ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేశారు | Sanjay Raut On Maharashtra Results: this cannot be public decision | Sakshi
Sakshi News home page

ఎన్డీయే ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసింది: మహా ఫలితాలపై సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు

Nov 23 2024 10:43 AM | Updated on Nov 24 2024 4:24 AM

Sanjay Raut On Maharashtra Results: this cannot be public decision

సంజయ్‌ రౌత్‌ మండిపాటు  

ముంబై:  మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయని శివసేన(ఉద్ధవ్‌) అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను(ఈవీఎం) ట్యాంపరింగ్‌ చేసి మహాయుతి గెలిచిందని మండిపడ్డారు. తమకు దక్కాల్సిన సీట్లను దొంగిలించిందని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ కూటమి విజయం వెనుక పెద్ద కుట్ర ఉందని తేల్చిచెప్పారు.

 బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ సాయంతో ఆ కూటమి నెగ్గిందని విమర్శించారు. అదానీ బీజేపీకి ‘లాడ్లీ భాయ్‌’గా మారిపోయాడని ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు ప్రజల వాస్తవ తీర్పును ప్రతిబింబించడం లేదని చెప్పారు. ప్రజలు ఏం కోరుకున్నారో తమకు తెలుసని, మహాయుతి పాలన పట్ల వారు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ఈ ఫలితాలను ప్రజా తీర్పుగా తాము భావించడం లేదన్నారు. ప్రజలు మహాయుతికి ఆఖండమైన మెజార్టీ కట్టబెట్టారంటే తాము విశ్వసించడం లేదని సంజయ్‌ రౌత్‌ తేల్చిచెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement