మేం దాడులకు దిగితే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పారిపోతారు

TPCC Working President Mahesh Kumar Goud Warned BRS MLAs - Sakshi

చావులోనూ సాయన్నకు బాధ మిగిల్చారు: మహేశ్‌కుమార్‌   

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రతిదా­డుల­కు దిగితే బీఆర్‌ఎస్‌ ఎ­మ్మె­ల్యేలు రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్ప­డతాయని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కు­మార్‌గౌడ్‌ హె­చ్చ­రించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అవినీతిపై పోస్టర్లు అంటిస్తున్నారన్న కారణంగా వరంగల్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ నేత తోట పవన్‌పై దాడి చేయడం హేయమని మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆగ్ర­హం వ్యక్తంచేశారు.

తోట పవన్‌పై బీఆర్‌­ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అనుచరులు కిరాతకంగా దాడిచేశారని, హత్య చేసేందుకు యత్నించారని, వినయ్‌భాస్కర్‌తో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహేశ్‌కు­మార్‌ డిమాండ్‌ చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యే­గా గెలిచిన దళిత నాయకుడు సాయన్నకు ప్రభుత్వం గౌరవం ఇవ్వదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దళితులంటే గౌరవం లేదని, కనీసం అధికారిక లాంఛనాలతో కూడా సాయన్న అంత్యక్రియలు పూర్తి చేయకుండా చావులో కూడా సాయన్నకు బాధను మిగిల్చారని మహేశ్‌ ఆవేదన వ్యక్తంచేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top