సింగరాయకొండ: స్థానిక శ్రీచైతన్య నవోదయ స్కూల్ యాజమాన్యం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్టల్ను మూసి వేయాలంటూ శనివారం తౌషిక్ తల్లి సయ్యద్ మౌలాబీ స్కూల్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన దీక్ష చేసింది. హాస్టల్కు అనుమతుల విషయమై విద్యాశాఖ అధికారులు స్పందించాలని కోరుతూ ఆమె ప్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ తన కుమారుడి మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని నిరసన దీక్ష చేస్తున్న మౌలాబీ ఇప్పుడు అనుమతులు లేని హాస్టల్ను మూసి వేయాలంటూ దీక్ష చేస్తోంది.


