breaking news
Conspiracy Politics
-
హద్దు మీరుతున్న రెడ్ బుక్.. కోర్టులు తిడుతున్నా సిగ్గు లేదా..
-
కదిరిలో బయటపడ్డ టీడీపీ కుట్ర రాజకీయాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో టీడీపీ కుట్ర రాజకీయాలు బయటపడ్డాయి. ముస్లిం మహిళను మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి నుంచి దించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసింది. కదిరి మున్సిపల్ ఛైర్పర్సన్ నజీమున్నీసాపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. దీంతో వైఎస్సార్సీపీ కదిరి సమన్వయకర్త మక్బూల్ విప్ జారీ చేశారు. బలం లేకపోయినా కదిరి మునిసిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు టీడీపీ ప్రలోభాలకు దిగుతోంది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, వైఎస్సార్సీపీ-30, టీడీపీ-5, ఇండిపెండెంట్ 1 కౌన్సిలర్లు ఉన్నారు. డబ్బు, బెదిరింపులతో 20 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను టీడీపీ కొనుగోలు చేశారు.మడకశిర.. భగ్గుమన్న టీడీపీ నేతల మధ్య విభేదాలుమడకశిర నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే ఈరన్నల మధ్య వివాదం నెలకొంది. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై మాజీ ఎమ్మెల్యే ఈరన్న చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైఖరిపై మాజీ ఎమ్మెల్యే ఈరన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తన కొడుకు డాక్టర్ సునీల్ను అభ్యర్థిగా ప్రకటించారని.. చివరి నిమిషంలో బీ-ఫాం ఇవ్వలేదు.. అయినప్పటికీ ఎంఎస్ రాజు గెలుపు కోసం కృషి చేశాం.. మా వర్గానికి ఎంఎస్ రాజు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే ఈరన్న ఆరోపించారు. -
Big Question: ఏడుకొండల్ని రాజకీయాల గుట్టగా మార్చిన బాబు
-
అక్రమ కేసులు.. కుట్ర రాజకీయాలు.. కూటమి నేతలపై రోజా ఫైర్
సాక్షి, చిత్తూరు జిల్లా: చిత్తూరు సబ్ జైలులో ఉన్న నగరి మండలం దేసురు అగరం టీడీపీ నాయకుల అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. ‘‘వైఎస్సార్సీపీ నాయకులకు బెయిల్ వచ్చే లోపే.. మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పక్కన పెట్టి పీటీ వారెంట్, కేసులు అన్ని ఒకే చోట విచారించాలని చెప్తున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు.. కూటమి నేతలు చెప్పినట్లు ప్రవర్తిస్తే కచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలో వస్తుంది. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మారిపోయింది’’ అని రోజా దుయ్యబట్టారు.‘‘ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం అభ్యర్ధిని ఓడించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, వీధి వీధిలో బెల్ట్ షాపులు ఎక్కువై పోయాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు చేస్తుంటే నిద్ర పోతున్నారా అని అడుగుతున్నా. హోం మంత్రి ఇంటికి సమీపంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్రం గంజాయి, డ్రగ్స్కు అడ్డాగా మారిపోయింది’’ అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్ చేసిన మరో పనిని తన ఖాతాలో వేసుకునే పనిలో బాబు
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్
-
ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర రాజకీయాలు.. డైవర్షన్ పాలిటిక్స్పై జనం ఆగ్రహం