కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొట్టాలి

Priyanka Gandhi Fires On BRS Leaders KCR And KTR - Sakshi

అప్పుడే రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వస్తాయి.. ఖానాపూర్, ఆసిఫాబాద్‌ విజయభేరి సభల్లో ప్రియాంకా గాంధీ 

సీఎం కేసీఆర్‌ పదేళ్ల పాలనలో ప్రజలను దగా చేశారు 

మళ్లీ బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే రాష్ట్ర భవిష్యత్తు నాశనం 

ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ సర్కారు రావాలి 

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి.. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం 

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ 

బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటేనని వ్యాఖ్య  

నిర్మల్‌/సాక్షి, ఆసిఫాబాద్‌: ‘‘రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అదే కేసీఆర్‌ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు (పదవులు) ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు రావాలంటే.. కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొట్టాలి. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి..’’అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పిలుపునిచ్చారు. ప్రజలు ఇప్పటికే రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు ఓటేసి పదేళ్లు దగాపడ్డారని, మళ్లీ బీఆర్‌ఎస్‌కు వేస్తే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తామని, రెండులక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలన్నారు. ఆదివారం నిర్మల్‌ జిల్లా ఖానాపూర్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్‌ను, ఆసిఫాబాద్‌లో అజ్మీరా శ్యాంనాయక్‌ను గెలిపించాలని కోరారు. రెండు సభల్లో ప్రియాంకాగాంధీ ప్రసంగం ఆమె మాటల్లోనే.. 

‘‘ఇందిరాగాంధీ ఆదివాసీలు, గిరిజనుల గురించి ఆలోచించేవారు. వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకొచ్చారు. అందుకే ఆమె మరణించి 40 ఏళ్లు గడిచినా గిరిజనులు ఆరాధిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. కానీ కేసీఆర్‌ పదేళ్ల పాలనలో ప్రజలను దగా చేశారు. ప్రజల ఆకాంక్షలు ఒక్కటీ నెరవేర్చలేదు. యువతకు ఉపాధి కల్పించలేదు. 

కేసీఆర్‌ కుటుంబానికే ఉద్యోగాలు 
రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు రాకపోయినా కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వచ్చాయి. పరీక్షలు నిర్వహించినా పేపర్‌ లీక్‌లు జరిగాయి. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి 2 లక్షల మందికి ఉద్యోగాలిస్తాం. ప్రత్యేక రాష్ట్రంలో తమ జీవితాలు మారుతాయని ఉద్యమకారులు కలలు కన్నారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిస్తాం. ఈ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌లకు ఉద్యోగాలు ఇవ్వొద్దు. 

లక్షల కోట్ల దోపిడీ.. 
రాష్ట్రంలో కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరిట రూ.లక్షల కోట్ల దోపిడీ జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు రుణమాఫీ చేసింది. రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదు. ప్రధాని మోదీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అవినీతిపై చర్యలు చేపట్టరు. కానీ కాంగ్రెస్‌ నేతలపై మాత్రం సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే కాబట్టి అలా చేస్తున్నారు. వారికి ఒక తమ్ముడు ఎంఐఎం అధినేత.

కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఆయన సహకరిస్తున్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఇతర రాష్ట్రాల్లో 40, 50 స్థానాల్లో పోటీ చేస్తారు. తెలంగాణలో మాత్రం 9 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. కేసీఆర్‌ కర్ణాటక సర్కారుపై విమర్శలు చేస్తున్నారేగానీ.. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్నదేమిటనేది ప్రజలకు చెప్పారు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్‌కు ఒక విజన్‌ ఉంది. ఈసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలి. 

ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తాం 
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఖాతాలో వేస్తాం. బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తాం. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తాం. వరి పంటకు బోనస్‌గా రూ.500 అందజేస్తాం. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం..’’అని ప్రియాంకగాంధీ ప్రకటించారు. 

జీతేగా ఇండియా.. అంటూ.. 
క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో ఇండియా టీమ్‌ గెలవాలని కోరుకుందామని, జీతేగా ఇండియా అంటూ ఖానాపూర్‌ సభలో ప్రియాంకగాంధీ ప్రసంగాన్ని ప్రారంభించారు. సభికులతోనూ ‘జీతేగా ఇండియా..’అంటూ నినాదాలు చేయించారు. ఈ సభల కోసం ఢిల్లీ నుంచి విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు వచ్చిన ప్రియాంక.. అక్కడి నుంచి మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌రావు చవాన్, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేలతో కలసి హెలికాప్టర్‌లో ఖానాపూర్‌కు వచ్చారు. తర్వాత హెలికాప్టర్‌లోనే ఆసిఫాబాద్‌కు చేరుకున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

19-11-2023
Nov 19, 2023, 17:57 IST
తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తులంతా దారికి వచ్చారా? రెబల్స్‌గా బరిలో దిగినవారంతా ఉపసంహరించుకున్నారా? తిరుగుబాటు దారుల్లో ఇంకా ఎందరు పోటీలో ఉన్నారు?...
19-11-2023
Nov 19, 2023, 16:01 IST
ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 వరకు జిల్లాలో ఎర్ర పార్టీలకు ఏదో ఒకచోట ఎమ్మెల్యే ఉండేవారు....
19-11-2023
Nov 19, 2023, 15:06 IST
ఎన్నికలు ఏవైనా ఒకరు ఓడితేనే మరొకరు గెలుస్తారు. రాష్ట్రం అంతటా ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీ పోరాడుతున్నారు. ఆ...
19-11-2023
Nov 19, 2023, 14:14 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
19-11-2023
Nov 19, 2023, 13:20 IST
సాక్షి,పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు మరోవారం రోజుల్లో ముగియనుంది. అయినా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన...
19-11-2023
Nov 19, 2023, 12:55 IST
సాక్షి, కరీంనగర్‌/పెద్దపల్లి: శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాటు చేసే ఎన్నికల ప్రచారసభ, ఇంటింటిప్రచారం.. ఏదైనా కార్యకర్తలు మాత్రం...
19-11-2023
Nov 19, 2023, 12:34 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు వ్యాప్తంగా ‘హస్తంశ్రీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. తారుమారు రాజకీయాల పరంపర ప్రధాన పార్టీలన్నింటిలోనూ కొనసాగుతున్నప్పటికీ.....
19-11-2023
Nov 19, 2023, 12:10 IST
సాక్షి, కామారెడ్డి: దొంగ ఓట్లను నియంత్రించడానికి నాటి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ టీఎన్‌ శేషణ్‌ విశేషంగా కృషి చేశారు. ఆయన...
19-11-2023
Nov 19, 2023, 11:18 IST
సాక్షి, నిజామాబాద్‌: ఆరు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ కుయుక్తులు పన్నుతోందని, ఏరు దాటాక తెప్ప తగలేస్తుందని మంత్రి...
19-11-2023
Nov 19, 2023, 11:15 IST
సాక్షి, ఆదిలాబాద్‌: సమర్థవంత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాలెట్‌ బాక్స్‌ మొదలు...
19-11-2023
Nov 19, 2023, 09:54 IST
సాక్షి, రంగారెడ్డి/వికారాబాద్‌: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కలి్పస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌...
19-11-2023
Nov 19, 2023, 09:50 IST
సాక్షి, రంగారెడ్డి/వికారాబాద్: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏది చెప్పిందో అది కచ్చితంగా చేసి తీరుతుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌...
19-11-2023
Nov 19, 2023, 09:01 IST
సాక్షి, ఆదిలాబాద్‌: మూడు ప్రధాన పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలు ప్రజల ముందుకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఆ హామీలను...
19-11-2023
Nov 19, 2023, 05:30 IST
నిర్మల్‌: రాష్ట్రంలో 12 శాతం మంది ఓట్లను బీఆర్‌ఎస్, ఎంఐఎం నమ్ముకున్నాయని, కాంగ్రెస్‌ మతపెద్దలను నమ్ముకుందని, ఇక హిందువులు ఓటు...
19-11-2023
Nov 19, 2023, 04:45 IST
సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా నేడు(ఆదివారం) రాష్ట్రానికి రానున్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో సకలజనుల...
19-11-2023
Nov 19, 2023, 04:38 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తామని, సమర్థవంతమైన పాలనపై దృష్టిపెడతామని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల...
19-11-2023
Nov 19, 2023, 04:35 IST
సాక్షి, సిద్దిపేట:  కాంగ్రెస్‌ నేతలు తెలంగాణకు వచ్చి రూ.4 వేలు పింఛన్‌ ఇస్తామని చెబుతున్నారని, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా...
19-11-2023
Nov 19, 2023, 04:22 IST
2జీ, 3జీ, 4జీ పార్టీల నుంచి విముక్తి కల్పించాలి  బీఆర్‌ఎస్, మజ్లిస్, కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటే. అవి 2జీ, 3జీ, 4జీగా...
19-11-2023
Nov 19, 2023, 04:09 IST
గెలవగానే పెట్రోల్‌ ధరలు తగ్గిస్తాం  పెట్రోల్‌ ధరల తగ్గింపులో రాష్ట్రం, కేంద్రం కలసి పనిచేస్తే పేదలపై భారం తగ్గుతుంది. కేంద్రం తగ్గించినా కేసీఆర్‌ ఎందుకు...
18-11-2023
Nov 18, 2023, 19:18 IST
హైదరాబాద్‌:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తన మేనిషెస్టోను విడుదల చేసింది. శనివారం సాయంత్రం బీజేపీ పలు అంశాలతో...



 

Read also in:
Back to Top