తెలుగు పద్యాలు, కవితలు, కథలు, వ్యాసాలు, ప్రసంగాలు, పద్య పఠనం వంటి అంశాలను ఆసక్తికరంగా బోధిస్తూ మాలో తెలుగు ఉపాధ్యాయురాలు ఆకవీటి సరోజ సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలి గా ఎంపిక కావడంతో ఎంతో సంతోషంగా ఉంది. భాషాభివృద్ధి, విద్యార్థుల్లో భాషాభిమానాన్ని పెంపొందించడం, సాహిత్యంపై ఆసక్తిని కలిగించడంతో తెలుగుపై మాకు మక్కువ ఏర్పడింది. హజరత్గూడెం పాఠశాలలో వంటగది, భోజనశాల, గ్రంథాలయం ఏర్పాటులో, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించారు. మేడమ్ సొంత నిధులతో పాఠశాలలో వసతులు ఏర్పాటు చేశారు. – వల్లంశెట్టి మాధవి,
పదో తరగతి, హజరత్గూడెం జెడ్పీ హైస్కూల్


