కదిరిలో బయటపడ్డ టీడీపీ కుట్ర రాజకీయాలు | TDP Conspiracy Politics Exposed In The Kadir Over Municipal Chairperson, More Details Inside | Sakshi
Sakshi News home page

కదిరిలో బయటపడ్డ టీడీపీ కుట్ర రాజకీయాలు

Apr 22 2025 10:06 AM | Updated on Apr 22 2025 11:04 AM

Tdp Conspiracy Politics Exposed In The Kadiri

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో టీడీపీ కుట్ర రాజకీయాలు బయటపడ్డాయి. ముస్లిం మహిళను మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవి నుంచి దించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసింది. కదిరి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ నజీమున్నీసాపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. దీంతో వైఎస్సార్‌సీపీ కదిరి సమన్వయకర్త మక్బూల్‌ విప్ జారీ చేశారు. బలం లేకపోయినా కదిరి మునిసిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు టీడీపీ ప్రలోభాలకు దిగుతోంది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, వైఎస్సార్‌సీపీ-30, టీడీపీ-5, ఇండిపెండెంట్ 1 కౌన్సిలర్లు ఉన్నారు. డబ్బు, బెదిరింపులతో 20 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ కొనుగోలు చేశారు.

మడకశిర.. భగ్గుమన్న టీడీపీ నేతల మధ్య విభేదాలు
మడకశిర నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే ఈరన్నల మధ్య  వివాదం నెలకొంది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మాజీ ఎమ్మెల్యే ఈరన్న చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైఖరిపై మాజీ ఎమ్మెల్యే ఈరన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తన కొడుకు డాక్టర్ సునీల్‌ను అభ్యర్థిగా ప్రకటించారని.. చివరి నిమిషంలో బీ-ఫాం ఇవ్వలేదు.. అయినప్పటికీ ఎంఎస్ రాజు గెలుపు కోసం కృషి చేశాం.. మా వర్గానికి ఎంఎస్ రాజు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement