథ్యంలోని సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్డీపీ) ఈసారి మూడోస్థానానికి పరిమితమైంది. ఈ పార్టీకి కేవలం 16.4 శాతం ఓట్లు పడ్డాయి. పర్యావరణ పరిరక్షణ ఉద్యమం నుంచి పురుడపోసుకుని పార్టీగా అవతరించిన ది గ్రీన్స్ పా ర్టీకి కేవలం 11.6 శాతం వచ్చాయి. ది సారా వాగెన్ కనెక్ట్–రీజన్ అండ్ జస్టిస్ పార్టీ (బీఎస్ డబ్ల్యూ) 4.97 శాతం ఓట్లు సాధించింది. 630 సీట్లున్న బండేస్టాగ్( జర్మనీ పార్లమెంట్)లో సీడీయూ, సీఎస్యూ కూటమి అత్యధికంగా 208 చోట్ల విజయం సాధించింది. ‘‘ అతివాద ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) పార్టీకి ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగానే మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అమెరికా, రష్యాల నుంచి ఏవైనా సవాళ్లు ఎదురైతే వాటిని ఎదుర్కొని యూరప్ను ఐక్యంగా ఉంచేందుకు పోరాడతా’’ అని మెర్జ్ అన్నారు.సంకీర్ణ ప్రభుత్వం దిశగా..ఏ కూటమి/పార్టీకి స్పష్టమైన మెజారిటీరాని కారణంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. అధిక సీట్లు సాధించిన సీడీయూ, సీఎస్యూ కూటమి మూడో స్థానంలో వచ్చిన ఎస్డీపీ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే వీలుంది. రెండోస్థానంలో వచ్చిన ఏఎఫ్డీ పార్టీకి సీడీయూ,సీఎస్యూ కూటమికి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఒలాఫ్ షోల్జ్కు చెందిన ఎస్డీపీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనుందని వార్తలొచ్చాయి. అవస రమైతే నాలుగోస్థానంలో వచ్చిన గ్రీన్స్ పార్టీని ప్రభు త్వంలో కలుపుకోవాలని సీడీయూ, సీఎస్యూ కూటమి భావిస్తోంది. పెద్దపెద్ద షరతు లు పెట్టకుండా ఎస్డీపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కు కలిస్తే అంతా సవ్యంగా సాగుతుంది. లేదంటే ఏఎఫ్డీ పార్టీలోని నేతల కు ఎరవేసి తమ కూటమి లో కలుపుకునే ప్రయత్నా లను సీడీయూ, సీఎస్ యూ కూటమి ముమ్మరం చేయొచ్చు. గత మూడేళ్లుగా గ్రీన్స్, ఫ్రీ డెమొక్రటిక్ పార్టీతో కలిసి ఎస్డీపీ ప్రభుత్వాన్ని షోల్జ్ నడిపించారు. బలపడనున్న అమెరికాతో మైత్రిరష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న సీడీయూ కూటమి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఉక్రెయిన్కు ఒక రకంగా సానుకూలమైన వార్త. మెర్జ్ సారథ్యంలోని సర్కార్ ఇకమీదటా ఉక్రెయిన్కు తగు రీతిలో ఆయుధ, ఆర్థిక సాయం చేసే వీలుంది. మరోవైపు జర్మనీ, అమెరికా సత్సంబంధాలను మరింత పటిష్టం చేస్తానని మెర్జ్ సోమవారం స్పష్టంచేశారు. ‘‘ అమెరికా మాత్రమే ఎదగాలనే ‘అమెరికా ఫస్ట్’ నినాదం వాస్తవరూపం దాల్చితే అమెరికా ఒంటరి అయిపోతుంది. అలాకాకుండా ఇరుపక్షాలు లాభపడేలా జర్మనీ, అమెరికా బంధాన్ని బలపరుస్తా. అమెరికా సత్సంబంధాలను తెంచుకుంటే యూరప్ దేశాలు మాత్రమే దెబ్బతినవు. దాని విపరిణామాలను అమెరికా కూడా అనుభవించాల్సి ఉంటుంది’’ అని ఎన్నికల ముందస్తు ఫలితా లొచ్చాక తొలి మీడియా సమావేశంలో మెర్జ్ వ్యాఖ్యా నించారు. యూరప్ దేశాల కంటే దేశ స్వీయ ప్రయో జనాలకే ట్రంప్ పెద్దపీట వేస్తున్న వేళ మెర్జ్ ఈ అంశంపై మాట్లాడటం గమనార్హం. -
దాయాది పాక్ పై భారత్ ఘన విజయం
-
పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం
-
చాంపియన్స్ ట్రోఫీని భారీ విజయంతో మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా
-
గుజరాత్ పై ముంబై ఇండియన్స్ విజయం
-
మహిళల ప్రీమియర్ లీగ్ లో బోణీ కొట్టిన బెంగళూరు
-
బీజేపీ విక్టరీ.. ఆప్ ఓటమి
-
మోదీషా మంత్రాంగంతో ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్
-
కమలం అదుర్స్.. అప్ చెదుర్స్.. కాంగ్రెస్ బెదుర్స్
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం... 70 స్థానాలకు గాను బీజేపీకి 48, ఆమ్ ఆదీ పార్టీకి 22 స్థానాలు.. వరుసగా మూడోసారీ సున్నా చుట్టిన కాంగ్రెస్
-
ఆపద నుంచి ప్రజలకు విముక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో(Delhi Elections) బీజేపీ విజయం(BJP victory) సాధారణ విజయం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) చెప్పారు. దశాబ్ద కాలం తర్వాత ఆప్ద(ఆపద) నుంచి ఢిల్లీ ప్రజలకు ఎట్టకేలకు విముక్తి లభించిందని అన్నారు. బీజేపీని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ రాజధానిలో డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పించబోతున్నామని వెల్లడించారు. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఆనందం పంచుకున్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ప్రభుత్వ అవినీతి, ఆర్థిక అవకతవకలపై ‘కాగ్’ ఇచ్చిన నివేదికను బీజేపీ ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెడుతుందని చెప్పారు. అన్నిరకాల అవినీతి వ్యవహారాలపై కచ్చితంగా దర్యాప్తు చేస్తుందని పేర్కొన్నారు. జనం సొమ్మును లూటీ చేసినవారి నుంచి తిరిగి కక్కిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఇప్పటిదాకా పాలన వెలగబెట్టినవారు పచ్చి అవినీతిపరులు అని మండిపడ్డారు. షార్ట్–కట్ రాజకీయాలు చేసేవారికి ప్రజలు షార్ట్–సర్క్యూట్తో బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రజల రుణం తీర్చుకుంటాం ధూర్త, మూర్ఖ రాజకీయాలు మన దేశానికి అవసరం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆప్, కాంగ్రెస్లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఎజెండాను చోరీ చేసిందన్నారు. హిందుత్వ వేషంతో ఓట్లు రావడం లేదు కాబట్టి మిత్రపక్షాల ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోందని చెప్పారు. కాంగ్రెస్ లేవనెత్తుతున్న కులగణన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘మోదీ కీ గ్యారంటీ’ పట్ల ఢిల్లీ ప్రజలు సంపూర్ణ విశ్వాసం చూపించారని, నగరాన్ని అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటామని వివరించారు. యమునా నదిలో శుభ్రం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. మన ప్రయత్నాలను యమున మాత తప్పకుండా ఆశీర్వదిస్తుందని అన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని పునరుద్ఘాటించారు. ఢిల్లీని సరికొత్త ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి ధూర్త, మూర్ఖ రాజకీయాలు చేసే దుష్టులు దేశ రాజకీయాలను కబ్జా చేయకుండా ఉండాలంటే లక్ష మంది యువత రాజకీయ రంగంలోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో రాకపోతే దేశానికి చాలా నష్టం జరుగుతుందన్నారు. దేశానికి ఇప్పుడు రాజకీయ పరివర్తన అవసరమని తెలిపారు. 21వ శతాబ్దంలో వికసిత్ భారత్కు నూతన జీవన శక్తి, నూతన ఆలోచనలు, నూతన ఉత్సాహం అవసరమని పేర్కొన్నారు. రాజ్యంపై యుద్ధం చేస్తున్నామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష పార్టీ దేశ ప్రయోజనాల కోసం కాకుండా అర్బన్ నక్సలైట్ల కోసం రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. దేశ ప్రయోజనాలను బలిపెట్టడంలో ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ముందంజలో ఉందన్నారు. రాజకీయాల్లో మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చి నీచ రాజకీయాలు చేసేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అభివృద్ధి, సుపరిపాలనతోప్రత్యేక గుర్తింపు వచ్చిందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఢిల్లీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనలో రెండు రెట్ల వేగంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇదొక చరిత్రాత్మక విజయమని అభివర్ణించారు.ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తంచేశారు. ప్రజాశక్తికి తిరుగులేదని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎన్నికల ఫలితాల అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. చరిత్రాత్మక విజయం అందించినందుకు ఢిల్లీ ప్రజలకు సెల్యూట్ అని పేర్కొన్నారు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఇది తమ గ్యారంటీ అని స్పష్టంచేశారు. ఎన్నికల్లో విజయం కోసం శ్రమించిన బీజేపీ నేతలు, కార్యకర్తలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. -
అమ్మాయిలు అదరహో.. వరల్డ్ విజేతగా భారత్
-
టీ20 అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో జగజ్జేత భారత్
-
భారత్ గ్రాండ్ విక్టరీ
-
ఐర్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్..
-
తెలుగు టైటాన్స్ ఘోర ఓటమి..
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జోరుకు హరియాణా స్టీలర్స్ చెక్ పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్లో హరియాణా ఏకంగా 21 పాయింట్ల తేడాతో టైటాన్స్ను ఓడించింది. స్టీలర్స్ 46–25 స్కోరుతో తెలుగు టైటాన్స్ జట్టును చిత్తు చేసింది. రెయిడర్ వినయ్ (7) ఆరంభం నుంచే క్రమం తప్పకుండా పాయింట్లు తెచి్చపెట్టడంతో హరియాణా ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మరో రెయిడర్ శివమ్ పతారే (12) కూతలో పాయింట్ల వేగం పెంచడంతో స్కోరు అమాంతం పెరిగిపోయింది. మిగతా వారిలో ఆల్రౌండర్ మొహమ్మద్ రెజా (5), డిఫెండర్లు రాహుల్ (4), సంజయ్ (3) రాణించడంతో స్టీలర్స్ ఎదురులేని విజయం సాధించింది. టైటాన్స్ తరఫున స్టార్ రెయిడర్ ఆశిష్ నర్వాల్ (13) అదరగొట్టాడు. 14 సార్లు కూతకెళ్లిన ఆశిష్ రెయిడింగ్లో 11 పాయింట్లు చేశాడు. ప్రత్యర్థి రెయిడర్లు నిలువరించి రెండు టాకిల్ పాయింట్లు సాధించాడు. కెపె్టన్ విజయ్ మాలిక్ 5, డిఫెండర్ అంకిత్ 2 పాయింట్లు చేశారు. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్లో ఇప్పటి వరకు 18 మ్యాచ్లు ఆడి హరియాణా 14 మ్యాచ్ల్లో గెలిచింది.4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 72 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ జట్టు 18 మ్యాచ్ల్లో 10 విజయాలు, 8 పరాజయాలతో 54 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 30–26 స్కోరుతో పుణేరి పల్టన్పై గెలుపొందింది. దబంగ్ జట్టును కెప్టెన్ అశు మలిక్ (13) ముందుండి నడిపించాడు. 19 సార్లు రెయిడింగ్కు వెళ్లిన 13 పాయింట్లు తెచ్చి పెట్టాడు. సహచరుల్లో నవీన్ కుమార్ (4), యోగేశ్ (3), ఆశిష్ (2) స్కోరు చేశారు. పుణేరి జట్టులో అత్యధికంగా రెయిడర్ మోహిత్ గోయత్ 7 పాయింట్లు చేశాడు. మిగతా వారిలో పంకజ్ మోహితె (5), ఆకాశ్ షిండే (4), అమన్ (3) రాణించారు. దబంగ్ ఢిల్లీ 17 మ్యాచ్లు ఆడి 8 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో కలిపి మొత్తం 56 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పుణేరి పల్టన్ 18 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. 7 మ్యాచ్ల్లో నెగ్గి, 8 మ్యాచ్ల్లో ఓడింది. 3 మ్యాచ్లను ‘టై’గా ముగించింది. 49 పాయింట్లతో ఏడో ర్యాంక్లో ఉంది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్తో జైపూర్ పింక్పాంథర్స్ (రాత్రి 8 గంటల నుంచి), బెంగాల్ వారియర్స్తో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి. -
Big Question: మహారాష్ట్రలో కాషాయ ప్రభంజనం
-
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం... జార్ఖండ్ మళ్లీ ఇండియా కూటమిదే
-
మహారాష్ట్రలో భారీ మెజార్టీ దిశగా మహాయుతి
-
బిట్ కాయిన్ కి ట్రంప్ కిక్కు.. ఇన్వెస్టర్లు ఫుల్ ఖుష్..! ఇక కోట్లే..!
-
అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ హవా
-
US Election 2024: స్వర్ణయుగం తెస్తా
వాషింగ్టన్: రెండోసారి పరిపాలన మొదలెట్టాక అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచాక బుధవారం ఫ్లోరిడా రాష్ట్రంలోని వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబసమేతంగా ‘ఎలక్షన్ నైట్ వాచ్ పార్టీ ’వేదిక మీదకు వచ్చిన ట్రంప్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా సైతం పోడియం మీదకు వచ్చారు. ట్రంప్ సతీమణి మెలానియా, కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు సైతం వేదిక మీదకొచ్చారు. చిరస్మరణీయ విజయం తర్వాత జాతినుద్దేశిస్తూ వందలాది మంది మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం మునుపెన్నడూ చూడని విజయం ‘‘అమెరికాలో ఇలాంటి విజయాన్ని మునుపెన్నడూ ఎవరూ చూడలేదు. అత్యంత శక్తివంతమైన ప్రజాతీర్పు ఇది. అమెరికా చరిత్రలో అతిగొప్ప రాజకీయ ఉద్యమం ఇది. మా పార్టీ గెలుపుతో అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం రాబోతోంది. అమెరికాను మళ్లీ అత్యంత గొప్ప దేశంగా మలిచేందుకు ఈ గెలుపు మాకు సదవకాశం ఇచి్చంది. పాత గాయాలను మాన్పి దేశాన్ని మళ్లీ సరికొత్త శిఖరాలకు చేరుస్తాం. మళ్లీ మేం పార్లమెంట్పై పట్టుసాధించాం. హోరాహోరీ పోరు జరిగిన కీలక జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ లాంటి రాష్ట్రాల్లోనూ విజయం సాధించాం. అన్ని వర్గాల సమూహశక్తిగా అతిపెద్ద విస్తృతమైన ఏకీకృత కూటమిగా నిలబడ్డాం. ఇలా అమెరికా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు అంతా రిపబ్లికన్ పారీ్టకే పట్టం కట్టారు. కార్మిక, కార్మికేతర సంఘాలు, ఆఫ్రికన్–అమెరికన్, హిస్పానియన్–అమెరికన్, ఆసియన్–అమెరికన్, అర్బన్–అమెరికన్, ముస్లిం అమెరికన్ ఇలా అందరూ మనకే మద్దతు పలికారు. ఇది నిజంగా ఎంతో సుందరమైన ఘటన. భిన్న నేపథ్యాలున్న వర్గాలు మనతో కలిసి నడిచాయి. అందరి ఆశ ఒక్కటే. పటిష్ట సరిహద్దులు కావాలి. దేశం మరింత సురక్షితంగా, భద్రంగా ఉండాలి. చక్కటి విద్య అందాలి. ఎవరి మీదకు దండెత్తకపోయినా మనకు అజేయ సైన్యం కావాలి. గత నాలుగేళ్లలో మనం ఎలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినాసరే ఐసిస్ను ఓడించాం. నేనొస్తే యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని డెమొక్రాట్లు ఆరోపించారు. నిజానికి నేనొస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు దక్కిన అద్భుత విజయమిది. మరోమారు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుని నాకు అసాధారణ గౌరవం ఇచ్చిన నా అమెరికన్ ప్రజలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా ’’అని అన్నారు. సరిహద్దులను పటిష్టం చేస్తా ‘‘ప్రస్తుతం దేశం చాలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తక్షణ సాయం అవసరం. దేశ గాయాలను మేం మాన్పుతాం. దేశ సరిహద్దుల వద్ద కాపలాను మరింత పటిష్టం చేస్తాం. అదొక్కటేకాదు దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతాం. ప్రతి ఒక్క పౌరుడికి నేనొక్కటే చెబుతున్నా. మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తా. ప్రతి రోజూ పోరాడతా. మనం, మన పిల్లలు కోరుకునే స్వేచ్ఛాయుత, అత్యంత సురక్షితమైన, సుసంపన్నమైన అమెరికా కోసం నా తుదిశ్వాసదాకా కృషిచేస్తా. అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తెస్తా. ఈ మహాయజ్ఞంతో నాతోపాటు పాలుపంచుకోవాలనుకునే ప్రతి ఒక్క పౌరుడికీ ఇదే నా స్వాగతం’’అని అన్నారు. బంగరు భవితకు బాటలు వేద్దాం ‘‘మనందరం కలిసి సమష్టిగా అమెరికా ఉజ్జల భవితను లిఖిద్దాం. కలిసి కష్టపడి మన తర్వాత తరాలకు చక్కటి భవిష్యత్తును అందిద్దాం. ఎన్నికల వేళ 900 ర్యాలీలు నిర్వహించుకున్నాం. విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువకావడం వల్లే ఇప్పుడు విజయ తీరాలకు చేరగలిగాం. ఇప్పుడు దేశం కోసం అత్యంత ముఖ్యమైన పనులను మొదలెడదాం. అత్యంత మెరుగైన అమెరికాను నిర్మిద్దాం’’అని అన్నారు. ఎన్నికల బహిరంగసభలో భవనం పైనుంచి ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో స్వల్ప గాయంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం, గోల్ఫ్ క్లబ్ వద్ద మరో సాయుధుడి అరెస్ట్ ఘటనలను ట్రంప్గుర్తుచేసుకున్నారు. ‘‘గొప్ప కార్యం మీతో చేయించాలనే మిమ్మల్ని దేవు డు కాపాడాడు అని చాలా మంది నాతో చెప్పారు’’అని ట్రంప్ అన్నారు. ‘‘దేశాన్ని కాపాడి మళ్లీ గ్రేట్గా మార్చేందుకే దేవుడు నాకీ అవకాశం ఇచ్చాడనుకుంటా. ఈ మిషన్ను మనం పూర్తిచేద్దాం. ఈ పని పూర్తి చేయడం అంత సులభమేం కాదు. శక్తినంతా కూడదీసుకుని దేశభక్తి, పోరాటపటిమ, స్ఫూర్తితో ఈ ఘనకార్యాన్ని సంపూర్ణం చేద్దాం. ఇది ఉత్కృష్టమైన బా ధ్యత. ఇంతటి ఉదాత్తమైన పని ప్రపంచంలోనే లేదు. తొలిసారి అధ్యక్షుడిగా పాలించినప్పుడూ ఒక్కటే ల క్ష్యంగా పెట్టుకున్నా. ఇచి్చన హామీలను నెరవేర్చాల ని. ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను తూ.చా. తప్పకుండా అమలుచేస్తా. ‘మేక్ అమెరికా.. గ్రేట్ ఎగేన్’ను సాకారం చేసేందుకు దేశం నలుమూలల నుంచి నడుంబిగించి కదలండి. ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం ప్రయతి్నంచబోతున్నాం. సాధించబోతున్నాం’’అని ట్రంప్ అన్నారు. ఎలాన్ మస్క్ పై ప్రశంసలు ప్రసంగిస్తూ ట్రంప్ ప్రపంచ కుబేరుడు, ఎన్నికల్లో తన కోసం కోట్లు ఖర్చుచేసిన వ్యాపారదిగ్గజం ఎలాన్ మస్్కను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఇక్కడో తార(స్టార్) ఉద్భవించింది. అదెవరంటే మన ఎలాన్ మస్్క. ఆయనో అద్భుతమైన వ్యక్తి. ప్రజలు ప్రకృతి వైపరీతాల్లో చిక్కుకుపోయినప్పుడు మస్్కకు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సాయపడింది. నార్త్కరోలినాలో హెలెన్ హరికేన్ వేళ స్టార్లింక్ ఎంతో సాయపడింది. అందుకే ఆయన్ను నేను ఇష్టపడతా. అసాధ్యాలను సుసాధ్యం చేశారు. స్పేస్ఎక్స్ వారి స్టార్íÙప్ కార్యక్రమంలో భాగంగా అత్యంత భారీ రాకెట్ బూస్టర్ను పునరి్వనియోగ నిమిత్తం మళ్లీ పసిపాపలాగా లాంచ్ప్యాడ్పై అద్భుతంగా ఒడిసిపట్టారు. మస్్కకు మాత్రమే ఇది సాధ్యం. ఆ ఘటన చూసి నేను భవిష్యత్తరం సినిమా అనుకున్నా. ఇంతటి ఘనత సాధించిన మస్క్ లాంటి మేధావులను మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు ప్రపంచంలో కొందరే ఉన్నారు’’అని ట్రంప్ అన్నారు. జేడీ వాన్స్ను పొగిడిన ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు ఇతనే అంటూ జేడీ వాన్స్ను ట్రంప్ సభకు పరిచయం చేశారు. ‘‘ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ సరైన వ్యక్తి. ఆయన భార్య ఉషా సైతం అద్భుతమైన మహిళ. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం చూపడంలో జేడీ వాన్స్కు ఎవరూ సాటిరారు. రిపబ్లికన్ పార్టీని విమర్శించే, ఆగర్భ శత్రువులుగా తయారైన కొన్ని మీడియా కార్యాలయాలకు చర్చకు వెళ్తారా? అని నేను అడిగితే వెంటనే ఓకే అనేస్తారు. సీఎన్ఎన్కు వెళ్లాలా?, ఎంఎస్ఎన్బీసీకి వెళ్లాలా? అని నన్నే ఎదురుప్రశ్నిస్తారు. ముక్కుసూటిగా దూసుకుపోయే, వైరివర్గాన్ని చిత్తుచేసే నేత’’ అంటూ వాన్స్ను ట్రంప్ ఆకాశానికెత్తేశారు. శక్తివంతంగా తిరిగొచ్చారు: వాన్స్ ‘‘మళ్లీ గెలిచి అత్యంత శక్తివంతంగా తిరిగొచి్చన అతికొద్ది మంది నేతల్లో ఒకరిగా ట్రంప్ నిలిచారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ పునరాగమనం ద్వారా ట్రంప్ సారథ్యంలో మేం దేశ ఆర్థిక ప్రగతి రథాన్ని ఉరకలు పెట్టిస్తాం. నాపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్ష పదవికి నన్ను ఎంపిక చేసిన ట్రంప్కు కృతజ్ఞతలు’’అని జేడీ వాన్స్ అన్నారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభంజనం.. ఇప్పటికే 294 ఎలక్టోరల్ ఓట్లు కైవసం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ట్రంప్ గెలిచారు?.. మరి మనకేంటి?
-
డొనాల్డ్ ట్రంప్ గెలుపు వెనుక ఎలాన్ మస్క్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో అపరకుబేరుడు ఎలాన్ మస్క్ పాత్రను తీసిపారేయలేం. మొదటి నుంచి ట్రంప్కు మద్ధతు పలుకుతూ వచ్చిన మస్క్.. బైడెన్ ప్రభుత్వంపైనా, పోటీదారు కమలా హారిస్పైనా అదే స్థాయిలో విమర్శలతో చెలరేగిపోయాడు. అదే టైంలో.. సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’కి బాస్గా ఎలాన్ మస్క్ నడిపించిన ఉద్యమం కూడా ట్రంప్ గెలుపులో కీలకభూమిక పోషించింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్కు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ పరోక్షంగా ఉపయోగపడింది. మస్క్ తన సోషల్ మీడియా వేదికలపై ప్రముఖులతో కలిసి ట్రంప్కు అనుకూలంగా ప్రచారం చేశారు. అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం, ట్రంప్ గెలుపుతో అమెరికన్లకు కలిగే ప్రయోజనాలతో పాటు వివిధ సున్నిమైన అంశాల గురించి చర్చించారు. ఆ చర్చలే ఓటర్లకు దగ్గరయ్యేలా చేసింది. పలు సందర్భాల్లో ప్రజల్లో ట్రంప్పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా మస్క్ తన వ్యూహ, ప్రతివ్యూహాలతో ఆకట్టుకున్నారు. అన్నింటికంటే ముందు.. ట్రంప్పై గతంలో విధించిన సోషల్ మీడియా బ్యాన్ను ఎత్తిపారేశారాయన.ఇదీ చదవండి: కమలా హారిస్పై డొనాల్డ్ ట్రంప్ ఘన విజయంట్రంప్కు బహిరంగ మద్దతు వ్యాపార వ్యవహరాల్లోనే కాదు రాజకీయంగా మస్క్.. ట్రంప్కు ప్రత్యక్షంగా మద్దతు పలికారు. వాస్తవానికి 2016, 2020 ఎన్నికలలో ట్రంప్కు మస్క్ పరోక్ష మద్దతిచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో మస్క్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్కు మద్దతు పలికారు. అలాగే.. ట్రంప్ హామీలు, గత పాలనలో నిర్ణయాలను విపరీతంగా ప్రమోట్ చేశారు. కుటుంబ నియంత్రణ, అంతరిక్ష పరిశోధనలు, ఆర్థిక జాతీయవాదం వంటి అంశాలపై మద్దతు పలకడంతో కోట్లాది మంది మస్క్ అభిమానులు సైతం ట్రంప్కు ఓటు వేసేందుకు ఉపయోగపడింది. మస్క్ను నమ్మారు!ట్రంప్కు మస్క్ మద్దతు ఇవ్వడంతో.. ఆయన కంపెనీలైన టెస్లా, స్పేస్ఎక్స్ ఆవిష్కరణలతో పాటు పెట్టుబడిదారులు, వినియోగదారులు లబ్ధి చేకూరొచ్చని భావించారు. పన్నులు, ఇంధనం, రాయితీ వంటి హామీలపై మస్క్ ఎక్కువ ఫోకస్ చేశారు. పెట్టుబడిదారుల నుంచి వినియోగదారుల వరకు మస్క్ మాటల్ని నమ్మారని, కాబట్టే మస్క్ అభిమానుల ఓట్లు ట్రంప్కు పడేలా చేశాయని విశ్లేషకుల అభిప్రాయం. ఎలాన్ మస్క్ చేసిన పోస్టులే..సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ క్రేజ్ అంతా ఇంతా కాదు. స్వేచ్ఛ పేరుతో.. ఎలాంటి అంశంపైన అయినా స్పందిస్తుంటారు. మీడియా, టెక్నాలజీలతో పాటు ఉన్నత రంగాల ప్రముఖుల పట్ల జోబైడెన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలుమార్లు ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ అంశం ట్రంప్కు బాగా కలిసొచ్చింది. ప్రపంచకుబేరుల జాబితాలో మస్క్ ముందు వరుసలో ఉండడం, ఆకట్టుకునేలా మాటలు ట్రంప్కు అనుకూలంగా పనిచేశాయి.ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో మస్క్ మరింత చురుకైన పాత్ర పోషిస్తే, ట్రంప్కు ప్రయోజనం చేకూర్చేలా అమెరికన్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ఆయా సోషల్ మీడియా వేదికలపై ప్రస్తావించారు. టెక్నాలజీ, ఆర్థిక సమస్యలు, సంస్కృతి వంటి అంశాల ట్రంప్కు అనుకూలంగా మారాయి.వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ జోక్యం, వ్యక్తిగత స్వేచ్ఛపై మస్క్ వ్యక్తిగత విశ్వాసాలు ట్రంప్కు మద్దతు పలికేలా చేశాయి. వాక్ స్వాతంత్య్రం, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడంపై మస్క్.. ట్రంప్తో జతకట్టేలా చేశాయి. ట్రంప్ గెలుపులు ఈ అంశాలు కలిసొచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా ఎలాన్ మస్క్ చేసిన ప్రచారం ఓటర్ల శైలిని మార్చేసిందనే చెప్పొచ్చు. -
గెలుపు తర్వాత ట్రంప్ సంతోష క్షణాలు.. ప్రసంగం (ఫొటోలు)
-
హరియాణా ఎన్నికల్లో గెలుపు పట్టు పట్టిన వినేశ్ ఫొగాట్
-
కమలం కమాల్!
హరియాణా. వివాదాస్పద మూడు సాగు చట్టాలపై రైతుల ఉద్యమానికి వేదికగా నిలిచిన రాష్ట్రం. అగ్నివీర్ పథకంతో ఆర్మీలో శాశ్వత నియామక అవకాశాలను కోల్పోతామని యువత తీవ్ర నిరాశంలో నిండిపోయిన రాష్ట్రం. ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ చూపిన దూకుడు, ఆపార్టీ అతి ఆత్మవిశ్వాసాన్ని కళ్లారా చూసిన రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రం పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతనూ కూడా పక్కనబెట్టి మళ్లీ కమలదళానికి అధికార పగ్గాలు అప్పజెప్పిన తీరు ఎగ్జిట్పోల్ సర్వేలనేకాదు రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. 1966లో రాష్ట్రంగా ఏర్పడ్డాక హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఇదే తొలిసారి. ఏకమైన జాట్ వ్యతిరేక వర్గాలుఎగ్జిట్ పోల్ సర్వేలు సైతం తలకిందులైన ఈ బీజేపీ విజయం వెనుక జాట్యేతర వర్గం ఓటర్లు ఉన్నారని అర్థమవుతోంది. ‘‘జాట్లు కాంగ్రెస్కు ఓటేశారు. అయితే బలమైన జాట్లను ఎదుర్కొనేందుకు జాట్యేతర వర్గాలైన ఓబీసీలు, దళితులు, అగ్రవర్ణాల ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడంలో బీజేపీ నేతలు సఫలీకృతులయ్యారు. జాట్లు పూర్తిగా ఒక్క కాంగ్రెస్కే ఓటేయకపోవడమూ బీజేపీకి లాభించింది’’ అని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్లో అధ్యయనకారుడు రాహుల్ వర్మ విశ్లేషించారు. బీజేపీ వెంటే అహిర్వాల్దక్షిణ హరియాణాలోని అహిర్వాల్ ప్రాంత ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉంటారు. 2014, 2019లో బీజేపీ విజయానికి ఈ ప్రాంత ఓటర్ల మద్దతే ప్రధాన కారణం. ఈసారి కూడా అహిర్వాల్ ఓటర్లు బీజేపీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఈసారీ అహిర్వాల్ ప్రాంతంలోని మెజారిటీ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లోనూ 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో 10 చోట్ల బీజేపీ ఘన విజయం సాధించడం గమనార్హం. హరియాణా సైబర్ కేంద్రంగా కీర్తికెక్కిన గురుగ్రామ్ సైతం బీజేపీ వెంటే నిలిచింది. ఫరీదాబాద్సహా చాలా పట్టణ ప్రాంతాల ప్రజలు మొదట్నుంచీ బీజేపీకి వెంటే నడవటం ఆ పార్టీ విజయాన్ని సులభతరం చేసింది.నాయబ్ సింగ్ సైనీ నాయకత్వంకేవలం 210 రోజుల క్రితమే సీఎంగా పగ్గాలు చేపట్టిన 54 ఏళ్ల నయాబ్ సింగ్ సైనీ తన ప్రజాకర్షక పాలనతో ఓటర్లను తన వైపునకు తిప్పుకున్నారు. గెలిస్తే ఈయననే మళ్లీ సీఎంను చేస్తానని బీజేపీ ప్రకటించడంతో ఖట్టర్ నిష్క్రమణ తర్వాత రాష్ట్రంలో పార్టీ అగ్రనేతగా అవతరించారు. హరియణా బీజేపీ మాజీ చీఫ్ అయిన సైనీ కేవలం ‘డమ్మీ సీఎం’ అంటూ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని నిరూపించారు.గ్రామపంచాయతీల వ్యయ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.21 లక్షలకు పెంచడం, గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులో కనీసం చార్జీల రద్దు, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సహా పలు అభివృద్ది పథకాలు సైనీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకాన్నిపెంచాయి. అగ్నివీర్లకు ఆర్మీ నుంచి బయటికొచ్చాక ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి యువతలో సైనీ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి..దాదాపు తొమ్మిదిన్నర ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన ఖట్టర్ పట్ల రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. దీనిని ముందే పసిగట్టిన బీజేపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అకస్మాత్తుగా ఆయనను తప్పించి సైనీని సీఎంను చేసింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ఖట్టర్ను పూర్తిగా పక్కనబెట్టింది. రాష్ట్రంలో ఎక్కడా పోస్టర్లలో కూడా ఖట్టర్ ఫొటో వేయలేదు. దీంతో సీఎం, ప్రభుత్వ వ్యతిరేకత చల్లబడిందని చెప్పొచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనబెట్టిన బీజేపీఏకంగా సీఎం ఖట్టర్ను పక్కనబెట్టిన కమలం పార్టీ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలపై దృష్టిపెట్టింది. ఏఏ స్థానాల్లో ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో వారందరికీ టికెట్లు నిరాకరించింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకతకు పోగొట్ట గలిగింది. దాదాపు 60 కొత్తముఖాలకు టికెట్ ఇచ్చి కొత్త ప్రయోగం చేసింది. రైతులను బుజ్జగించే యత్నం..వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలపై హరియాణా రైతులు ఉద్యమించిన నేపథ్యంలో రైతాంగం ఆగ్రహం పోలింగ్లో బయటపడకుండా ఉండేందుకు ఈ ఏడాది ఆగస్టులో మరో 10 పంటలను జోడించి మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రకటనతో రైతన్నలు ప్రభుత్వానికి అనుకూలంగా మారారని తెలుస్తోంది. రూ.500కే గ్యాస్ సిలిండర్రూ.500కే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కమలనేతలు హామీ ఇచ్చారు. మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, యువతకు 2 లక్షల ఉద్యోగాలు వంటి వాగ్దానాలకు ఓటర్లు ఆకర్షితులయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్రీలంక అధ్యక్షునిగా అనురకుమార విజయం
కొలంబో:శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. అధ్యక్ష ఎన్నికల్లో అనురకుమార దిసనాయకే విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అనురకుమారకు ఆధిక్యం లభించింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల్లో విజయంతో శ్రీలంక 9వ అధ్యక్షునిగా అనురకుమార ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధ్యక్ష ఎన్నికల ఓట్ల కౌంటింగ్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. -
భారత హాకీ జట్టు విజయం అద్భుతం: వైఎస్జగన్
సాక్షి,తాడేపల్లి: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు గెలుపుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్జగన్ హర్షం వ్యక్తం చేశారు. ట్రోఫీ ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో భారత జట్టు సాధించిన విజయం అద్భుతం అని వైఎస్ జగన్ కొనియాడారు.ఈమేరకు మంగళవారం(సెప్టెంబర్17)ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. భారత హాకీ జట్టుసభ్యులకు అభినందనలు తెలిపారు.ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో సాధించిన విజయం అద్భుతం.Well done, Congratulations!#AsianChampionsTrophy2024— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2024 -
ఆస్కార్ అదరహో
బాకు (అజర్బైజాన్): వరుసగా నాలుగో ఏడాది క్వాలిఫయింగ్లో మెరిపించిన ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ప్రధాన రేసులో మాత్రం తడబడ్డాడు. ఆదివారం జరిగిన సీజన్లోని 17వ రేసు అజర్బైజాన్ గ్రాండ్ప్రిలో మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిరీ్ణత 51 ల్యాప్లను ఆస్కార్ అందరికంటే వేగంగా 1 గంట 32 నిమిషాల 58.007 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆ్రస్టేలియాకు చెందిన 23 ఏళ్ల ఆస్కార్కు ఈ సీజన్లో ఇది రెండో విజయం. హంగేరి గ్రాండ్ప్రిలోనూ ఆస్కార్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన లెక్లెర్క్ 1 గంట 33 నిమిషాల 08.917 సెకన్ల సమయంతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 20వ ల్యాప్లో అప్పటి వరకు నంబర్వన్ స్థానంలో ఉన్న లెక్లెర్క్ను ఆస్కార్ పియాస్ట్రి ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు ఆస్కార్ నిలబెట్టుకొని తన కెరీర్లో రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్కు మూడో స్థానంలో, మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్కు నాలుగో స్థానంలో, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్బుల్) ఐదో స్థానంలో నిలిచారు. వీసా క్యాష్ యాప్ జట్టుకు చెందిన యుకీ సునోడా రేసును పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. 24 రేసుల ఫార్ములావన్ సీజన్లో 17 రేసులు ముగిశాక మాక్స్ వెర్స్టాపెన్ 313 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. సీజన్లోని 18వ రేసు సింగపూర్ గ్రాండ్ప్రి ఈనెల 22న జరుగుతుంది. -
Nostradamus: కమలా హారిస్దే విజయం
నవంబర్లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధిస్తారని అమెరికా ఎన్నికల నోస్ట్రడామస్గా పేరొందిన చరిత్రకారుడు అలాన్ లిచ్మన్ జోస్యం చెప్పారు. గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అలాన్ దాదాపు ఖచ్చితంగా ఊహించి చెప్పడం విశేషం. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ని్రష్కమిస్తే వాళ్ల పార్టీ గెలుపు కష్టమేనన్న ఆయన.. ఇప్పుడు హారిస్ వచ్చాక తప్పక విజయం సాధిస్తారని చెప్పడం హాట్ టాపిక్గా మారింది. డెమొక్రాట్లు అప్పగించిన కీలక బాధ్యతను స్వీకరించిన కమలా హారిస్ అంతే ధీమాతో దూసుకెళ్తూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ను ఓడించేందుకు రెడీ అయ్యారని అలాన్ అభిప్రాయపడ్డారు. ‘‘ఫలితం ఏమిటన్నది మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి బయటకు వచ్చి ఓటు వేయండి’’అని తాజాగా న్యూయార్క్ టైమ్స్కు ఇచి్చన 7 నిమిషాల వీడియో ఇంటర్వ్యూలో చెప్పారు. 1984 నుంచి విశ్లేషణలు 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్మాన్ ‘గెలుపునకు 13 సూత్రాలు’అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనావేస్తానని చెప్పారు. 2016లో ట్రంప్ గెలుస్తాడని, 2020లో బైడెన్ గెలుస్తాడని చెప్పిన మాటలు నిజం కావడం విశేషం. 2000లో అల్గోర్పై జార్జి డబ్ల్యూ బుష్ విజయం సాధించడం మినహా మిగిలిన ఫలితాలన్నీ ఆయన చెప్పినట్లుగా రావడం గమనార్హం. 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారని ప్రధాన ఒపీనియన్ పోల్స్ చెప్పగా.. లిచ్మన్ మాత్రం ట్రంప్ తిరుగులేని విజయం సాధిస్తారని అంచనా వేశారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉండగా అభిశంసనకు గురవుతారని చెప్పారు. అలాన్ చెప్పినట్లే ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు గురయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హామిల్టన్ రికార్డు
సిల్వర్స్టోన్ (ఇంగ్లండ్): ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 945 రోజుల తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో మళ్లీ విజయం అందుకున్నాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. చివరిసారి హామిల్టన్ 2021 డిసెంబర్ 5న సౌదీ అరేబియా గ్రాండ్ప్రిలో గెలుపొందాడు. సిల్వర్స్టోన్ సర్క్యూట్పై ఆదివారం జరిగిన 52 ల్యాప్ల రేసును హామిల్టన్ (మెర్సిడెస్) అందరికంటే వేగంగా ఒక గంటా 22 నిమిషాల 27.059 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఫార్ములావన్ చరిత్రలో ఒకే సర్క్యూట్పై అత్యధికంగా 9 సార్లు విజేతగా నిలిచిన డ్రైవర్గా హామిల్టన్ రికార్డు నెలకొల్పాడు. మైకేల్ షుమాకర్ (జర్మనీ) ఫ్రాన్స్లోని మాగ్నీ కోర్స్ సర్క్యూట్ లో అత్యధికంగా 8 సార్లు గెలిచాడు. తాజా గెలుపుతో షుమాకర్ రికార్డును హామిల్టన్ సవరించాడు. 24 రేసుల తాజా సీజన్లో 12 రేసులు ముగిశాక వెర్స్టాపెన్ (రెడ్బుల్) 255 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. సీజన్లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విక్టరీ
లండన్: యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం సాధించింది. అత్యధికంగా 400కి పైగా స్థానాల్లో నెగ్గి చరిత్రాత్మక విజయం కైవసం చేసుకుంది. మరోవైపు.. దశాబ్దంన్నరపాటు అప్రతిహతంగా బ్రిటన్ను ఏలిన కన్జర్వేటివ్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. రిషి సునాక్ సారధ్యంలో ఆ పార్టీ కేవలం 119 స్థానాల్లో నెగ్గి ఓటమి చవిచూసింది. గురువారం యూకే హౌజ్ ఆఫ్ కామన్స్ 650 స్థానాలకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడగా.. ఆ వెంటనే కౌంటింగ్ మొదలైంది. శుక్రవారం ఉదయం నుంచి ఫలితాలు వెల్లడయ్యాయి. ఊహించినట్లుగానే.. లేబర్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటుతూ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. లేబర్ పార్టీ 411 స్థానాల్లో నెగ్గి ఘన విజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ 119 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. లిబరల్ డెమోక్రట్స్ పార్టీ 71 స్థానాలు దక్కించుకుంది. సంబంధిత వార్త: 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎవరీ కీర్ స్టార్మర్ఇదిలా ఉంటే.. ఫలితాలు వెలువడ్డాక కాసేపటికే రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన వాళ్లకు రిషి సునాక్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే యూకే కాబోయే ప్రధాని, లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్కు అభినందనలు తెలియజేశారు. సంబంధిత వార్త: నన్ను క్షమించండి: రిషి సునాక్ఘోర పరాభవం నుంచి..2019 సార్వత్రిక ఎన్నికల్లో జెర్మీ కోర్బిన్ నేతృత్వంలో లేబర్ పార్టీ కేవలం 201 స్థానాలే గెల్చుకుంది. 1935 తర్వాత ఆ పార్టీ ఎదుర్కొన్న ఘోరమైన పరాభవం ఇదే. అదే సమయంలో బోరిస్ జాన్సన్ నేతృత్వంలో 365 స్థానాలు గెలిచి వరుసగా అధికారం కైవసం చేసుకుంది. అయితే 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీని.. ఈసారి ఓటర్లు పక్కనపెట్టేశారు. లేబర్ పార్టీని ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపించారు. వ్యతిరేకత ఇలా.. బ్రెగ్జిట్ తర్వాత మందగించిన ఆర్థిక వ్యవస్థ, అధికార పార్టీ కన్జర్వేటివ్ కుంభకోణాలు ప్రజారోగ్య వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫ్యలం, 14 ఏళ్ల పాలనలో ఐదుగురు ప్రధానుల్ని మార్చడం, వాళ్ల అనాలోచిత నిర్ణయాలు.. ఇలా కన్జర్వేటివ్ పార్టీ పట్ల జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ తర్వాత.. అనూహ్య పరిణామాల మధ్య బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టారు రిషి సునాక్. అయితే కన్జర్వేటివ్ పార్టీ ప్రజా వ్యతిరేకతను పసిగట్టి ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లారాయన. అయినప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి. Thank you, Holborn and St Pancras, for putting your trust in me again.Change begins right here. pic.twitter.com/XZfi5OIoyH— Keir Starmer (@Keir_Starmer) July 5, 2024 To the hundreds of Conservative candidates, thousands of volunteers and millions of voters:Thank you for your hard work, thank you for your support, and thank you for your vote. pic.twitter.com/GcgvI7bImI— Rishi Sunak (@RishiSunak) July 4, 2024 లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని సునాక్ ఎన్నికల ప్రచారం వర్కవుట్ కాలేదు. అదే సమయంలో.. తరచూ ప్రధానులు మారే అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని, దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని స్టార్మర్ ఓటర్లకు చేసిన విజ్ఞప్తి ఫలించింది. ఎగ్జిట్పోల్స్ నిజమయ్యాయి!యూకేలోని ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్ దిగువ సభ(హౌజ్ ఆఫ్ కామన్స్)లో ఏకంగా 410 స్థానాలు కీర్ స్మార్టర్ నేతృత్వంలో లేబర్ పార్టీ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తెలిపాయి. కన్జర్వేటివ్ కేవలం 131 స్థానాలకు పరిమితం కావొచ్చని తెలిపాయి. -
జనసంద్రలా ముంబై తీరం.. విశ్వవిజేతల విక్టరీ పరేడ్ (ఫోటోలు)
-
నా విజయానికి కారణం జగనన్నే..
-
ఆ నేత ఆలోచన 'వేరేలెవెల్'..గెలుపుని కూడా పర్యావరణ హితంగా..!
ఇటీవల లోక్సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు బాణా సంచాలతో, మిఠాయిలతో ఆ విజయోత్సాహాన్ని ఆనందంగా జరుపుకుంటారు. ఎవ్వరైనా ఇలానే చేస్తారు. మరొకందరూ వారీ మతానుసారంగా పూజలు, మొక్కలు, చెల్లించుకోవడం చేస్తారు. మహా అయితే అన్నదానాలు చేస్తారు. కానీ ఈ ఎంపీలా ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఎవ్వరూ ఆలోచించరేమో..!. అతడేమీ మిగతా అభ్యర్థుల్లా స్వేచ్ఛగా ప్రచార ర్యాలీతో ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తి కాదు. అయినప్పటికీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరువేయడమే గాక ఆ సంతోషాన్ని ఇలా సెలబ్రేట్ చేయమని తన అభ్యర్థులను కోరి..అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అతడి వినూత్న ఆలోచన చూసి..'వాటే ఎంపీ' అంటూ అంతా ప్రశంసిస్తున్నారు.అతడే అమృత్పాల్. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..కొందరు అభ్యర్థులు జైల్లో ఉన్నప్పటికీ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు.వారిలో ఒక అభ్యర్థే ఈ అమృత్పాల్. స్వతంత్ర అభ్యర్థి అమృతపాల్ సింగ్ పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇతడు రాడికల్ సిక్కు బోధకుడు, ఖలిస్థానీ అనుకూల గ్రూప్ ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత. ఖదూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి అమృతపాల్ సింగ్ దాదాపు లక్షా 90 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ప్రస్తుతం అసోం జైలులో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ను అరెస్టు చేశారు. అమృతపాల్ సింగ్ జైలులో ఉండగానే పెద్ద విజయం సాధించారు. అయితే ఈ విజయాన్ని మిఠాయలతో సెలబ్రేట్ చెయ్యొద్దని అన్నారు. అందరికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేసి వేడుక చేసుకోవాలని తన అభ్యర్థులకు సూచించారు. అంతేగాదు దాదాపు 5 లక్షల మొక్కలను పంపిణీ చేసేలా యత్నించమని అన్నారు. తాను వేడి, కాలుష్యం పట్ల ఆందోళన చెందుతున్నానని, అందువల్ల పర్వావరణ హితార్థం ఇలా మొక్కలు పంచండని అభ్యర్థులను కోరారు. వారు కూడా అతడు చెప్పినట్లు అతడి పేరుతో మొక్కలను డిస్ట్రూబ్యూట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు పర్యావరణం పట్ల స్ప్రుహ కలిగిన గొప్ప నేత అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. Amritpal requested his supporters not to distribute sweets but plants after his victory. A target of distribution of 5 lakh plants has been set. Amritpal said he is worried about the rising heat and pollution. pic.twitter.com/3FwGEztaDP— Poor Vegitarian Majdoor 🤡(Modi ka Parivar) (@Nayak_Khalnyak) June 5, 2024 (చదవండి: ఆ చిన్న సిరామిక్ మేక బొమ్మ అన్ని లక్షలా..!) -
మోదీకి దేశాధినేతల శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మూడోసారి అధికార పగ్గాలు స్వీకరిస్తున్న ప్రధాని మోదీకి పలు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధా ని రిషి సునాక్, జర్మనీ చాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ ఇలా 75 దేశాలకు చెందిన అగ్రనేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. -
Priyanka Gandhi: మీ చెల్లెల్ని అయినందుకు గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: తన సోదరుడు రాహుల్ గాంధీ ఎప్పటికీ వెనక్కి తగ్గరని, సత్యం కోసం పోరాటాన్ని ఆపబోరని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ప్రశంసించారు. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్కు బుధవారం ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. ‘‘మీరు ఎప్పుడూ తలెత్తుకొని ఉంటారు. ఎవరేం చెప్పినా, ఏం చేసినా, ఎన్నిక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మీరు వెనక్కి తగ్గరు. మీ అంకితభావాన్ని ఎవరెంతగా సందేహించినా మీరు మీపై విశ్వాసం కోల్పోరు. కోపం, విద్వేషం వంటివి మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. మీరు చాలా ధైర్యవంతులు. మీ చెల్లెల్ని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది’’ అని ప్రియాంక పోస్టు చేశారు. -
దాతల సాయంతో గెలుపు.. కాంగ్రెస్ అభ్యర్థి భావోద్వేగం
అహ్మదాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాలు కొందరికి విజయాన్ని మరికొందరికి అపజయాన్ని మిగిల్చాయి. అయితే విజయం కొందరిని అంతులేని ఆనందాన్ని ఇవ్వడంతో పాటు భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇందుకు గుజరాత్ బనస్కాంతా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి గెనిబెన్ థాకూర్ గెలుపే నిదర్శనం.తాను గెలిచినట్లు తెలియగానే థాకూర్ కౌంటింగ్ సెంటర్ వద్ద తీవ్ర భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఆమె తనవారిని పట్టుకుని ఏడ్చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే కావడం ఒకటి. ఇదే కాకుండా ఈమె తన ఎన్నికల ప్రచారానికి కావాల్సిన నిధులను క్రౌడ్ సోర్సింగ్ ద్వారా దాతల నుంచి సేకరించం మరొకటి. ఏది ఏమైనా కొందరికి ఎన్నికల్లో గెలుపు సాధారణమే అయినప్పటికీ గెనిబెన్ లాంటి వాళ్లకు మాత్రం విజయం అసాధారణమనే చెప్పొచ్చు. Geniben Thakor of Congress won historic seat in Banaskantha, Gujarat. She had to crowdsource funds to contest.Such stories needs to be cherished. pic.twitter.com/MvZtlxtmqK— Nehr_who? (@Nher_who) June 4, 2024 -
బీజేపీ నేతలుతో మోడీ సంబరాలు..
-
గెలుపుపై ఎంపీ గురుమూర్తి రియాక్షన్
-
తెలంగాణలో బలం పుంజుకున్న బీజేపీ
-
కంగనా విజయం.. ఆనందంతో తల్లి, సోదరి నృత్యం
బాలీవుడ్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ను ఓడించారు.మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమె విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో మండీ ప్రజలు ఆనందంతో నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను కంగనా సోదరి రంగోలి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలలో తల్లితో పాటు డ్యాన్స్ చేస్తున్న రంగోలి కూడా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలలో కంగనా బంధువులు, అభిమానులు కూడా ఉన్నారు. ఈ విజయం తర్వాత కంగనా ఒక పోస్ట్ను షేర్ చేశారు. దానిలో ఆమె మండీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
నా గెలుపుకు కారణం జగనన్నే
-
నవీన్ చరిష్మాకు తెర!
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నియక్ 24 ఏళ్ల పాలనకు తెర పడింది. ఆయన సారథ్యంలోని బిజూ జనతా దళ్(బీజేడీ) పార్టీ అధికారం కోల్పోయింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఒడిశా అస్మిత (ఆత్మగౌరవం) నినాదానికి తోడు బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాల ప్రచారం బీజేపీని విజయతీరాలకు చేర్చింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం 23 చోట్ల గెలిచింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన కమలం పార్టీ తొలిసారి అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 113 చోట్ల గెలిచిన బీజేడీ ఈసారి 51 చోట్ల, కాంగ్రెస్ 14 చోట్ల, సీపీఐఎం ఒకచోట గెలిచాయి. సుదీర్ఘ సీఎం రికార్డ్ మిస్ 2000 సంవత్సరం నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా పటా్నయక్ పార్టీ గెలిచి సీఎం పదవి చేపడితే దేశంలో అత్యధిక కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకునేవారు. అయితే బీజేడీ విజయయాత్రకు బీజేపీ బ్రేకులు వేసింది. హింజిలి నియోజకవర్గంలో కేవలం 4,636 ఓట్ల తేడాతో నవీన్ ఎలాగోలా గెలిచారు.పనిచేసిన ఒడిశా అస్మిత నినాదం ఈ ఎన్నికల్లో సమస్యల కంటే బీజేపీ ‘ఒడిశా అస్మిత’ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. నవీన్ పట్నియక్ అనారోగ్య కారణాలను ఆసరాగా చేసుకుని తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండియన్ బీజేడీ పారీ్టపై ఆధిపత్యాన్ని చలాయించారు. ఈ అంశాన్ని బీజేపీ విజయవంతంగా ప్రచార అస్త్రంగా మలిచింది. ఒడిశా భవిష్యత్తును స్థానికేతరుల చేతిలో పెట్టి ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేడీ తాకట్టు పెట్టిందని పాండ్యన్ లక్ష్యంగా అస్మిత నినాదాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. వ్యక్తిగతంగా పటా్నయక్ అవినీతి మరకలు లేని నేత. కానీ బీజేడీ సర్కార్లో మంత్రులఅవినీతినే ప్రధాన ప్రచారా్రస్తాలుగా మలచి బీజేపీ విజయబావుటా ఎగరేసింది. -
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
అమేథీ: అమేథీ నియోజకవర్గంలో 2019లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీనే ఓడించిన బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఈయన ఢీకొట్టగలరా? అన్న విశ్లేషకుల అనుమానాలను పటాపంచలు చేస్తూ కిశోరీ లాల్ శర్మ జయకేతనం ఎగరేశారు. మంగళవారం అమేథీ నియోజవర్గంలో çస్మృతి ఇరానీపై 1,67,196 ఓట్ల మెజారిటీతో కిశోరీ లాల్ శర్మ ఘన విజయం సాధించారు. తొలి ప్రయత్నంలోనే లక్షకుపైగా మెజారిటీ సాధించి అమేథీ కాంగ్రెస్కు కంచుకోట అని కిశోరీలాల్ మరోసారి నిరూపించారు.రాహుల్ను ఇరానీ గతంలో 55వేల ఓట్ల తేడాతో ఓడిస్తే ఈసారి ఆమెను శర్మ అంతకు మూడురెట్లకు మించి మెజారిటీతో ఓడించడం విశేషం. ‘‘ ఈ విజయం నా ఒక్కరిది కాదు. మొత్తం నియోజకవర్గ కుటుంబాలది. ఇంతటి విజయం అందించిన అమేథీ ప్రజలకు నా కృతజ్ఞతలు. ఈ విజయం అమేథీ ప్రజలు, గాంధీల కుటుంబానికే చెందుతుంది. మనది బలీయ, ప్రజాస్వామ్య భారతం అని అమేథీ చాటింది’ అని ఫలితం వెలువడ్డాక కిశోరీలాల్ వ్యాఖ్యానించారు.విజయం సాధించిన విధేయత: గాంధీల కుటుంబానికి అత్యంత విధేయుడిగా కిశోరీ లాల్ శర్మకు మంచి పేరుంది. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. శర్మ సొంత రాష్ట్రం పంజాబ్. లూథియానాకు చెందిన శర్మ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీకి సన్నిహితుడు కూడా. 1983లో రాజీవ్తోపాటు యూపీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. నాటి నుంచి స్థానిక వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 1991లో రాజీవ్ మరణానంతరం గాంధీల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. 1999లో తొలిసారిగా సోనియాగాంధీ అమేథీ నియోజవర్గంలో ఘన విజయం సాధించడంలో శర్మ కృషి దాగిఉందని అమేథీ రాజకీయ వర్గాలు చెబుతాయి.అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున అన్ని పనులు శర్మనే చూసుకునేవారు. అమేథీ, రాయ్బరేలీల్లో రాహుల్, సోనియా అందుబాటులో లేనపుడు నియోజకవర్గ సమస్యలపై పార్టీ అగ్రనాయకత్వానికి తెలియ జేయడం వంటి పనులనూ చక్క బెట్టేవారు. రాయ్బరేలీ ప్రజలతో ఈయన మంచి పరిచయం ఉంది. గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ ఓడిపోయాక నియోజకవర్గంలో కాంగ్రెస్ వ్యవహారాలను శర్మనే చూసుకున్నారు.కొంతకాలం బిహార్, పంజాబ్ రాష్ట్రాల వ్యవహారాలనూ చూశారు. అమేథీ రాజకీయాల్లో తెరవెనుకే ఉండిపోయిన కిశోరీ లాల్.. రాహుల్ ఓటమితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అయినా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించడం విశేషం. 2019 లోక్సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్పై స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదే ఊపులో బరిలో దిగిన స్మృతి ఇరానీని శర్మ ఈసారి ఇంటిబాట పట్టించారు. నియోజవర్గ సమస్యలపై పోరాటం చేసినందుకు ఫలితంగానే కిశోరీలాల్కు విజయకిరీటాన్ని ఓటర్లు కట్టబెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు.కిశోరీ భాయ్.. ముందే చెప్పా: ప్రియాంకా గాంధీకిశోరీ లాల్ గెలుపుపై పార్టీ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ‘‘ కిశోరీ భాయ్.. మొదట్నుంచీ మీ గెలుపు మీద నాకు ఏమాత్రం సందేహం లేదు. మీరు గెలుస్తారని తొలినుంచీ బలంగా నమ్ముతున్నా. మీకు, నియోజకవర్గ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ‘ఎక్స్’లో హిందీలో ట్వీట్చేశారు. -
