రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు | Sakshi
Sakshi News home page

రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు

Published Fri, May 10 2024 5:38 AM

TTD Chairman Bhumana Karunakar Reddy challenged Ramoji Rao

ఆ డబ్బులిస్తే ‘ఈనాడు’లో వైఎస్‌ జగన్‌కు అనుకూలంగా రాస్తానన్నారు 

ప్రమాణం చేసి కాదని చెప్పగలరా? 

రామోజీరావుకు టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి సవాల్‌ 

సినిమా టికెట్‌ కోసం రూ.2 దొంగిలించిన దొంగ బాబు

సాక్షి, తిరుపతి: ‘రామోజీరావు నాకు చాలా సన్ని హితులు. నేను ఆయనను 15 సార్లకుపైగా కలి శా. ఒకసారి వెళ్లి కలిసినప్పుడు రామోజీరావు.. ‘కరుణాకర్‌రెడ్డి గారు.. రూ.2వేల కోట్లు జగన్‌ నుంచి ఇప్పిస్తే ఈనాడంతా మీ గు­రించే రాస్తాం’ అన్నారు. ఇది వాస్తవం.. ఏ ప్రమాణానికైనా నేను సిద్ధం. తన బిడ్డలు, మన­వళ్లపై ప్రమాణం చేసి కాదని రామోజీ చెప్పగ­లరా’ అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తిరుపతిలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రామోజీ కుమారుడు సుమన్‌ త­నకు బాగా తెలుసన్నారు. ఒకసారి కలి­సిన సమ­యంలో సుమన్‌ తన తండ్రి అన్న­మా­టలను త­నకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. రామోజీÆకి తాను పుట్టలేదన్నారని.. అటు­వంటి నైజం తన తండ్రిదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో తాను దోపిడీ చేసి­నట్టయితే ఏ విచారణకైనా సిద్ధమని సవాల్‌ విసిరారు.

 1974లో రాడికల్‌ స్టూడెంట్‌ నాయ­కుడిగా ఉన్న సమయంలో నిధుల సేకరణ కోసం తిరుపతిలో ‘చక్రపాణి’ సినిమాను బెనిఫిట్‌ షోగా వేశామని తెలిపారు. అప్పుడు వర్సిటీలో చంద్రబాబుని తాను శ్రీధర్, హైకోర్టు అడ్వకేట్‌ సారధి వెళ్లి కలిశామన్నారు. ఆ సమయంలో బాబు కూర్చొని, ఆయన స్నేహి­తుడు పడు­కుని ఉన్నాడన్నారు. సినిమా టికెట్‌ కొనుగోలు చేయాలని అడిగితే.. నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో ఉన్న రూ.2లను బాబు దొంగిలించి తన చేతిలో పెట్టారని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement