ఢిల్లీ: బిహార్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఎన్డీఏ విజయభేరి మోగించింది. బిహార్లో ఎన్డీయే విజయం అపూర్వం, చరిత్రాత్మకం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. విజయంతో ఆశీర్వదించిన బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘‘ప్రతిపక్షాల అబద్దాలను మా కార్యకర్తలు తిప్పికొట్టారు. బిహార్ అభివృద్ధి, సాంస్కృతికగుర్తింపునకు కృషి చేస్తాం. బిహార్ తీర్పు నూతన సంకల్పంతో పనిచేయడానికి శక్తినిచ్చింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. బిహార్లో ఎన్డీఏ సునామీ సృష్టించింది. 200 స్థానాలకు పైగా ఎన్డీఏ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇవాళ ఢిల్లీలో బీజేపీ ఆఫీస్కు ప్రధాని మోదీ రానున్నారు.
Good governance has won.
Development has won.
Pro-people spirit has won.
Social justice has won.
Gratitude to each and every person of Bihar for blessing the NDA with a historical and unparalleled victory in the 2025 Vidhan Sabha elections. This mandate gives us renewed…— Narendra Modi (@narendramodi) November 14, 2025