తెలంగాణలో బీజేపీ ప్రభంజనం
-
వైఎస్సార్సీపీ విజయం ఖాయమైపోయిందని పార్టీ నేతల ధీమా
-
తమాంగ్ దెబ్బ.. ‘ఎస్కేఎమ్’ కనీవినీ ఎరుగని విజయం
గ్యాంగ్టక్: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్కేఎం) దూసుకుపోయింది. మొత్తం 32 స్థానాలకు గాను ఏకంగా 31 చోట్ల పార్టీ విజయం సాధించింది. ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్(ఎస్డీఎఫ్)ను నామరూపాల్లేకుండా చేసింది. పాతికేళ్లపాటు నిరంతరాయంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీకి 2019 ఎన్నికల్లో తొలిసారిగా ఓటమిని రుచి చూపించిన ఎస్కేఎం అధ్యక్షుడు, సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ వరుసగా రెండోసారి సీఎం కుర్చీని అధిష్టించబోతున్నారు. ఈ ఘన విజయాల వెనుక తమాంగ్ వ్యూహాలు, కృషి దాగి ఉన్నాయి.ప్రేమ్ సింగ్ తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న నేపాలీ దంపతులకు జన్మించారు. డార్జిలింగ్లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. మూడేళ్ల పాటు పాఠాలు బోధించిన తర్వాత సామాజిక సేవపై ఆసక్తి చూపించి రాజకీయం వైపు మళ్లారు. తమాంగ్ను పీఎస్ గోలేగా కూడా పిలుచుకుంటారు.1994లో పవన్ చామ్లింగ్ స్థాపించిన ఎస్డీఎఫ్ చేరి కీలక నాయకుడిగా ఎదిగారు. వరుసగా ఐదుసార్లు ఎస్డీఎఫ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 వరకు పలు రకాల మంత్రిత్వశాఖలను నిర్వహించారు.2009 ఎన్నికల తర్వాత తమాంగ్కు ఎస్డీఎఫ్తో విభేదాలు తలెత్తాయి. ఎమ్మెల్యేగా గెలిచినా పవన్ చామ్లింగ్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. మంత్రి పదవికి బదులు నామినేటెడ్ పదవి ఇచ్చారు. దీనిని తిరస్కరించిన తమాంగ్, చామ్లింగ్ బంధుప్రీతి, అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించి రాజకీయ గురువుపైనే తిరుగుబాటు చేశారు. 2009 డిసెంబర్ 21న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎస్డీఎఫ్పై నిప్పులు చెరిగారు. చివరికి 2013లో ఎస్కేఎం పేరుతో పార్టీని స్థాపించి తాజా గెలుపుతో రెండోసారి అధికారం చేపట్టబోతున్నారు. -
YSRCPదే ప్రభంజనం..
-
విజయం మనదే.. మహిళలకు పెద్దపీట..
-
బీజేపీకి పట్టం కట్టిన ఎగ్జిట్ పోల్స్..
-
ఏపీలో వైఎస్ఆర్ సీపీదే విజయం..
-
జగన్ అనే నేను..
-
మళ్లీ జగనే సీఎం..బెజవాడ గడ్డ వైఎస్ఆర్ సీపీ అడ్డా
-
మళ్లీ విజయం మనదే, ప్రజలందరి దీవెనలతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం... ‘ఎక్స్’లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రామ రాజ్యం లాంటి పరిపాలన జగనన్నకే సాధ్యం..
-
యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
న్యూఢిల్లీ:రష్యాలో జరిగిన మిలిటరీ యుద్ధ ట్యాంకు రేసుల ఛాంపియన్షిప్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ పోటీల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన డ్రైవర్ మన్దీప్సింగ్ 50 టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకుతో దూసుకెళ్లి రేసులో అలవోకగా విజయం సాధించారు. భారత జాతీయ జెండా రెపరెపలాడుతుండగా యుద్ధ ట్యాంకు దూసుకెళుతున్న వీడియోను బ్రిగేడియర్ హర్దీప్సింగ్సోహి తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో సోమవారం(మే27) పోస్టు చేశారు. ఈ ట్వీట్కు ఇండియన్ ఆర్మీ ట్యాగ్ను జత చేశారు. ఈ విజయానికిగాను ట్యాంకు డ్రైవర్ మన్దీప్సింగ్పై అభినందనలు వెల్లువెత్తు తున్నాయి. -
YSRCP దే ఘన విజయం..
-
చంద్రబాబు లా గాలి మాటలు చెప్పడు..జగన్ చెప్పాడంటే అది జరుగుతుంది
-
దేశ రాజకీయ చరిత్రలోనే YSRCP సరికొత్త చరిత్ర..
-
ఆంధ్రప్రదేశ్లో వన్స్మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ మళ్లీ గెలిస్తే.. తదుపరి ప్రధాని అమిత్ షా!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తే నరేంద్ర మోదీ.. అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మార్చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీలో సీనియర్ నేతల రాజకీయ జీవితానికి ముగింపు పలికిన మోదీ ‘ఒక దేశం, ఒకే నాయకుడు’ పేరిట ప్రమాదకరమైన మిషన్ను ప్రారంభించారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే ప్రతిపక్ష నేతలంతా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, స్టాలిన్, పినరయి విజయన్ తదితరులను మోదీ ప్రభుత్వం కచి్చతంగా జైలుకు పంపిస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టి నియంతృత్వ పాలన తీసుకురావాలన్నదే ప్రధాని లక్ష్యమని చెప్పారు. బీజేపీలోని తన ప్రత్యర్థులను రాజకీయంగా అంతం చేయాలని మోదీ భావిస్తున్నారని పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. జూన్ 4 తర్వాత ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక నిపుణులతో, ప్రజలతో మాట్లాడానని, ఎన్నికల్లో బీజేపీకి ఓడిపోవడం ఖాయమని పేర్కొ న్నారు. కేంద్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో ‘ఆప్’ చేరుతుందని, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ ఇంకా ఏం చెప్పారంటే.. ఎందుకు రాజీనామా చేయలేదంటే... ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదు. నాపై కేసు నమోదైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం వెనుక కారణం ఉంది. ఢిల్లీలో భారీ మెజారీ్టతో మేము గెలిచాం. అందుకే మాపై కక్షగట్టారు. తప్పుడు కేసులో ఇరికించి, నన్ను బలవంతంగా పదవి నుంచి దింపేయడానికి కుట్ర జరిగింది. కుట్రను ఛేదించి, బీజేపీపై పోరాటం కొనసాగించడానికే పదవికి రాజీనామా చేయొద్దని నిర్ణయించుకున్నా. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తా. ప్రజాస్వామ్యాన్ని ఖైదు చేస్తే పరిపాలన ఆగదు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే పాలన నడిపిస్తే బాగుండేది. దొంగలు, దోపిడీదారులకు బీజేపీ అడ్డాగా మారింది. అవినీతిపై పోరాటం ఎలా చేయాలో ప్రధాని మోదీ నిజంగా నేర్చుకోవాలనుకుంటే నన్ను చూసి నేర్చుకోవాలి. అవినీతిపరులను మేము జైలుకు పంపించాం. ఈ విషయంలో మా మంత్రులనూ వదిలిపెట్టలేదు’’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. హనుమాన్ ఆలయంలో పూజలు అరవింద్ కేజ్రీవాల్ శనివారం సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉన్నారు. హనుమాన్జీ ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.అమిత్ షా కోసం ఓట్లడుగుతున్న మోదీ ‘‘ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని బీజేపీ నేతలు అంటున్నారు. ఒకవేళ బీజేపీ మళ్లీ గెలిస్తే తదుపరి ప్రధానమంత్రి ఎవరవుతారో ఆ పార్టీ నాయకులు చెప్పాలి. వచ్చే ఏడాది సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధనను మోదీ తీసుకొచ్చారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుమిత్రా మహాజన్ వంటి నేతలను పక్కనపెట్టారు. శివరాజ్సింగ్ చౌహాన్, వసుంధరరాజే సింధియా, మనోహర్లాల్ ఖట్టర్, రమణ్ సింగ్ వంటి నాయకుల రాజకీయ జీవితానికి మోదీ ముగింపు పలికారు. ఇక తర్వాతి వంతు యోగి ఆదిత్యనాథ్దే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే రెండు నెలల్లోనే యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితానికి తెరపడుతుంది. ఉత్తరప్రదేశ్లో మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తారు. యోగిని రాజకీయాల నుంచి శాశ్వతంగా బయటకు పంపిస్తారు. వచ్చే ఏడాది మోదీ కూడా పదవి నుంచి తప్పుకుంటారు. అమిత్ షాను ప్రధానమంత్రిని చేస్తారు. మోదీ ఇప్పుడు అమిత్ షా కోసం ఓట్లు అడుగుతున్నారు. మోదీ ఇచి్చన గ్యారంటీలను అమిత్ షా నెరవేరుస్తారా? ఒక దేశంలో ఒకే నాయకుడు ఉండాలన్నదే మోదీ విధానం. ఇదే నియంతృత్వం. నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం నా ఒక్కడితో సాధ్యం కాదు. అందుకు 140 మంది కోట్ల ప్రజల మద్దతు, ఆశీర్వాదం కావాలి’’ -
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 383 స్థానాలు.. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీకి 22, తెలంగాణలో కాంగ్రెస్కు 9 ఎంపీ సీట్లు... టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే వెల్లడి .. ఇంకా ఇతర అప్డేట్స్
-
Lok sabha elections 2024:ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయం
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ–ఈటీజీ సర్వే పేర్కొంది. ఎన్డీఏకు 383 స్థానాలొస్తాయని, విపక్ష ఇండియా కూటమి 118 సీట్లకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. అధికార బీజేపీ ఏకంగా 344 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ తన చరిత్రలోనే అత్యల్పంగా కేవలం 37 లోక్సభ స్థానాలతో కుదేలవనుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమి ఏకంగా 49 శాతం ఓట్లు ఒడిసిపడుతుందని, ఇండియా కూటమికి 34 శాతం వస్తాయని తేల్చింది. ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 సీట్లు సాధించి లోక్సభలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. తమిళనాట డీఎంకేకు కూడా 22 స్థానాలొస్తాయని, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు 19, ఒడిశాలో బిజూ జనతాదళ్కు 11 సీట్లొస్తాయని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షోభంలో పడ్డట్టు కని్పస్తున్న ఆప్ 6 స్థానాలతో మెరుగైన ప్రదర్శన చేస్తుందని సర్వే పేర్కొనడం విశేషం. ఇక అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్కు 9 దక్కుతాయని, బీజేపీ 5, మజ్లిస్ ఒక స్థానం గెలుచుకుంటాయని వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమికి తోడు నేతల వలస తదితరాలతో కుంగిపోయిన బీఆర్ఎస్ 2 స్థానాలకు పరిమితబమవుతుందని తెలిపింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. అందులో ఒక్క బీజేపీయే ఏకంగా 303 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ కేవలం 52 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. యూపీఏకు 91, ఇతరులకు 98 సీట్లొచ్చాయి. -
మధురలో హేమ మాలినికి ముళ్లబాట?
లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. ఇదేసమయంలో ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్కు టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఎన్నికల పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన హేమ మాలినికి గట్టిపోటీ ఎదురుకానున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. నటి హేమ మాలిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ఇమేజ్పై ఆధారపడి ముందుకు సాగుతున్నారనే మాట వినిపిస్తుంటుంది. హిందుత్వ వాదం కూడా ఆమెకు కలిసివచ్చే ఫ్యాక్టర్ అని చెబుతుంటారు. ఒకవైపు హేమమాలిని ఇండియా అలయన్స్ నుండి ఒలింపియన్ బాక్సర్ విజేందర్ సింగ్తో తలపడనుండగా, మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బరిలోకి దిగిన మాజీ ఐఆర్ఎస్ అధికారి సురేష్ సింగ్ ఆమెకు పోటీనిస్తున్నారు. దీంతో హేమ మాలినికి మధుర లోక్సభ ఎన్నికలు ముళ్ల బాటను తలపిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో జాట్ల ఓట్ల శాతం అధికం. ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర భార్య అయిన హేమ మాలిని తనకు జాట్ కమ్యూనిటీ మద్దతు ఉందని గతంలో ప్రకటించారు. బాక్సర్ విజేందర్ సింగ్ హర్యానాలోని భివానీకి చెందిన ఆటగాడు. ఇప్పుడు మధురకు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యారు. బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన సురేష్ సింగ్ పదవీ విరమణ చేశాక మధురలోని ఒక విద్యా సంస్థకు అధిపతిగా ఉంటున్నారు. ఆయన పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్నారు. హేమ మాలిని మధుర, బృందావన్లలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆమె శ్రీ కృష్ణ భక్తురాలిగా పేరొందారు. అయితే యమునా నది శుద్దీకరణ, పారిశ్రామిక అభివృద్ధి తదితర స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ఆమె విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తుంటారు. కాగా 2014లో హేమమాలిని చేతిలో ఓడిపోయిన ఆర్ఎల్డీకి నేత జయంత్ చౌదరి ఇప్పుడు ఎన్డీఏతో పొత్తు కారణంగా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశలో ఓటింగ్ జరగనుంది. -
ఒంటి చేత్తో మలుపు తిప్పిన రియాన్ పరాగ్
-
రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఘన విజయం
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. ప్రాథమిక ఫలితాల ప్రకారం పుతిన్కు రికార్డుస్థాయిలో 88 శాతం ఓట్లు లభించినట్లు తెలుస్తోంది. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ మూడు రోజుల పాటు జరిగి 17న ముగిశాయి. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో పుతిన్తో కలిపి నలుగురు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. కాగా, చివరిరోజు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్నవారు పోలింగ్ కేంద్రాలకు రావాలని ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రతిపక్ష నేత నావల్నీ మద్దతుదారులు ఇచ్చిన పిలుపుతోనే చివరిరోజు ఓటర్లు పోటెతినట్లు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. కొన్నిచోట్ల బ్యాలెట్ పెట్టెల్లో ఇంకు పోశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు అరెస్టయ్యారు. బలమైన ప్రత్యర్థులు, పుతిన్ను గట్టిగా విమర్శించేవారెవరూ లేకుండానే ఎన్నికలు కొనసాగాయి. పలు యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్దఎత్తున రష్యా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. ఇదీ చదవండి.. వెనక్కి తగ్గేది లేదు.. గాజాపై దాడులు కొనసాగిస్తాం -
నో స్మోకింగ్ డే! ఆ వ్యసనానికి చెక్పెట్టే ఆహారపదార్థాలివే!
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే ట్యాగ్ లైన్లు, టీవీలోనూ, సినిమాల్లోనూ తప్పనిసరిగా కింద్ర స్రోల్ అవ్వుతుంటాయి. చూస్తారే తప్ప మారరు. పొగతాగటాన్ని అదో స్టయిల్గా, ప్రెస్టేజ్ ఇష్యూగా భావిస్తారు చాలామంది. చివరికి అనారోగ్యం బారిన పడి తనపై ఆధారపడిన కుటుంబాన్ని నట్టేట వదిలేస్తారు. ఈ వ్యసనం కారణంగా ఎన్నో కుటుంబాలో రోడ్డున పడ్డాయి. అందువల్లే దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం 'నో స్మోకింగ్ డే'ని జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆ వ్యసనం నుంచి ఎలా బయటపడాలి? అందుకు ఎలాంటి ఆహార పదార్థాలు ఉపకరిస్తాయో తెలుసుకుందామా!. ప్రతి ఏడాది మార్చి రెండో బుధవారం రోజున ఈ 'నో స్మోకింగ్ డే' పేరుతో మిలియన్ల మంది ప్రజల్లోకి పొగ సేవించకూడదనే నినాదాన్ని బలంగా తీసుకువెళ్లిన చైతన్యవంతులను చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ధూమాపానం మానేయడమే ఒక ప్రధాన ఆరోగ్య విషయమని నొక్కి చెబుతున్నారు. ఈవ్యసనాన్ని సమతుల్య ఆహారంతోనే చెక్పెట్టగలమని, అదే శక్తిమంతమైన ఆయుధం అని తెలియజేస్తున్నారు. పోగ సేవించడం మానేయడంతోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణుల. స్మోకింగ్ మానేసే ప్రతీక్షణం మీ శరీరం మెరుగుపడుతుందని అర్థం అంటున్నారు. ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం..ప్రపంచవ్యాపంగా ధూమపానం చేసేవారిలో దాదాపు 12% మంది భారతీయులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ నివేదిక భవిష్యతులలో ధూమపాన రహిత భారత్గా మారుతుందనే కొత్త ఆశను రేకెత్తించింది. ఇక ఈ ధూమపాన వ్యసనం నుంచి బయటపడేందుకు ఈ ఆహారపదార్థాలు కీలక పాత్ర వహిస్తాయనిన నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. యాంటీఆక్సిడెంట్ పవర్హౌస్: బెర్రీలు, ఆకు కూరలు, సిట్రస్ పండ్లు, క్యారెట్లు వంటి కూరగాయలు ధూమపానం వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనడానికి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. పైగా సెల్ రిపేర్ను ప్రోత్సహిస్తాయి. ఇన్ఫ్లమేషన్ ఫైటర్స్: ఫ్లాక్స్ సీడ్స్(అవిసె గింజలు), ఫ్యాటీ ఫిష్ (సాల్మన్, మాకేరెల్), వాల్నట్లలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ధూమపానంతో సంబంధం ఉన్న వాపును తగ్గించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం: బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు తీసుకుంటే పొగతాగటం వల్ల పాడైన చర్మం ఆరోగ్యవంతంగా అవుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ 'ఈ' సమృద్ధిగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్థిరమైన శక్తి మూలం: నిరంతర శక్తి కోసం క్వినోవా, బ్రౌన్ రైస్ ,ఓట్స్ వంటి తృణధాన్యాలను తీసుకోండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పైగా పొగతాగటం మానేయాలనే ఫీల్ని తీసుకువస్తుంది. కండరాల నిర్వహణకు: టోఫు, పౌల్ట్రీ, చేపలు, చిక్కుళ్ళు వంటి ప్రోటీన్ మూలాలు కండరాల మరమ్మత్తు, నిర్వహణకు మద్దతు ఇస్తుంది. పొగతాగటం వదిలేసిన తర్వాత శరీరంలో సంభవించే మార్పులను సరిచేస్తుంది. హైడ్రేషన్ కీలకం: హైడ్రేటెడ్గా ఉండటానికి నీరు, సహజ టీలు పుష్కలంగా తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపించే ధూమపానం జోలికి వెళ్లాలన్న ఆలోచనను నియంత్రిస్తుంది. (చదవండి: దాల్చిన చెక్కతో సమస్యకు చెక్పెట్టండిలా!) -
I-League 2023-24: శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు మరో విజయం
లుధియానా: ఐ–లీగ్ జాతీయ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఖాతాలో 11వ విజయం చేరింది. ఢిల్లీ ఎఫ్సీతో ఆదివారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0 గోల్ తేడాతో గెలుపొందింది. ఆట 22వ నిమిషంలో రిల్వాన్ పాస్ను హెడర్ షాట్తో లాల్రొమావియా బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. దాంతో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శ్రీనిధి జట్టు ఈ ఆధిక్యాన్ని చివరి నిమిషందాకా కాపాడుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో ప్రస్తుతం శ్రీనిధి జట్టు 36 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈనెల 17న జరిగే తదుపరి మ్యాచ్లో గోకులం కేరళ ఎఫ్సీతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. -
రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం
-
బీజేపీ థ్రిల్లింగ్ విక్టరీ.. కాంగ్రెస్కు బిగ్గెస్ట్ షాక్!
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు అయ్యింది. హిమాచల్ ప్రదేశ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఓటింగ్లో ఫలితం సమం కావడంతో డ్రా కాగా.. టాస్లో తమ అభ్యర్థి హర్ష మహాజన్ నెగ్గినట్లు బీజేపీ ప్రకటించుకుంది. దీంతో సంఖ్యా బలం లేకున్నా బీజేపీని అదృష్టం వరించినట్లయ్యింది. అయితే ఈ ఫలితంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఒక్క రాజ్యసభ సీటు ఉంది. దీనికి మంగళవారం ఓటింగ్ జరిగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 68 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో కాంగ్రెస్కు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరోవైపు బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే.. రాజ్యసభ సీటు గెల్చుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు కంటే ఐదుగురు కాంగ్రెస్కు ఎక్కువే ఉన్నారు. దీంతో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అని అంతా భావించారు. అయితే.. సంఖ్యా బలం లేకున్నా అనూహ్యంగా రాజ్యసభ బరిలో అభ్యర్థిని నిలిపింది బీజేపీ. దీంతో ఓటింగ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ జరిగిన ఓటింగ్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీకే ఓటేసినట్లు. దీంతో ఊహించని రీతిలో.. ఫలితం 34-34తో సమం అయ్యింది. డ్రా కావడంతో టాస్ అనివార్యం కాగా.. అందులో తామే నెగ్గినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత జైరామ్ థాకూర్ ప్రకటన కూడా చేశారు. అయితే.. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారనంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సర్కార్కు ముప్పు.. హిమాచల్ ప్రదేశ్ తాజా పరిణామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడింది. రాజ్యసభ ఫలితం పరిణామంతో ప్రభుత్వం మెజారిటీలో లేదని స్పష్టమవుతోందని జైరామ్ ఠాకూర్ అన్నారు. ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఠాకూర్ డిమాండ్ చేస్తున్నారు. రేపటి బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రభుత్వంపై ఫ్లోర్ టెస్ట్ ఒత్తిడికి డిమాండ్ చేస్తామని అన్నారాయన. ఒకవేళ.. అదే జరిగితే రెండేళ్లు తిరగకుండానే హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. అదే విధంగా దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. హిమాచల్ను కోల్పోతే ఆ సంఖ్య రెండుకే పరిమితం కానుంది. -
Lok Sabha elections 2024: జూన్ నుంచి మూడో టర్ము
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జూన్ నుంచి తమ మూడో టర్ము పాలన మొదలవుతుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘ఆ తర్వాత సాకారమయ్యే వికసిత భారత్ దేశ యువత కలలకు ప్రతిరూపంగా ఉంటుంది. దేశ రూపురేఖలు ఎలా ఉండాలో నిర్ణయించే పూర్తి హక్కులు వారికున్నాయి. వారి కలలే నా సంకల్పం.నా సంకల్పమే వికసిత భారతానికి హామీ. ఈ నయా భారత్లో చిన్న లక్ష్యాలకు చోటు లేదు. పెద్ద పెద్ద కలలు కంటూ వాటి సాకారానికి నిరి్వరామంగా కృషి చేస్తున్నాం. పదేళ్లుగా ఈ వేగం ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది’’ అన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా రూ.41 వేల కోట్లతో తలపెట్టిన 2,000 పై చిలుకు రైల్వే ప్రాజెక్టులకు సోమవారం ఆయన వర్చువల్గా శంకుస్థాపన చేశారు.వీటిలో 27 రాష్ట్రాల పరిధిలో 554 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి, 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్బ్రిడ్జి పనులున్నాయి. తెలంగాణలో రూ.230 కోట్లతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లతో 17 రైల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లకు మోదీ భూమి పూజ చేశారు. రూ.221 కోట్లతో పూర్తయిన 3 రైల్ ఫ్లై ఓవర్, 29 రైల్ అండర్ పాస్లను జాతికి అంకితం చేశారు.కాంగ్రెస్ పాలనలో రైల్వే శాఖ రాజకీయ క్రీడలకు వేదికగా కునారిల్లిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. తమ పాలనలో పదేళ్లుగా ఆధునికతను అందిపుచ్చుకుని దూసుకుపోతోందన్నారు. ‘‘కొన్నేళ్లుగా భారత్ అన్ని రంగాల్లోనూ శరవేగంగా ప్రగతి సాధిస్తోంది. పన్నుల రూపేణా ప్రజలు చెల్లిస్తున్న ప్రతి రూపాయినీ వారి సంక్షేమానికే వెచి్చస్తున్నాం. గత కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్లను ప్రారంభించా’’ అని చెప్పారు.టెక్స్టైల్ రంగ ప్రగతికి సాయంటెక్స్టైల్ రంగానికి కేంద్రం అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ చెప్పారు. ‘‘దేశాభివృద్ధిలో ఆ రంగానిది కీలక పాత్ర వికసిత భారత లక్ష్యసాధనలో టెక్స్టైల్ రంగం పాత్రను మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నాం’’ అన్నారు. భారత్ టెక్స్–2024ను మోదీ ప్రారంభించారు.‘‘వికసిత భారతానికి పేదలు, యువత, రైతులు, మహిళలు నాలుగు స్తంభాలు. వారందరికీ టెక్స్టైల్ రంగంలో గణనీయమైన పాత్ర ఉంటుంది’’ అని ఈ సందర్భంగా అన్నారు. 2014లో రూ.7 లక్షల కోట్లున్న భారత టెక్స్టైల్ రంగం విలువ ఇప్పుడు రూ.12 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. నాలుగు రోజుల భారత్ ఎక్స్పోలో 100కు పైగా దేశాల నుంచి 3,500కు పైగా ఎగ్జిబిటర్లు, 3,000 పై చిలుకు కొనుగోలుదారులు, 40 వేల మందికి పైగా వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటున్నారు. -
‘పాక్’ ఫలితాల మధ్య ఇమ్రాన్ ‘విక్టరీ స్పీచ్’
పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడబోతున్నదనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అటు ఇమ్రాన్ఖాన్.. ఇటు నవాజ్ షరీఫ్ విజయం తమదేనని చెబుతున్నారు. ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంపై పాకిస్తాన్ ఎన్నికల సంఘంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ మాజీ ప్రధాని, ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్’ (సీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఏఐ ఆధారిత ‘విక్టరీ స్పీచ్’ను విడుదల చేశారు. ఈ ప్రసంగంలో ఆయన ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్’ (పిఎంఎల్-ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ ‘లండన్ ప్లాన్’ విఫలమైందని, పోలింగ్ రోజున ఓటర్లు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో ‘నా ప్రియమైన దేశప్రజలారా.. ఇంత పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని, మీ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారు. పౌర స్వేచ్ఛను పునరుద్ధరించడానికి మీరు పునాది వేశారు. నేను కూడా ఓటు వేశాను. ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించేందుకు మీరు సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నా నమ్మకాన్ని నిలబెట్టారు. ఎన్నికల్లో భారీ ఓటింగ్ చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. మీరంతా ప్రజాస్వామ్య కసరత్తులో చురుకుగా పాల్గొనడం వల్ల ‘లండన్ ప్లాన్’ విఫలమైంది’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఇమ్రాన్ జైలులో ఉన్నా.. పాక్ యువత ఎందుకు మద్దతు పలికింది? -
భారత్కు తొలి విజయం
భువనేశ్వర్: మహిళల ప్రొ లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన భారత మహిళల జట్టు నాలుగో మ్యాచ్లో విజయం రుచి చూసింది. అమెరికా జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సవితా పూనియా బృందం 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున వందన కటారియా (9వ ని.లో), దీపిక (26వ ని.లో), సలీమా టెటె (56వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. అమెరికా జట్టుకు సేన్ కార్ల్స్ (42వ ని.లో) ఏకైక గోల్ అందించింది. భారత జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్లు, అమెరికా జట్టుకు మూడు పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే రెండు జట్లు ఈ పెనాల్టీ కార్నర్లను వృథా చేశాయి. తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్లో భారత్ మూడు పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. సోమవారం జరిగే ఐదో మ్యాచ్లో చైనాతో భారత్ ఆడుతుంది. -
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ‘అవామీ’ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 300 పార్లమెంట్ స్థానాలకు గాను 299 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, అవామీ లీగ్ ఏకంగా 223 స్థానాలు సొంతం చేసుకుంది. ఎన్నికలు అదివారం జరగ్గా, సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తుది ఫలితాలు వెలువడ్డాయి. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైన జతియా పార్టీ 11 సీట్లు గెలుచుకుంది. బంగ్లాదేశ్ కల్యాణ్ పార్టీ కేవలం ఒక స్థానంలో గెలుపొందింది. 62 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అలాగే జతియా సమాజ్ తాంత్రిక్ దళ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. అవామీ లీగ్ అధినేత, ప్రధానమంత్రి షేక్ హసీనా గోపాల్గంజ్–3 నియోజకవర్గం నుంచి అఖండ విజయం సాధించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్కు ఆమె ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. హసీనా రికార్డు 76 ఏళ్ల షేక్ హసీనా 2009 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొత్తంగా ఆమె ప్రధాని అవుతుండడం ఇది ఐదోసారి. బంగ్లా చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్టతో పాటు మరో 15 పార్టీలు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఈసారి కేవలం 41.8 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 80 శాతానికి పైగా నమోదవడం విశేషం. ఇండియా గొప్ప మిత్రదేశం భారత్ తమకు గొప్ప మిత్రదేశమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కొనియాడారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇరుగుపొరుగు దేశాలైన భారత్–బంగ్లాదేశ్ ఎన్నో సమస్యలను కలిసి పరిష్కరించుకున్నాయని చెప్పారు. 1971, 1975లో భారత్ తమకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. తనకు, సోదరికి, కుటుంబ సభ్యులకు ఆశ్రయం కలి్పంచిందని అన్నారు. ఇండియాను తమ పక్కింటిలాంటి మిత్రదేశంగా భావిస్తామని తెలిపారు. ఇండియాతో తమకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. -
Sheik Hasina: ఎన్నికల్లో విజయం.. బంగ్లా ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఢాకా: ఐదోసారి బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన అవామీ లీగ్ చీఫ్, దేశ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సహజంగానే బంగ్లాదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే నా లక్ష్యం. 2041కల్లా బంగ్లాదేశ్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. స్మార్ట్ ఎకానమి, స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ప్రజలు నా లక్ష్యాలు’ అని ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లు గెలిచి ఘన విజయం సాధించిన తర్వాత హసీనా అన్నారు. ఆదివారం జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలను ఆ దేశ ప్రధాన పతిపక్ష పార్టీ బహిష్కరించింది. ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. దీంతో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ విజయం ఎన్నికల ముందే దాదాపు ఖరారైంది. అయితే ప్రతిపక్ష బీఎన్పీ పార్టీ ఉగ్రవాదులతో కుమ్మక్కై ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడిందని, వారు ఎన్నికలను బహిష్కరించి తనను గెలిపించలేదని, బంగ్లాదేశ్ ప్రజలను గెలిపించారని హసీనా అన్నారు. ఇదీచదవండి..మళ్లీ తీవ్రమవుతున్న యుద్ధం


