ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లు.. బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిదిపై వేటు | Babar Azam, Shaheen And Naseem Rested For Remainder Of England Tests, See Details Inside | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్ట్‌లు.. బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిదిపై వేటు

Oct 13 2024 4:48 PM | Updated on Oct 14 2024 10:40 AM

Babar, Shaheen And Naseem Rested For Remainder Of England Tests

ఇంగ్లండ్‌తో జరుగబోయే రెండు, మూడు టెస్ట్‌ల కోసం పాకిస్తాన్‌ జట్టును ఇవాళ (అక్టోబర్‌ 13) ప్రకటించారు. ఈ జట్టు నుంచి సీనియర్లు బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిది, నసీం షా, సర్ఫరాజ్‌ అహ్మద్‌లకు ఉద్వాసన పలికారు. విశ్రాంతి పేరుతో వీరందరిని పక్కకు పెట్టారు. డెంగ్యూతో బాధపడుతున్న అబ్రార్‌ అహ్మద్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. 

వీరి స్థానాల్లో హసీబుల్లా, మెహ్రాన్‌ ముంతాజ్‌, కమ్రాన్‌ గులామ్‌, ఫాస్ట్‌ బౌలర్‌ మొహమ్మద్‌ అలీ, ఆఫ్‌ స్పిన్నర్‌ సాజిద్‌ ఖాన్‌ పాక్‌ జట్టుకు ఎంపికయ్యారు. తొలి టెస్ట్‌ కోసం​ తొలుత ఎంపికై, ఆతర్వాత రిలీజ్‌ చేయబడిన నౌమన్‌ అలీ, జహిద్‌ మెహమూద్‌ మరోసారి ఎంపికయ్యారు. 

16 మంది సభ్యుల ఈ జట్టుకు షాన్‌ మసూద్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. సౌద్‌ షకీల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. పాక్‌ సెలెక్షన్‌ ప్యానెల్‌లోకి కొత్తగా అలీమ్‌ దార్‌, ఆకిబ్‌ జావిద్‌, అజహార్‌ అలీ చేరిన విషయం తెలిసిందే. వీరి బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే సీనియర్లపై వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇంగ్లండ్‌తో రెండు, మూడు టెస్ట్‌లకు పాక్‌ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్‌), సౌద్ షకీల్ (వైస్‌ కెప్టెన్‌), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్‌కీపర్‌), కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్‌), నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా , జాహిద్ మెహమూద్.

ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం​ ఇంగ్లండ్‌ జట్టు పాక్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 500కుపైగా పరుగులు చేసినప్పటికీ ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. అబ్దుల్లా షఫీక్‌ (102), షాన్‌ మసూద్‌ (151), అఘా సల్మాన్‌ (104 నాటౌట్‌) సెంచరీలతో కదం తొక్కడంతో 556 పరుగులు చేసింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌.. జో రూట్‌ డబుల్‌ సెంచరీ (262), హ్యారీ బ్రూక్ ట్రిపుల్‌ సెంచరీతో‌ (317) విరుచుకుపడటంతో రికార్డు స్కోర్‌ (823/7 డిక్లేర్‌) చేసింది. 267 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాక్‌ ఊహించని విధంగా పతనానికి (220 ఆలౌట్‌) గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అఘా సల్మాన్‌ (63), ఆమెర్‌ జమాల్‌ (55 నాటౌట్‌) పాక్‌ పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు.

చదవండి: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఔట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement