శ్రీరాములు ఆస్తి రూ.72 కోట్లు..  సతీమణి భాగ్యలక్ష్మి ఆస్తి రూ.22కోట్లు | Sriramulu total assets are worth 72 crore | Sakshi
Sakshi News home page

శ్రీరాములు ఆస్తి రూ.72 కోట్లు..  సతీమణి భాగ్యలక్ష్మి ఆస్తి రూ.22కోట్లు

Apr 14 2024 8:52 AM | Updated on Apr 14 2024 8:52 AM

Sriramulu's total assets are worth 72 crore - Sakshi

సాక్షి బళ్లారి: బళ్లారి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బీ.శ్రీరాములు తన స్థిర, చర ఆస్తి వివరాలను ప్రకటించారు. ఆయన లోక్‌సభ ఎన్నికల బరిలో దిగిన నేపథ్యంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఈసందర్భంగా నామినేషన్‌ పత్రాల్లో ఎన్నికల అఫిడవిట్‌లో తన పేరు మీద రూ.72.45 కోట్ల చర, స్థిర ఆస్తులు ఉన్నట్లు, తన భార్య భాగ్యలక్ష్మి నామినేషన్‌ సమర్పించిన నేపథ్యంలో ఆమె తన పేరుమీద రూ.22.57 కోట్ల చర, స్థిర ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

శ్రీరాములు అఫిడవిట్‌లో పేర్కొన్న విధంగా మొత్తం తన ఆస్తుల్లో రూ.32.88 కోట్లు చర, రూ.39.65 కోట్ల స్థిరాస్తి ఉందని, దీంతో పాటు రూ.6.70 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే తన భార్య భాగ్యలక్ష్మి పేరు మీద రూ.2.57 కోట్ల చరాస్తి, రూ.20 కోట్ల స్థిరాస్తి ఉందని వివరించారు. మొత్తం మీద గత ఏడాది దాదాపు రూ.50 లక్షలు వివిధ రూపాల్లో ఆదాయం వచ్చిందని, భార్య పేరుతో రూ.9లక్షలు, కుమారుడి పేరుతో దాదాపు రూ.2 లక్షలు ఆదాయం లభించిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement