
భారత అండర్-19 జట్టుతో జరగనున్న వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB) ప్రకటించింది. ఇంగ్లీష్ అండర్-19 జట్టుకు థామస్ రెవ్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్ చోటు దక్కించుకున్నాడు.
రాకీ ప్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకునేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటివరకు 5 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన రాకీ.. 15.22 సగటుతో 137 పరుగులు చేశాడు. అదేవిధంగా 8 లిస్ట్-ఎ మ్యాచ్లలో అతడి పేరిట 167 పరుగులు ఉన్నాయి. అంతేకాకుండా యూత్ టెస్టులలో ఓ సెంచరీ కూడా ఈ జూనియర్ ప్లింటాప్ సాధించాడు.
ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు యూత్ వన్డేల సిరీస్ జూన్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండు మల్టీ-డే మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టుకు యువ సంచలనం అయూష్ మాత్రే సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ వంటి చిచ్చరపిడుగులు ఉన్నారు.
ఇంగ్లండ్ అండర్-19 టీమ్
థామస్ రెవ్ (కెప్టెన్), రాల్ఫీ ఆల్బర్ట్, బెన్ డాకిన్స్, జేద్న్ డెన్లీ, రాకీ ఫ్లింటాఫ్, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, జేమ్స్ ఇస్బెల్, బెన్ మేయెస్, జేమ్స్ మింటో, ఐజాక్ మొహమ్మద్, జోసెఫ్ మూర్స్, సెబ్ మోర్గాన్, అలెక్స్ వేడ్.
భారత అండర్-19 జట్టు
ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు, హర్వాన్ష్ పంగాలియా, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహా, ప్రణవ్ సింఘేత్ రాఘవేంద్ర, మొహమ్జేద్ ఎహమ్జెనా.