‘రాజమాత కుటుంబం బ్రిటిష్‌ వాళ్లకి సహాయం చేసింది’ | Trinamool says Amrita Roy's family helped British | Sakshi
Sakshi News home page

‘రాజమాత కుటుంబం బ్రిటిష్‌ వాళ్లకి సహాయం చేసింది’

Mar 26 2024 11:24 AM | Updated on Mar 26 2024 11:40 AM

Trinamool says Amrita Roy family helped British - Sakshi

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలో భాగంగా బీజేపీ పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర స్థానంలో రాజమాత అమ్రితా రాయ్‌ని బరిలోకి దించింది. దీంతో ఆమె ఎవరూ అని సోషల్‌మీడియాలో చర్చ జరిగింది. అయితే అదే స్థానంలో గతేడాది ఎంపీ సభ్యత్వం కోల్పోయిన  తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) నేత మహువా మొయిత్రా పోటిలో ఉంది. దీంతో టీఎంసీ అమ్రితా రాయ్‌పై విమర్శలకు తెరలేపింది. ఆమె  రాజకుటుంబం భారత  దేశాన్ని పాలించిన బ్రిటిష్‌వారి పక్షమని మండిపడింది. కృష్ణానగర్‌ను పరిపాలించిన  రాజు రాజా కృష్ణచంద్ర రాయ్‌.. బెంగాల్‌ నవాబ్‌ సిరాజ్ ఉద్‌ దౌలా బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో బ్రిటీష్‌ వారికి సాయం చేసి అనుకూలంగా పనిచేశారని టీఎంసీ నేత కునాల్‌ ఘోష్‌ విమర్శించారు.

‘బెంగాల్‌ నవాబ్‌ సిరాజ్ ఉద్‌ దౌలా బ్రిటిష్‌వారి వ్యతిరేకంగా పోరాడుతున్నసమయంలో  కృష్ణా నగర్‌ రాజకుటుంబం బ్రిటీష్‌వారికి సాయం చేసిందని చరిత్ర చెబుతోంది.  అనాడు రాజా కృష్ణచంద్ర రాయ్‌.. బ్రిటీష్‌ బలగాలు సాయం  చేశారు. బీజేపీ వీర్‌సావర్కర్‌ పార్టీ. ఈ పార్టీ మహాత్మ గాంధీ హత్యకు బాధ్యత వహించాలి. బ్రిటీష్‌వారికే సాయం చేసిన కుటుంబాన్ని ఎన్నికల బరిలో దించింది బీజేపీ. మహువా  మొయిత్రా దేశంలోని అవినీతిపై పోరాటం చేస్తోంది’ అని కునాల్‌ ఆరోపణలు చేశారు.

టీఎంసీ విమర్శలపై రాజమాత అమ్రితా రాయ్‌ స్పందించారు. తన కుటుంబంపై చేస్తున్నఆరోపణలు అసత్యాలని తెలిపారు. ‘టీఎంసీ చేసే ఆరోపణలను భారత్‌, బెంగాల్‌లో ఎవరూ నమ్మరు. నా కుటుంబంపై చేస్తున్న విమర్శలు అసత్యం. ​మహారాజా కృష్ణ చంద్ర రాయ్‌ బ్రిటిష్‌ పక్షమన్న ఆరోపణ నిజం కాదు. ఆయన అలా ఎందుకు చేశాడు?. ఆయన అలా చేసిఉంటే ఇక్కడ హిందుత్వం ఉండేదా? సనాతన ధర్మం ఉండేదా?  ఆయన బెంగాల్‌కు మరో గుర్తింపు తీసుకువచ్చారు. మత వ్యతిరేకత నుంచి రాజా కృష్ణచంద్ర రాయ్‌ మనల్నీ కాపాడారని ఎందుకు అనుకోకుడదు?’అని ఆమె టీఎంసీ కౌంటర్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement