Komatireddy Venkat Reddy Met With DK Shiva Kumar At Bangalore, Says Reports - Sakshi
Sakshi News home page

డీకేతో కోమటిరెడ్డి భేటీ.. రాజగోపాల్‌ చేరికపై చర్చ!

Jun 23 2023 11:28 AM | Updated on Jun 23 2023 1:52 PM

Komatireddy Venkat Reddy Met With DK Shiva Kumar At Bangalore - Sakshi

సాక్షి, కర్ణాటక: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. పార్టీలోకి చేరికలపై కాంగ్రెస్‌ నేతలు దృష్టి సారించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కర్ణాటకకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి భేటీ అయ్యారు. 

అయితే, బెంగళూరులో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌లో చేరికలపై ప్రధానంగా చర్చించుకునే అవకాశాలున్నాయి. మరోవైపు, కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరికపై కూడా అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో డీకే శివ కుమార్‌ పేరు హైలైట్‌ అవుతోంది. డీకే చుట్టే కాంగ్రెస్‌ రాజకీయాలు జరుగుతున్నాయి. 

ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌కు టైమొచ్చిందా?..ఆ విషయంలో సక్సెస్‌ అయ్యే ఛాన్స్‌!

Advertisement
 
Advertisement
Advertisement