ఓటు వేసిన మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ | Madhya Pradesh lok Sabha Election CM Mohan Yadav | Sakshi
Sakshi News home page

ఓటు వేసిన మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌

May 13 2024 10:06 AM | Updated on May 13 2024 10:06 AM

Madhya Pradesh lok Sabha Election CM Mohan Yadav

మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ నాల్గవ దశ పోలింగ్‌ ఈరోజు(సోమవారం) జరుగుతోంది. ఈ దశలో రాష్ట్రంలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 74 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఉజ్జయిలోని ఒక పోలింగ్‌ బూత్‌లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ఓటు వేశారు.

 

 అనంతరం ఆయన మాట్లాడుతూ తాను తన ఓటు హక్కు వినియోగించుకున్నంటుకు చాలా సంతోషిస్తున్నానని, రాష్ట్రంలోని ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో బీజేపీ 29 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ పోలింగ్‌ కేంద్రాల వద్దకు ఉదయం ఏడు గంటలకే ఓటర్లు తరలివచ్చారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement